Wednesday, 15 December 2021

RRR ప్రీ రిలీజ్ విషయంలో రాజమౌళి అదిరిపోయే స్కెచ్

ఎంటైర్ ఇండియా ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తోన్న‌ చిత్రం . యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్ర‌మిది. అజ‌య్ దేవ‌గ‌ణ్‌, ఆలియా భ‌ట్ వంటి బాలీవుడ్ స్టార్స్‌ స‌హా అలిస‌న్ డూడి, రే స్టీవెన్ స‌న్‌, ఒలివియా మోరిస్ వంటి హాలీవుడ్ స్టార్స్ న‌టించిన చిత్రం కావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. సినిమా వ‌చ్చే ఏడాది సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 7న విడుద‌ల‌వుతుంది. జ‌క్క‌న్న, , చ‌ర‌ణ్ అండ్ టీమ్‌ ఫుల్ స్వింగులో ప్ర‌మోష‌న‌ల్ యాక్టివిటీస్‌తో దూసుకుపోతున్నారు. కాగా..RRR ప్రీ రిలీజ్ విషయంలో అదిరిపోయే స్కెచ్ వేశారు. సినీ వర్గాల్లో వినిపిస్తోన్న తాజా స‌మాచారం మేర‌కు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను డిసెంబ‌ర్ 19న‌ ముంబైలో సెల‌బ్రేట్ చేయ‌డానికి రాజ‌మౌళి డిసైడ్ అయ్యార‌ట‌. మ‌న స్టార్స్‌తో పాటు బాలీవుడ్ టాప్ స్టార్స్ కూడా ఈ ఈవెంట్‌కు హాజ‌రు కాబోతున్నార‌నేది స‌మాచారం. నిజానికి RRR ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను రాజ‌మౌళి దుబాయ్‌లో నిర్వ‌హించాల‌ని ముందుగా అనుకున్నారు. కానీ.. ఒమిక్రాన్ కార‌ణంగా ఆయ‌న‌కు చివ‌రి నిమిషంలో అనుమ‌తి దొర‌క‌లేదు. దీంతో, రాజ‌మౌళి ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ముంబైలోనే నిర్వ‌హించ‌డానికి డిసైడ్ అయ్యారు. ఈ ఈవెంట్‌కు బాలీవుడ్ సూప‌ర్‌స్టార్స్‌లో ఒక‌రైన స‌ల్మాన్ ఖాన్ ముఖ్య అతిథిగా రాబోతున్నార‌ని టాక్‌. ఎందుకంటే ఇటీవ‌లే రాజమౌళి ఆయ‌న్ని క‌లిసి RRR ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఆహ్వానించిన సంగ‌తి తెలిసిందే. ఇక బాలీవుడ్ నుంచి రాబోయే మిగ‌తా స్టార్స్ ఎవ‌రో తెలియాల్సి ఉంది. బాహుబ‌లి చిత్రంతో తెలుగు సినిమా రేంజ్‌ను మ‌రో లెవ‌ల్‌కు తీసుకెళ్లిన ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి డైరెక్ష‌న్‌లో వ‌స్తున్న సినిమా కావ‌డం.. ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌లైన టీజ‌ర్, ట్రైల‌ర్, సాంగ్స్ అన్నీ సినిమాపై ఉన్న అంచ‌నాల‌ను అమాంతంగా పెంచేయ‌డంతో RRRపై భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ నెల‌కొన్నాయి. 1920 స‌మ‌యంలో సాగే ఫిక్ష‌న‌ల్ పీరియాడిక‌ల్ డ్రామా ఇది. తెలంగాణ గోండు వీరుడు కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌, మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజుగా రామ్ చ‌ర‌ణ్ న‌టించారు. చ‌రిత్రలో ఎన్న‌డూ క‌లుసుకున్న దాఖ‌లాలు లేని ఇద్ద‌రు యోధులు క‌లుసుకుని వారి భావోద్వేగాల‌ను ఒక‌రికొక‌రు పంచుకుని, బ్రిటీష్ వారిని ఎదిరిస్తే ఎలా ఉంటుంద‌నే ఊహాత్మ‌క క‌థాంశంతో ఈ సినిమాను రాజ‌మౌళి తెర‌కెక్కించారు. రూ.400 కోట్ల బ‌డ్జెట్‌తో డివివి ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై డివివి దాన‌య్య ఈ చిత్రాన్ని నిర్మించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3ITVUnJ

No comments:

Post a Comment

'GST cuts beginning to translate into higher consumption'

'Despite a challenging FMCG environment, ITC Foods has grown at or above the industry rate.' from rediff Top Interviews https://if...