Sunday 31 October 2021

Elon Musk Says 'Much Respect' for Starlink India Director Sanjay Bhargava

Elon Musk has praised Starlink India Director Sanjay Bhargava for his ambitious project to provide high-speed Internet to rural areas, saying he has "much respect" for Bhargava. Musk said Bhargava...

from NDTV Gadgets - Latest https://ift.tt/3nLfEQJ

Vivo V23e Price, Specifications Tipped Ahead of Launch

Vivo V23e pricing and some specifications have been leaked by a tipster on Twitter. As per the leak, the handset will feature a triple rear camera setup, headlined by a 64-megapixel main sensor and...

from NDTV Gadgets - Latest https://ift.tt/3w1huAO

Redmi Smart Band Pro, Redmi Watch 2 Lite With SpO2 Tracking Announced

Redmi Smart Band Pro and Redmi Watch 2 Lite have been announced. The wearables offer over 100 workout modes, come with heart rate monitoring, and SpO2 tracking as well. These two wearables have been...

from NDTV Gadgets - Latest https://ift.tt/3EwSKmN

Tecno Camon 18i Reportedly Debuts With Triple Rear Cameras, 18W Charging

Tecno Camon 18i has been launched in Nigeria, according to a report. The new Tecno phone is said to have a single 4GB RAM + 128GB storage variant.

from NDTV Gadgets - Latest https://ift.tt/3Ey9LwZ

Apple Objects to Links to Outside Payments Ahead of Epic Games Hearing

Apple outlined its objections to allowing app developers to link to third-party payment options ahead of a hearing next month that could determine whether a set of antitrust court orders is put on...

from NDTV Gadgets - Latest https://ift.tt/3CxWOmt

RRR Glimpse: రోమాలు నిక్కబొడిచే సీన్స్.. మెగా, నందమూరి అభిమానులకు కిక్కే కిక్కు!!

యావత్ భారతదేశం కళ్ళలో ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా RRR. బాహుబలి సిరీస్ తర్వాత రూపొందిస్తున్న భారీ సినిమా కావడంతో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాపై ఉన్న అంచనాలు ఊహకందడం లేదు. పైగా టాలీవుడ్ టాప్ స్టార్స్ అయిన యంగ్ టైగర్ , మెగా పవర్ స్టార్ హీరోలుగా భారీ మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కుతుండటంతో యావత్ సినీ లోకం దృష్టి ఈ సినిమాపైనే ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా రిలీజ్ చేసి కిక్కిచ్చారు జక్కన్న. ఓ వైపు శరవేగంగా RRR షూటింగ్ కంప్లీట్ చేస్తూనే గత కొన్ని నెలలుగా రాజమౌళి వదులుతున్న ఒక్కో అప్‌డేట్ ప్రేక్షక లోకంలో పూనకాలు తెప్పిస్తోంది. ఇప్పటికే విడుదలైన RRR పోస్టర్స్, ఫస్ట్‌ సింగిల్‌ భారీ రేంజ్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. రామరాజు ఫర్ భీమ్, భీమ్ ఫర్ రామరాజు వీడియోస్ మెగా, నందమూరి అభిమాన వర్గాలను హుషారెత్తించాయి. అలాగే స్నేహితుల దినోత్సవం కానుకగా విడుదల చేసిన 'RRR దోస్తీ' సాంగ్ సోషల్ మీడియాలో రికార్డ్స్ తిరగరాసింది. ఇక తాజాగా మరో రికార్డుల సునామీకి ఊతమిస్తూ RRR గ్లింప్స్ రిలీజ్ అయింది. కేవలం 45 సెకనుల నిడివితో కట్ చేసిన ఈ టీజర్‌లో ఎన్టీఆర్, రామ్ చరణ్ లుక్స్ రివీల్ చేస్తూ భారీ విజువల్స్‌తో సినిమాపై ఉన్న అంచనాలకు రెక్కలు కట్టారు. కట్టిపడేస్తున్న సీన్స్‌కి కీరవాణి అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ రోమాలు నిక్కబొడిచేలా చేస్తున్నాయి. భారతీయ సినిమా వైభవాన్ని మరోసారి ఆవిష్కృతం చేయబోతున్నామంటూ ఈ వీడియో ద్వారా స్పష్టం చేశారు రాజమౌళి. డీవీవీ దానయ్య సమర్పణలో 400 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్‌కు జోడీగా ఒలివియా మోరిస్‌, రామ్ చ‌ర‌ణ్‌ జంటగా బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భ‌ట్ న‌టిస్తున్నారు. అల్లూరి సీతారామరాజుగా రామ్‌ చరణ్‌, కొమురం భీంగా ఎన్టీఆర్‌ వెండితెరపై మ్యాజిక్ క్రియేట్ చేయబోతున్నారు. ఈ RRR (రౌద్రం రుధిరం ర‌ణం) జనవరి 7వ తేదీన భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Y187nY

