Saturday, 19 February 2022

ఆడవాళ్ళు మీకు జోహార్లు: భీమ్లా నాయక్ ఎఫెక్ట్‌.. తప్పలేదు మరి..!!

జయాపజయాలతో సంబంధం లేకుండా అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు యంగ్ హీరో . ఈ క్రమంలోనే క్రేజీ హీరోయిన్ జంటగా '' అనే సినిమా పూర్తి చేశాడు. ఈ సినిమాను ఫిబ్రవరి 25న రిలీజ్ చేయాలని మేకర్స్ ఫిక్స్ కాగా సడెన్‌గా 'భీమ్లా నాయక్' అడ్డు పడటంతో వెనక్కి తగ్గారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా విడుదలను మార్చి 4వ తేదీకి వాయిదా వేశారు. ఈ మేరకు అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేశారు. రిలీజ్ వాయిదా పడడంతో ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ని రిలీజ్‌ను కూడా వాయిదా వేశారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన సాంగ్స్, పోస్టర్స్ ప్రేక్షకుల నుంచి బెటర్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో ఓ మోస్తారు హైప్ క్రియేట్ అయింది. దీనికి తోడు ఈ మూవీ హిట్ శర్వానంద్‌కి చాలా కీలకం కానుంది. కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో రూపొందిన ఈ 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమాలో రష్మిక హీరోయిన్‌గా నటించగా.. సీనియర్ నటులు రాధిక, ఖుష్బూ, ఊర్వశి కీలక పాత్రలు పోషించారు. ఈ ముగ్గురి రోల్స్, వెన్నెల కిషోర్ కామెడీ ఈ సినిమాలో హైలైట్ కానుందని తెలుస్తోంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఆడవాళ్ళు మీకు జోహార్లు అనాల్సిందే అంటున్నారు మేకర్స్. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ (SLV సినిమాస్) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మించారు. శర్వా గత సినిమాలు పెద్దగా హిట్ కాకపోవడంతో ఈ సినిమాపై ఆయన ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. అందుకే పెద్ద సినిమాతో పోటీ వద్దని భావించి కాస్త దూరం జరిగినట్లున్నారు దర్శకనిర్మాతలు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/OQDfg4n

No comments:

Post a Comment

RBI Governor: 'Rates may remain low in near to medium term'

"It is quite possible that the rates will remain low in the near to medium term, but that will depend on how conditions evolve," s...