Saturday, 23 October 2021

అందులో ఎన్నో రహస్యాలు ఉన్నాయి.. అసలు విషయం చెప్పిన సమంత

మన పురణాల్లో హిమాలయాల ప్రాశస్త్యం, ప్రాముఖ్యత, గొప్పదనం గురించి ఎంతో చెప్పారు. ఇప్పటికీ హిమాలయాల్లో మానవ జాతి చేధించలేని ఎన్నో రహస్యాలు, అద్భుతాలున్నాయి. సాక్ష్యాత్తు దేవుళ్లు అక్కడ కొలువై ఉంటారని మన పురణాలు చెబుతుంటాయి. అయితే అక్కడి అద్భుతాలను వీక్షించిన తాజాగా తన సంతోషాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యక్త పరిచింది. తన ముగిసందని, ఎంతో అద్భుతంగా జరిగిందని చెప్పుకొచ్చింది. యాత్రా విశేషాలను ఒక్కొక్కటిగా చెప్పుకొచ్చింది. ఇక చార్‌ధామ్‌ యాత్ర గురించి సమంత ఓ పోస్టును షేర్‌ చేసింది.. 'మహాభారతాన్ని చదివినప్పటి నుంచి ఈ భూమ్మీద స్వర్గదామమైన హిమాలయాలను సందర్శించాలని అనుకున్నాను. ఇది దేవుళ్లకు నిలయమైన ప్రదేశం. ఇందులో ఎన్నో రహస్యలు, అద్భుతాలు దాగి ఉన్నాయి. హిమాలయాలను సందర్శించాలనే నా కల నెరవేరింది. దేవుడి మీద నమ్మకం, ప్రస్తుతం ఉండే వాస్తవికత మధ్య ఎప్పుడూ సంక్లిష్టమైన గందరగోళం ఉంటుంది. అదెప్పుడూ ఉత్కంఠభరితమైనదే! నా హృదయంలో హిమాలయాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. శిల్పా రెడ్డితో ఈ ప్రయాణం సాగించడం వల్ల మరింత ప్రత్యేకమైందిగా మారింది’ అని చెప్పుకొచ్చింది. యమునోత్రి పుట్టుక గురించి, దాని ప్రవాహం,చరిత్ర గురించి సమంత వివరించింది. అక్కడి ప్రయాణం ఎలా జరిగింది? అక్కడి విశేషాలు ఏంటో అన్నింటిని సమంత వివరించింది. అక్కడి వింత జంతువులను కూడా సమంత చూపించింది. మొత్తానికి ఈ యాత్రతో సమంత ఎంతో సంతోషంగా ఉన్నట్టు కనిపిస్తోంది. సమంత అక్కడ ప్రత్యేక పూజాలు కూడా నిర్వహించింది. హోమంలో కూర్చుంది. పూజాలు నిర్వహించింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3E7Ue6R

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....