Samantha : ‘గే’ కపుల్ పెళ్లి గురించి సమంత పోస్ట్.. ప్ర‌త్యేకంగా స‌మంత ఈ పోస్ట్ చేయ‌డానికి కార‌ణ‌మేంటని గుస‌గుస‌లు?

సమంత తెలిసో తెలియ‌కో అప్ప‌ట్లో వార్తల్లో ఎక్కువ‌గా నిలిచింది. అయితే ఈ మ‌ధ్య భ‌ర్త నాగ‌చైత‌న్య నుంచి విడిపోయిన త‌ర్వాత మాత్రం ఆమె రెగ్యుల‌ర్‌గా వార్త‌ల్లో వ్య‌క్తిగా నిలిచిపోయారు. ఒక‌సారి విడాకుల కార‌ణంగా, మ‌రోసారి త‌న‌పై వ‌స్తున్న వార్త‌ల‌ను ఖండిస్తూ యూ ట్యూబ్ ఛానెల్స్‌పై వేసిన కేసుల కార‌ణంగా..త‌న కొత్త సినిమాల‌ను అనౌన్స్ చేసిన‌ప్పుడు.. ఆధ్యాత్మిక యాత్ర‌ల‌కు వెళ్లిన‌ప్పుడు..ఇలా ఆమె ఏది చేసినా వార్తగానే నిలిచింది. రీసెంట్‌గా ఆమె పోస్ట్ చేసిన మ‌రో పోస్ట్ కూడా ఇప్పుడు నెట్టింట తెగ వైర‌ల్ అవుతుంది. ఇంత‌కీ స‌మంత దేని గురించి పోస్ట్ చేశారో తెలుసా? రీసెంట్‌గా తెలంగాణ‌లో గే క‌పుల్ పెళ్లి చేసుకోబోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దీనిపై వ‌చ్చిన వార్త ఉన్న పేప‌ర్ క‌టింగ్‌ను స‌మంత త‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డం ద్వారా. మామూలుగా అయితే ఈ వార్త‌ను ఏదో కూతూహలం కొద్ది స‌మంత ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశార‌ని అంద‌రూ అనుకోవ‌చ్చు. అయితే విడాకులు త‌ర్వాత ఆమె ఈ పోస్ట్ చేయ‌డంతో అంద‌రూ చెవులు కొరుక్కుంటున్నారు. డివోర్స్ త‌ర్వాత స‌మంత‌పై వ్య‌క్తిగ‌తంగానూ చాలా వార్త‌లు పుట్టుకొచ్చాయి. ఈమె త‌న స్టైలిష్‌తో రిలేష‌న్‌లో ఉంద‌ని కూడా కొంద‌రు మాట‌ల‌న్నారు. అయితే కొంద‌రు ఈ స్టైలిష్ గే కాబ‌ట్టి, స‌మంత ఎలా అత‌నితో రిలేష‌న్ షిప్‌లో ఉంటుంద‌ని కూడా అన్నారు. చివ‌రకు స‌ద‌రు స్టైలిష్ స‌మంతను అక్క అని పిలుస్తాను అంటూ త‌న‌పై వస్తున్న వార్త‌ల‌కు ఘాటు రిప్ల‌య్ ఇచ్చాడు.ఇలా చాలా వార్త‌లు స‌మంత చుట్టూ చ‌క్క‌ర్లు కొట్టాయి. ఈ నేప‌థ్యంలో స‌మంత చేసిన గే క‌పుల్ మ్యారేజ్ న్యూస్ పోస్ట్ వైర‌ల్ అవుతుంది. మ‌రి దీనిపై ఎవ‌రెలా స్పందిస్తారు. ఈ పోస్ట్‌పై ఎలాంటి దుమారం రేగుతుంది. ఎవ‌రెలా స్పందిస్తార‌నేది చూడాలి. ఇక సినిమాల విషయానికి వ‌స్తే.. స‌మంత ప్రొఫెష‌న‌ల్‌గా బిజీగా మార‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారు. అందులో భాగంగానే ఇప్ప‌టికే రెండు సినిమాలు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అందులో ఒక‌టి త‌మిళ నిర్మాణ‌ సంస్థ డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్‌లో ఎస్‌.ఆర్‌.ప్ర‌కాశ్‌, ఎస్‌.ఆర్‌.ప్ర‌భుల‌తో క‌లిసి శాంత రూబన్ జ్ఞాన‌శేఖ‌ర‌న్ అనే డెబ్యూ డైరెక్ట‌ర్ తెర‌కెక్కించ‌నున్నారు. మ‌రో చిత్రాన్ని హ‌రి, హరీష్ అనే ఇద్దరు డెబ్యూ డైరెక్టర్స్ చేయబోతున్నారు. ఈ రెండు సినిమాలు తెలుగు, త‌మిళ భాష‌ల్లో రూపొంద‌నున్నాయి. అలాగే ఈ రెండు సినిమాల‌ను తెర‌కెక్కిస్తున్న‌ది డెబ్యూ డైరెక్టర్సే కావ‌డం విశేషం. ఇది కాకుండా తెలుగు ఓటీటీ మాధ్య‌మం ఆహాలోనూ ఓ వెబ్ సిరీస్‌లో న‌టించే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3pSOSIK

