తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం హాట్ టాపిక్ ఏదైనా ఉంది అంటే అది ‘మా’ ఎన్నికల గురించే అని చెప్పుకోవాలి. ఇంతకాలం.. మామూలుగా ఉన్న ఈ ఏడాది మాత్రం రసవత్తరంగా మారాయి. ఈసారి అధ్యక్ష బరిలో విలక్షణ నటుడు , హీరో పోటీ పడటం ఆసక్తికరంగా మారింది. అంతేకాక.. ఈసారి ఒక ప్యానెల్పై మరో ప్యానల్ సభ్యులు తీవ్రస్థాయిలో దూషణలు చేసుకోవడం.. వ్యక్తిగత ఆరోపణలు చేయడం జరిగింది. అయితే ఆదివారం ‘మా’ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే పలువురు ప్రముఖులు ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే ఈసారి మంచు విష్ణు ప్యానెల్లో నటుడు పృథ్వీ రాజ్ ఉప అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా కమెడియన్గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్గా ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఆయన చెప్పిన ‘30 ఇయర్స్ ఇండస్ట్రీ’ అనే డైలాగ్తో ఆయన ఎంతో పాపులర్ అయ్యారు. ఇప్పటి నుంచి ఆయన్ను 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ అనే పిలుస్తున్నారు అభిమానులు. ఆయన తనదైన కామెడీతో ప్రేక్షకులను అలరిస్తూ వచ్చారు. ఇక ఆయన రాజకీయాల్లో కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. ఇప్పుటికే ఆయన ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్సీపీ తరఫున ప్రచారం చేశారు. అంతేకాక.. ఆయను టీటీడీ ఎస్వీబీసీ ఛైర్మన్గా ఆయనకు పదవి దక్కడం.. ఆ తర్వాత పలు వివాదాల కారణంగా ఆయన ఆ పదవికి రాజీనామా చేయడం జరిగింది. ఇక ఆయనకు గతంలో ఎన్నో వివాదాలు ఉన్నాయి. కొంతకాలం క్రితం ఆయన మాట్లాడిన ఓ ఆడియో టేప్ సోషల్మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు మంచు విష్ణు ప్యానెల్లో పృథ్వీరాజ్ పోటీ చేయడం.. సర్వత్ర ఆసక్తి నెలకొంది. మరి ఈ పోటీలో ఆయన విజయం సాధిస్తారో.. లేదో చూడాలి.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3FvDXKt
No comments:
Post a Comment