లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ (92) స్వరం మూగబోయిందని తెలిసి పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. గాన కోకిలతో జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ లతా మంగేష్కర్ ఇక లేరని తెలిసి గుండె పగిలిందంటూ ఎమోషనల్ పోస్టులు పెడుతున్నారు. లతా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. నేటి ఉదయం (ఆదివారం) లతా మంగేష్కర్ కన్నుమూశారు. గత కొంతకాలంగా న్యుమోనియా సమస్యతో బాధపడుతున్న ఆమెకు ఇటీవల కరోనా సోకింది. దీంతో ఆమెను ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. గత 29 రోజులుగా చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. లతా మరణవార్త తెలిసి యావత్ సినీ లోకంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తన గాత్రంతో దశాబ్దాల పాటు సినీ లోకాన్ని మైమరిపించిన లతా మంగేష్కర్ దాదాపు 20 భాషల్లో 50 వేలకు పైగా పాటలు పాడారు. 25 వేలకు పైగా సోలో పాటలు పాడి గిన్నీస్ రికార్డులో పేరు లిఖించుకున్నారు. భారతరత్న, దాదాసాహెబ్ ఫాల్కే, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ లాంటి ఎన్నో అవార్డులతో సత్కరించబడ్డారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/84FPN5X
No comments:
Post a Comment