దానికి సిగ్గెందుకు? బోరున ఏడుస్తూ పెళ్లిపై ఇలియానా కామెంట్స్! బ్రేకప్ తర్వాత ఓపెన్ అయిన గోవా బ్యూటీ

ఒకానొక సమయంలో తెలుగు తెరను తన అందాలతో షేక్ చేసింది గోవా బ్యూటీ . 'దేవదాసు' సినిమాతో ఎంట్రీ ఇచ్చి హీరో రామ్‌తో రెచ్చిపోయి నటించింది. అప్పటిదాకా తెలుగు ప్రేక్షకులు చూసిన అందాలకు కొత్త రూపమిస్తూ తన నాజూకు అందాలతో హల్చల్ చేసింది. అలా మొదటి సినిమాతోనే యూత్ ఆడియన్స్‌ని పులకరింపజేసిన ఈ బ్యూటీ ఆ తర్వాత వరుస హిట్స్ ఖాతాలో వేసుకొని బాలీవుడ్ బాట పట్టింది. ఈ మధ్యకాలంలో తెలుగు తెరపై అంతగా కనిపించకపోయినా సోషల్ మీడియా వేదికగా అందరితో టచ్‌లో ఉంటోంది ఇల్లీ బేబీ. ఈ నేపథ్యంలోనే ఇన్‏స్టాలో బోరున ఏడ్చేసింది ఇలియానా. అంతేకాదు ఏడవడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు అని ