Thursday, 28 October 2021

అందుకుగాను ట్విట్టర్ వేదికగా సారీ చెప్పిన Rx 100 డైరెక్టర్.. ఇదీ నిజాయితీ అంటే!!

తొలి సినిమా Rx100తోనే తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు డైరెక్టర్ . యూత్ ఆడియన్స్ కోరుకునే స్టైల్ మూవీని ప్రేక్షకుల ముందుంచి భారీ విజయం సాధించాడు. దీంతో ఒక్కసారిగా ఆయన నేమ్ టాలీవుడ్‌లో మారుమోగింది. అయితే రీసెంట్‌గా తన రెండో సినిమాగా 'మహా సముద్రం' చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చి ఆశించిన ఫలితం రాబట్టలేకపోయాడు. అయితే ఈ మూవీ రిలీజ్‌కి ముందు మహా సముద్రం మీ అందరికీ నచ్చుతుందని, మరో హిట్ పక్కా అంటూ బల్లగుద్ది చెప్పిన డైరెక్టర్.. తీరా రిలీజ్ తర్వాత చతికిలపడ్డాడు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా కొందరు నెటిజన్స్ ఆయనతో మూవీ రిజల్ట్ గురించి ప్రస్తావించారు. దీంతో ఓపెన్ అయిన అజయ్ భూపతి ట్విట్టర్ వేదికగా సారీ చెప్పాడు. ''మీ అంచనాలను అందుకోలేక పోయినందుకు క్షమించండి.. ఈ సారి మీ అందరినీ సంతృప్తి పరిచే కథతో వస్తాను'' అని పేర్కొంటూ ట్వీట్ చేశాడు అజయ్ భూపతి. ఈ ట్వీట్ చూసిన నెటిజన్స్ ఆయన నిజాయితీని మెచ్చుకుంటూ తదుపరి సినిమాకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. ఏ రంగంలో అయినా జయాపజయాలు సహజం. అయితే ఓటమిని అంగీకరించడం అనేది గొప్ప విషయం. తాజాగా అదే చేశాడు అజయ్ భూపతి. అజ‌య్ భూప‌తి దర్శకత్వంలో శ‌ర్వానంద్‌, సిద్ధార్ధ్ హీరోలుగా రూపొందిన 'మహా సముద్రం' సినిమా రూపొందింది. చిత్రంలో అతిది రావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటించాగా జగపతి బాబు, రావు రమేశ్ ముఖ్యపాత్రలు పోషించారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను రీచ్ కాలేకపోయింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3BragHt

No comments:

Post a Comment

RBI Governor: 'Rates may remain low in near to medium term'

"It is quite possible that the rates will remain low in the near to medium term, but that will depend on how conditions evolve," s...