Wednesday 9 February 2022

సాలిడ్ స్కెచ్ వేసిన చెర్రీ.. అందుకే ముంబైలో ఎక్కువగా గడుపుతున్నారా..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ మధ్య ఎక్కువగా ముంబైలో కనిపిస్తున్నారు. అందరూ సినిమా గురించో లేక బాలీవుడ్ సినిమాకు సంబంధించిన సన్నాహాలు చేస్తున్నారో అని అనుకుంటున్నారు. కానీ, అసలు విషయం అది కాదని ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతూ వైరల్ అవుతోంది. చరణ్ హీరోగా మాత్రమే కాకుండా కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీని స్థాపించి భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తున్నారు. ఇలా హీరోగా, నిర్మాతగా బిజీగా ఉన్న ఆయన వ్యాపారాలలో కూడా తలమునకలై ఉంటున్నారు. అంతేకాదు, ఇప్పుడు ఆయన నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకుంటారని నమ్మకంగా చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చరణ్ తన వ్యాపారాలను అదే పాన్ ఇండియా స్థాయిలో విస్తరించాలని భారీ స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ముంబైలో తన వ్యాపారాలను బాగా విస్తరించాలని ప్లాన్ చేసుకుంటున్నారట. చరణ్ 2013వ సంవత్సరంలో ఓ ఎయిర్ లైన్స్ కంపెనీని మొదలుపెట్టారు. దీన్ని మెల్లగా విస్తరించే పనిలో ఉన్నారట. ఇక ఇటీవల కాలంలో ఆయన ఎక్కువగా ముంబైలో కనిపిస్తూ ఉండటంతో అందరిలోనూ ఆసక్తికరమైన చర్చలు మొదలయ్యాయి. చరణ్ తరచుగా వెళ్ళేది.. ఈ వ్యాపార పనుల కోసమే అని టాక్ వినిపిస్తోంది. అయితే, నిజంగానే ఎయిర్ లైన్స్ సంస్థను విస్తరించే పని మీదే వెళుతున్నారా లేక మరేదైనా కొత్త వ్యాపారాలు మొదలు పెట్టేందుకు వెళుతున్నారా? అనేది మాత్రం తెలియడం లేదు. చరణ్ సతీమణి ఉపాసన ఆమె తాతకు సంబంధించిన అపోలో ఆసుపత్రి నిర్వహణ బాధ్యతలతో చాలా బిజీగా ఉంటున్నారు. రామ్ చరణ్ ఓ వైపు భారీ బడ్జెట్ చిత్రాలలో నటిస్తూనే..సొంత నిర్మాణ సంస్థలో కొత్త ప్రాజెక్ట్ నిర్మాణ వ్యవహారాలను చూసుకుంటున్నారు. అలాగే, వ్యాపారం మీద దృష్టి పెడుతున్నట్లు నెట్టింట వార్తలు వస్తున్నాయి. మరి ఆయన ముంబై దేని గురించి వెళుతున్నది త్వరలో క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయని చెప్పుకుంటున్నారు. ఇక చరణ్ సినిమాల విషయానికొస్తే..తండ్రి మెగాస్టార్‌తో కలిసి నటించిన ఆచార్య ఏప్రిల్ 29న భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. రాజమౌళి దర్శకత్వంలో నటించిన ఆర్ఆర్ఆర్ మార్చ్ 25న విడుదల కాబోతోంది. ప్రస్తుతం ఆయన కెరీర్‌లో చేస్తున్న 15వ సినిమా సెట్స్ మీద ఉంది. శంకర్ దీనికి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. దీనితో పాటు జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ నిర్మించే సినిమా మొదలు కావాల్సి ఉంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/iryaTGo

No comments:

Post a Comment

'The EV Market Is Hotting Up'

'A lot of players such as Maruti and Hyundai are entering the market in the first and the second quarters of 2025.' from rediff To...