Thursday, 28 October 2021

నాగ చైతన్యతో సమంత.. ఆ జ్ఞాపకాలన్నీ చెరిపేసిన హీరోయిన్! ఇంతలోనే అక్కడిదాకా..

అక్కినేని ఫ్యామిలీతో కట్ చేసుకున్న .. తన స్పీడు పెంచేసింది. స్వేచ్ఛగా దేశ విదేశాలు చుట్టేస్తూ ఎంజాయ్ చేస్తోంది. తనకిష్టమైన ప్రదేశాలను ఇష్టమైన స్నేహితులతో కలిసి చుట్టి వస్తోంది. విడాకుల ప్రకటన తర్వాత ఆ జ్ఞాపకాలు మరిచేలా తనలోని కొత్త కళలను వెలికితీస్తూ ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటోంది సామ్. మరోవైపు సోషల్ మీడియాలో హవా నడిపిస్తూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అప్‌డేట్స్ షేర్ చేస్తోంది. ఇంతవరకు బాగానే ఉన్నా తాజాగా సమంత చేసిన ఓ పని పలువురిని ఆశ్చర్య పరుస్తోంది. నాగ చైతన్యతో పదేళ్ళ ప్రేమ బంధానికి, నాలుగేళ్ళ వివాహ బంధానికి అక్టోబర్ 2న స్వస్తి చెప్పింది సమంత. వ్యక్తిగత కారణాల వల్ల తామిద్దరం పెళ్లి బంధానికి ఫుల్‌స్టాప్ పెడుతున్నామని, కానీ ఎప్పటికీ స్నేహితులుగా ఉంటామని చై సామ్ ఇద్దరూ ప్రకటించారు. అప్పటి నుంచి వీరి బ్రేకప్‌కు కారణాలేంటి? అక్కినేని వారింట అసలేం జరిగింది? అనే దానిపై బోలెడన్ని ఊహాగానాలు షికారు చేస్తున్నాయి. ఈ పరిస్థితుల నడుమ నాగచైతన్యతో ఉన్న జ్ఞాపకాలను చెరిపేసింది సమంత. గతంలో భార్యాభర్తలుగా ఉండగా పలు టూర్స్ వేస్తూ ఆయా ఫొటోలను తన సోషల్ మీడియా ఖాతాల్లో సమంత పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా వాటన్నింటినీ తన ఖాతాలోంచి రిమూవ్ చేసేసింది సామ్. చైతూతో తన బంధానికి గుర్తుగా ఉన్న దాదాపు 80 ఫోటోలను ఆమె డిలీట్ చేయడం అభిమానులను కాస్త బాధపెట్టింది. ఈ లెక్కన చూస్తే చైతూకి సంబంధించిన అన్ని జ్ఞాపకాలను శాశ్వతంగా చెరిపేయాలని సమంత ఫిక్సయినట్లు చెప్పుకోవచ్చు. ప్రస్తుతం సమంత దుబాయ్‌లో ఉంది. తన ఫ్రెండ్స్ సాధన, ప్రీతమ్‌లతో కలిసి ఆమె దుబాయ్‌ వెళ్ళింది. భారత్ న్యూజిలాండ్ మధ్య ఆదివారం జరిగే మ్యాచ్ కోసం అక్కడికి వెళ్లినట్టు కనిపిస్తోంది. మొత్తానికి విడాకుల ప్రకటన తర్వాత సమంత దూసుకుపోతున్న తీరు జనాల్లో హాట్ టాపిక్ అయింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3GwPTfu

No comments:

Post a Comment

RBI Governor: 'Rates may remain low in near to medium term'

"It is quite possible that the rates will remain low in the near to medium term, but that will depend on how conditions evolve," s...