Saturday 12 February 2022

Son Of India Pre Release Event : ఆ సినిమా ప్లాప్ అయ్యుంటే.. రోడ్డు మీద‌కి వ‌చ్చేవాడిని : మోహ‌న్ బాబు

‘‘‘స‌న్ ఆఫ్ ఇండియా’ సినిమా స‌మ‌యంలో విష్ణు కాస్త రిస్కే అన్నాడు. అయినా ప‌ర్లేద‌ని ముంద‌డుగు వేశాం. ఇందులో ఫ్యామిలీ అంశాలే కాదు. రాజ‌కీయ అంశాల‌ను ట‌చ్ చేశాం’’ అన్నారు క‌లెక్ష‌న్ కింగ్ డా.మంచు మోహ‌న్ బాబు. ఆయ‌న టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం ‘స‌న్ ఆఫ్ ఇండియా’ . ఈ సినిమా మార్చి 18న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా శ‌నివారం జ‌రిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మంచు మోహ‌న్ బాబు మాట్లాడుతూ ‘‘ఏ ధైర్యంతో అనుకున్నానో తెలియ‌దు. కానీ 1982లో శ్రీ ల‌క్ష్మీ ప్ర‌స‌న్న పిక్చ‌ర్స్ పేరు మీద బ్యాన‌ర్‌ను స్టార్ట్ చేసి నిర్మాత‌గా ఓ సినిమా చేయాల‌ని అనుకున్నాను. అప్ప‌ట్లో టాప్ రైట‌ర్‌గా పేరున్న ఎం.డి.సుంద‌ర్‌గారిని క‌లిశాను. ఆయన ఈ సినిమా కోసం 50 క‌థ‌లు చెప్పారు. నాకు ఏదీ న‌చ్చ‌లేదు. చివ‌ర‌గా ఓ క‌థ చెప్పారు. న‌చ్చడంతో సినిమా చేస్తాన‌ని అన్నారు. ‘ఆ సినిమాను క‌న్న‌డ‌లో రాజ్ కుమార్‌గారు ‘అన‌బ‌లం జ‌న‌బ‌లం’ పేరుతో చేశారు. కానీ సినిమా ప్లాప్ అయ్యింది ఆలోచించండి’ అని సుంద‌ర్‌గారు అన్నారు. పర్లేదు సార్! చేస్తాను అన్నాను. అంత‌కు ముందు సిల్వ‌ర్ జూబ్లీ ఇచ్చిన‌ డైరెక్ట‌ర్ సినిమా లేకుండా ఖాళీగా ఉన్నాడ‌ని తెలియ‌డంతో ఆయ‌న్ని పిలిపించాను. ఊహించండి.. అదెంత రిస్కో మ‌రి. ఆ సినిమా ప్లాప్ అయితే ఇల్లు అమ్మేసి రోడ్డు మీద‌కు వ‌చ్చేయాల్సిందే. కానీ రిస్క్ చేశాను. కొన్ని సంద‌ర్భాల్లో రిస్క్ చేయాలి. కృష్ణ‌గారి త‌మ్ముడు ఆది శేష‌గిరిరావుగారితో మంచి అనుబంధం ఉంది. ’ఓ పెద్ద సినిమా చెప్తాను, ఆ సినిమా మీద దీన్ని వెయ్‌’ అని ఆయ‌న అన్నారు. ఆ పెద్ద సినిమా పేరు చెప్ప కూడ‌దు. కానీ నా సినిమా పెద్ద హిట్ అయ్యింది. పెద్ద సినిమా ప్లాప్ అయ్యింది. కాలం క‌లిసొచ్చింది. రిస్క్ చేశాను. జీవితంలో రిస్క్ చేయ‌కుండా ముందుకు సాగ‌లేం. ఓ రోజు ఉద‌యం డైమండ్ ర‌త్న‌బాబు వ‌చ్చి ‘స‌న్ ఆఫ్ ఇండియా’ క‌థ‌ను చెప్పారు. అదే విష‌యాన్ని విష్ణుకి ఫోన్ చేసి చెప్పాను. స‌హ‌జంగా ప్ర‌తి దానికి ఆలోచించ‌మ‌ని చెప్పే విష్ణు, ఏమాత్రం ఆగ‌కుండా లోగో వేసి పంపేశాడు. త‌ర్వాత ఎప్పుడో క‌థ విన్నాను. ఈ సినిమా రిస్కే అని విష్ణు ఓ సంద‌ర్భంలో అన్నాడు కూడా. రాజ‌కీయాల గురించి అసెంబ్లీ రౌడీలో చెప్పాను. ఈ సినిమాలోనూ చెప్పాను. రాజ‌కీయంలో ప్ర‌స్తుతం ఏమేం జ‌ర‌గుతున్నాయో చెప్పాను’’ అన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/x4oFirC

No comments:

Post a Comment

'The EV Market Is Hotting Up'

'A lot of players such as Maruti and Hyundai are entering the market in the first and the second quarters of 2025.' from rediff To...