Thursday, 21 October 2021

MAA elections: బూతులు తిట్ట‌డ‌మే ఆత్మ గౌర‌వ‌మా? ..బానిస బ‌తుకులు మీవి.. హీరో త‌నీశ్ ట్వీట్‌

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్‌(‘మా’) ఎన్నిక‌లు ముగిసి మూడు వారాలు అయిపోతుంది. కానీ ఆర్టిస్టుల న‌డుమ ‘మా’ ఎన్నిక‌లు రేపిన చిచ్చు మాత్రం త‌గ్గ‌డం లేదు. ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు. ప్ర‌కాశ్ రాజ్ ప్యానెల్ త‌ర‌పున పోటీ చేసిన ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్‌గా గెలిచిన శ్రీకాంత్ స‌హా ఎగ్జిక్యూటివ్ క‌మిటీ మెంబ‌ర్స్‌గా పోటీ చేసి గెలిచిన మెంబ‌ర్స్ అంద‌రూ రాజీనామా చేశారు. ఈ క్ర‌మంలో ‘మా’ ఎన్నిక‌ల్లో జ‌రిగిన ప‌రిస్థితుల‌ను ఉద్దేశించి హీరో త‌నీశ్ చేసిన లేటెస్ట్ ట్వీట్ వైర‌ల్ అవుతుంది. ‘‘బూతులు తిట్ట‌ట‌మే తెలుగువారి ఆత్మ గౌర‌వం అని చెప్పారు కొంద‌రు.. పాటించారు మ‌రికొంద‌రు. దండాల‌య్యా!’’ అని ట్వీట్‌తో పాటు బానిస బ‌తుకులు అని హ్యాష్ ట్యాగ్ కూడా జోడించాడు. ఇప్పుడు ఈ ట్వీట్ గురించి ఏమైనా స్పందిస్తారేమో చూడాలి. శుక్ర‌వారం ‘మా’కు సంబంధించిన శుభ‌వార్త‌ను చెబుతాన‌ని విష్ణు మంచు ట్వీట్ చేశారు. అస‌లు విష్ణు మంచు చెప్ప‌బోయే శుభ‌వార్త ఏంటి? స‌భ్యుల రాజీనామాల‌ను ఆమోదిస్తారా? లేక ‘మా’ స‌భ్య‌త్వానికి రాజీనామా చేసిన నాగ‌బాబు, ప్ర‌కాశ్‌రాజ్‌ల‌ను ఒప్పించి ‘మా’లో కొన‌సాగేలా చేశాన‌ని చెబుతారో తెలియ‌డం లేదు. కానీ త‌నీశ్ చేసిన ట్వీట్ వైర‌ల్ అవుతోంది. ‘మా’ అధ్య‌క్షుడిగా విష్ణు ఎన్నికైన మ‌రుస‌టి రోజునే ఎన్నిక‌ల్లో త‌మపై దాష్టీకం జ‌రిగింద‌ని, మోహ‌న్‌బాబు త‌మ‌ను తిట్టాడ‌ని, బూతులు మాట్లాడాడ‌ని బెన‌ర్జీ, త‌నీశ్ చెప్పారు. ఆ కార‌ణంగా తాము ‘మా’లో ఉండ‌లేమ‌ని గెలిచిన ప‌ద‌వుల‌కు రాజీనామా చేస్తున్నామ‌ని తెలిపారు. దీనిపై ఇటు మోహ‌న్‌బాబు, అటు విష్ణు మంచు ఎలాంటి కామెంట్స్ చేయ‌లేదు. అయితే మోహ‌న్‌బాబు మాత్రం రెచ్చ గొట్టొద్ద‌ని ఇన్ డైరెక్ట్‌గా ప్ర‌కాశ్‌రాజ్‌కు వార్నింగ్ ఇచ్చారు. ఎన్నిక‌ల ముందు, త‌ర్వాత ‘మా’లో చాలా నాట‌కీయ ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. ‘మా’ ఎన్నిక‌ల్లో విష్ణు ప్యానెల్‌, ప్ర‌కాశ్ రాజ్ ప్యానెల్ పోటీ ప‌డ్డారు. విష్ణు ప్యానెల్ గెలిచింది.ఎన్నిక‌లు ముగిసిన రోజు రాత్రే నాగ‌బాబు కూడా ‘మా’ స‌భ్య‌త్వానికి రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ ఎల‌క్ష‌న్స్‌లో లోక‌ల్‌, నాన్‌లోక‌ల్ అనే అంశం పెద్ద చ‌ర్చ‌కు దారి తీసింది. ఆ అంశాన్ని విష్ణు ప్యానెల్ ప్ర‌ధానంగా చేసుకుని గెలిచార‌ని ప్ర‌కాశ్ రాజ్ భావించి ‘మా’ స‌భ్య‌త్వంకు రాజీనామా చేశాడు. అలాగే ఎన్నిక‌లు జ‌రిగిన‌ప్పుడు అక్క‌డ ఉన్న సీసీ టీవీ ఫుటేజ్ కోసం ప్ర‌కాశ్ రాజ్ ఎన్నిక‌ల అధికారికి లేఖ రాశారు. కానీ ఎన్నిక‌ల అధికారి అది కోర్టు ద్వారా తెచ్చుకోవాల‌ని అన్నారు. ‘మా’ అధ్య‌క్షుడిగా ఎన్నికైన అనంత‌రం తానుగానీ, త‌న ప్యానెల్ స‌భ్యులు కానీ ఎవ‌రు మీడియా ముందుకు ఇక‌పై రాబోమ‌ని చెప్పారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/30R5ypJ

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....