Sunday, 26 December 2021

Manchu Lakshmi : కిడ్నీ అమ్ముకోవాల్సి వచ్చింది!.. మంచు లక్ష్మీ ట్వీట్ వైరల్

నెట్టింట్లో ఎంతటి ట్రోలింగ్‌కు గురవుతుందో అందరికీ తెలిసిందే. మంచు లక్ష్మీ షేర్ చేసే ఫోటోలు, వేసే ట్వీట్లు, చేసే కామెంట్లు అన్నీ కూడా వైరల్ అవుతుంటాయి. ఇక మంచు లక్ష్మీ కనిపెట్టే కొత్త పదాలు, వాటిపై సోషల్ మీడియాలో జరిగే చర్చలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. ఈ మధ్య మంచు లక్ష్మీ కొత్త విద్యలు నేర్చుకుంటోంది. కలరి విద్యను మంచు లక్ష్మీ ప్రత్యేకంగా నేర్చుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే మంచు లక్ష్మీ తన కొత్త సినిమా కోసమే ఇలాంటి విద్యల్లో ట్రైనింగ్ తీసుకుంటోందని తెలుస్తోంది. తాజాగా మంచు లక్ష్మీ కొన్ని ట్వీట్లు వేసింది. ఇన్ని రోజులు ఫ్యామిలీతో కలిసి ఉన్నాను.. ఇకపై నా కోసం కొంత సమయం కేటాయించుకునేందుకు వెళ్తున్నాను అంటూ చెప్పేసింది. కానీ ఎక్కడికి వెళ్తుందనే విషయాన్ని మాత్రం వెళ్లడించలేదు. ఎయిర్ పోర్ట్ లాంజ్‌లో ఎదురుచూసిన మంచు లక్ష్మీ.. ఆకలి వేయకపోయినా కూడా అక్కడ తినేసిందట. ఎందుకంటే ఆ ఫ్లైట్ టికెట్ కొనేందుకు తన కిడ్నీలు అమ్ముకునేంత పరిస్థితి వచ్చిందట. అందుకే ఆ టికెట్ డబ్బులకు న్యాయం చేసేందుకు అలా ఆకలి కాకపోయినా కూడా తింటున్నానని చెప్పుకొచ్చింది. మంచు లక్ష్మీ వేసిన ఆ ట్వీట్‌కు జనాలు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. అంటే నువ్ కూడా మా కులమే అక్కా అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.. అవును బాబు, మా డాడీ రిచ్.. కానీ నేను కాదు అంటూ మంచు లక్ష్మీ రిప్లై ఇచ్చింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3z7mm96

No comments:

Post a Comment

'Acting Is Such A Rich Man's Business Now'

'It's no more just art and skills, it's a business.' from rediff Top Interviews https://ift.tt/rQNK1fd