ఇప్పుడు ఎంతటి ఫాంలో ఉందో అందరికీ తెలిసిందే. అలాంటి పూజా హెగ్డే అంటూ తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతోంది. శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పూజా హెగ్డే ఇచ్చిన స్పీచ్, చెప్పిన మాటలు అందరనీ ఆకట్టుకున్నాయి. ఇక అదే సమయంలో గురించి చెప్పుకొచ్చింది. ‘నాకు ఇష్టమైన నిర్మాత అల్లు అరవింద్. ఈ విషయం నాలుగు ఐదురోజుల క్రితం జరిగింది. నేను షూటింగ్కు వెళ్తున్నాను. కారులో ఉన్నాను. ఆ సమయంలో నాకు మెసెజ్ వచ్చింది. పైన నోటిఫికేషన్లో అల్లు అరవింద్ గారు అని కనిపించింది. ఏం చేశారు? ఎందుకు చేశారు? అని తెగ భయపడ్డాను. ఆయన మామూలుగా అయితే మెసెజ్ చేయరు అని అనుకున్నాను. ఎంతో బాగా నటించావ్.. అని ప్రశంసలు కురిపించారు. అలా ఆయన స్థాయికి ఆ మెసెజ్ చేయాల్సిన పని లేదు. కానీ ఆయన చెప్పారు. నాకు ఎంతో సంతోషంగా అనిపించింది’ అని చెప్పుకొచ్చింది. ఇక అల్లు అరవింద్ కూడా తన స్పీచులో పూజా హెగ్డే గురించి గొప్పగానే చెప్పాడు. ‘నువ్వు అన్నా, నీ నటన అన్నా నాకు ఎంతో ఇష్టం. అది మా సినిమాల్లో పని చేసినా, వేరే సినిమాల్లో పని చేసినా సరే నువ్వంటే నాకు ఇష్టం’ అని అల్లు అరవింద్ అన్నాడు. మొత్తానికి మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్లర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అయితే పూజా హెగ్డే బాగానే హైలెట్ అయింది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3mz25U1
No comments:
Post a Comment