Thursday, 24 February 2022

త్రివిక్రమ్‌నే టార్గెట్ చేసిందా.. పూనమ్ కౌర్ ట్వీట్ అర్థమదేనా?

భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఉన్నాడా?లేదా? అసలు వచ్చాడా? అనే అనుమానం అందరిలోనూ కలిగింది. బండ్ల గణేష్ ఆడియో లీక్ ఎఫెక్ట్ అని.. అందుకే త్రివిక్రమ్ మాట్లాడలేదని, సైలెంట్‌గా ఉండిపోయాడని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా ఒక వైపు ఉంటే.. ఇక స్పీచు మీద రామ్ గోపాల్ వర్మ వేసిన ట్వీట్, దాని మీద పూనమ్ స్పందించిన తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. పవన్ కళ్యాణ్ ఎంతో సటిల్డ్‌గా మాట్లాడాడు. ఎక్కడా గాడి తప్పకుండా.. భీమ్లా నాయక్ ఈవెంట్‌లో మాట్లాడేశాడు. దీని మీద వర్మ ట్వీట్ వేశాడు. పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్పీచుల్లో ఇదే బెస్ట్ స్పీచ్.. ఎంతో ఎమోషనల్‌గా అనిపించింది అంటూ వర్మ చెప్పుకొచ్చాడు. వర్మ వేసిన ట్వీట్ మీద కౌంటర్ వేసింది. అయితే వర్మ వేసిన ట్వీట్‌ను రీట్వీట్ వేస్తూ పూనమ్ కౌర్ స్పందించింది. ఓ డైరెక్టర్ ఎదుటి వారి జీవితాలను పూర్తిగా నాశనం చేస్తాడు.. ఓ మూల నుంచి చూస్తూ ఎంజాయ్ చేస్తాడు.. బయటి జనాలు తిడుతుంటే.. సైలెంట్‌గా ఉంటాడు అని చెప్పుకొచ్చింది. ఇక ఇంకో డైరెక్టర్ అయితే ఎదుటివారిని తక్కువ చేస్తాడు.. ట్విట్టర్‌లో నవ్వుతుంటాడు. ఆ ఇద్దరూ కూడా అమ్మాయిలను ఆయుధాలుగా వాడుకుంటారు అని అనేసింది. ఇందులో ఒకరు అని అర్థమవుతోంది. ఇక ఇంకొకరు ఎవరు అని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతుండగా.. ఇంకెవరు త్రివిక్రమ్ అని ఇంకొందరు సమాధానాలు ఇస్తున్నారు. మొత్తానికి పూనమ్ ట్వీట్లు మాత్రం పజిల్‌లానే ఉంటాయి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/icPZSbh

No comments:

Post a Comment

RBI Governor: 'Rates may remain low in near to medium term'

"It is quite possible that the rates will remain low in the near to medium term, but that will depend on how conditions evolve," s...