Sunday, 24 October 2021

సూపర్ స్టార్ మహేశ్ ఫ్యాన్స్‌కు నిరాశ.. ‘సర్కారువారి పాట’ వాయిదా?.. కొత్త రిలీజ్‌ డేట్ ఇదేనా?

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ తాజా చిత్రం ‘స‌ర్కారువారి పాట‌’. ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఔట్ అండ్ ఔట్ క‌మ‌ర్షియ‌ల్‌ ఎంట‌ర్‌టైన‌ర్ ఇది. స‌రిలేరు నీకెవ్వ‌రు వంటి భారీ హిట్ త‌ర్వాత మ‌హేశ్ చేస్తున్న సినిమా కావ‌డంతో సినిమాపై మంచి అంచ‌నాలున్నాయి. అంతే కాకుండా మ‌హేశ్ లుక్‌, టీజ‌ర్ సినిమాపై ఉన్న అంచ‌నాల‌ను మ‌రింత పెంచాయి. ఈ సినిమాను వ‌చ్చే ఏడాది సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వరి 13న విడుద‌ల చేస్తున్న‌ట్లు నిర్మాత‌లు ప్ర‌క‌టించారు. అంత వ‌ర‌కు బాగానే ఉంది. అయితే అస‌లు స‌మ‌స్య రాజ‌మౌళి ‘ఆర్ఆర్ఆర్‌’తో వ‌చ్చి ప‌డింది. మ‌హేశ్ ‘స‌ర్కారువారి పాట‌’ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసే స‌మ‌యంలో ట్రిపుల్ ఆర్‌ను ఈ ఏడాది ద‌స‌రాకు విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌ల ప్లాన్‌. కానీ కోవిడ్ సెకండ్ వేవ్ ఎఫెక్ట్‌తో జ‌క్క‌న్న సినిమాను అనుకున్న స‌మయంలో పూర్తి చేయ‌లేక‌పోయాడు. దీంతో వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 7న ‘ఆర్ఆర్ఆర్‌’ను విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ‘ఆర్ఆర్ఆర్‌’ తాజా రిలీజ్ డేట్ మ‌హేశ్ ‘స‌ర్కారువారి పాట‌’కు అడ్డంకిగా మారింది. ట్రిపుల్ ఆర్ పాన్ ఇండియా మూవీ కావడంతో పాటు రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్, ఆలియా భట్, అజయ్ దేవగణ్ వంటి స్టార్స్ నటించిన చిత్రం కావడంతో మినిమం రెండు, మూడు వారాల పాటు వేరే సినిమాలకు థియేటర్స్ దొరక్కపోవచ్చు. సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేస్తే ఇంకా అంత కంటే ఎక్కువ స‌మ‌యమే ప‌డుతుంద‌డన‌డంలో సందేహం లేదు. దీంతో ట్రిపుల్ఆర్‌కు పోటీగా వ‌స్తే.. ఆ ప్ర‌భావం ఎక్క‌డ క‌లెక్ష‌న్స్ మీద ప‌డుతుందోన‌ని ‘సర్కారువారి పాట’ నిర్మాతలు ఆలోచనలో పడ్డారు. ఇప్పుడు సినిమాను వాయిదా వేస్తేనే బెటర్ అని డిస్ట్రిబ్యూషన్ సైడ్ నుంచి కూడా సలహాలు, సూచనలు అందాయట. లేటెస్ట్‌గా ఇండ‌స్ట్రీలో వినిపిస్తోన్న గుస‌గుస‌ల మేర‌కు ‘స‌ర్కారువారి పాట‌’ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్ సందర్భంగా ఏప్రిల్ 28న విడుదల చేయాలని నిర్మాతలు అనుకుంటున్నారట. మరి ఈ వార్తలపై నిర్మాతలు ఏమైనా స్పందిస్తారేమో.. రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ ఇస్తారేమో చూడాలి. ఒక‌వేళ సినిమా నిజంగానే వాయిదా ప‌డితే మాత్రం త‌మ సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌ను థియేట‌ర్స్‌లో చూడాల‌నుకుంటున్న అభిమానుల‌కు నిరాశ ఎదురైన‌ట్లే. ప్రస్తుతం సర్కారువారి పాటు స్పెయిన్లో చిత్రీకరణను జరుపుకుంటోంది. ఎనబై శాతంకు పైగానే చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, 14 రీల్స్ ప్ల‌స్‌, జీఎంబీ ఎంట‌ర్‌టైన్మెంట్స్ ప‌తాకాల‌పై ఈ సినిమా నిర్మిత‌మ‌వుతోంది. హీరో తండ్రిని మోసం చేసి విదేశాల‌కు వెళ్లిన విల‌న్‌ను ఇండియాకు రప్పించే కొడుకు పాత్ర‌లో మ‌హేశ్ క‌నిపించ‌బోతున్నారు. కీర్తిసురేశ్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ చిత్రం తర్వాత మహేశ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే కదా.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3nFwr7Z

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....