Sunday, 6 February 2022

సౌత్ సినిమాల్లో అలా చేయ‌డానికి ప్ర‌య‌త్నించారు.. చాలా అవ‌మానంగా అనిపించేది.. న‌టి కామెంట్స్‌

గతంలో చాలా మంది హీరోయిన్లు బాడీ షేమ్‌కు గురయ్యారు. సోనాక్షి సిన్హా, హుమా ఖురేషి, రుబీనా లాంటి పలువురు తారలు బాడీ షేమింగ్ గురించి బహిరంగంగా మాట్లాడారు. తాజాగా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీపై షాకింగ్ కామెంట్స్ చేసింది. సోషల్ మీడియాలో గ్లామరస్ ఫొటోలతో కుర్రకారును మత్తెక్కిస్తున్న బాలీవుడ్ బ్యూటీ ఎరికా ఫెర్నాండేజ్ సౌత్ సినీ ఇండస్ట్రీపై షాకింగ్ కామెంట్స్ చేసింది. బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో సౌత్ సినిమాల్లో తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి వెల్లడించింది. ‘‘నేను అప్పట్లో చాలా సన్నగా ఉండేదాన్ని. అయితే దక్షిణాది వాళ్లకు హీరోయిన్లు కొంచెం బొద్దుగా ఉంటే ఇష్టం. నేను సౌత్ సినిమాలు చేసేటప్పుడు వాళ్లు నన్ను అలా ఉండాలని కోరుకున్నారు. అయితే ఆ సమయంలో నేను అలా లేను. అందువల్ల శరీరంపై ప్యాడ్స్ పెట్టి మేనేజ్ చేయడానికి ప్రయత్నించేవాళ్లు. వాళ్లు అలా చేస్తుంటే నాకు సిగ్గుగా ఉండేది. చాలా అవమానంగా భావించేదాన్ని. పాడ్స్ పెట్టుకుని యాక్ట్ చేయాలంటే చాలా అసౌకర్యంగా, ఇబ్బందిగా ఉండేది. వాళ్లు కోరుకున్నట్లు నేను లేనని ఎన్నోసార్లు బాధపడ్డాను. అయితే అప్పటికి, ఇప్పటికి పరిస్థితులు చాలా మారాయి. ఇప్పుడు సౌత్‌లో కూడా అందరినీ యాక్సెప్ట్ చేస్తున్నారు.’’ అని చెప్పుకొచ్చింది ఎరికా. ఎరికా 2010, 2011ల్లో వరుసగా పాంటలూన్స్ ఫెమినా మిస్ ఫ్రెష్ ఫేస్‌, పాంటలూన్స్ ఫెమినా మిస్ మహారాష్ట్రతో పాటు అనేక టైటిళ్లను గెలుచుకుంది. తర్వాత మోడల్‌గా కెరీర్ ప్రారంభించి బుల్లితెర నటిగా మారింది. ఆ తర్వాత సినిమాలు కూడా చేయడం మొదలు పెట్టింది. తమిళం, కన్నడ, తెలుగు చిత్రాల్లో నటించింది. తెలుగులో 'గాలిపటం' సినిమాలో ఒక హీరోయిన్‌గా స్వాతి పాత్రలో అలరించింది. ఎరికా 2013లో అయింతు అయింతు అయింతు (తమిళం), నిన్నిందేలే (కన్నడ), గాలిపటం (తెలుగు) మరియు 2014లో విరాట్టు (తమిళం) వంటి అనేక ప్రాంతీయ చిత్రాలలో నటించింది. అదే సంవత్సరంలో తెలుగు వెర్షన్ డేగా విడుదలైంది. ఆమె 2017లో విజితిరు (తమిళం)లో కూడా నటించింది. ఇక 2016లో ఆమె ‘కుచ్ రంగ్ ప్యార్ కే ఐసే భీ’తో టెలివిజన్‌లోకి అడుగుపెట్టింది. అక్కడ ఆమె షాహీర్ షేక్ సరసన డాక్టర్ సోనాక్షి బోస్ పాత్రను పోషించింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/8q3ftY7

No comments:

Post a Comment

'Indian Bank Aims For Rs 25 Trl Business By Dec 2030'

'In the last one year, we have added more than Rs 1.7 trillion, and we are on track.' from rediff Top Interviews https://ift.tt/tN...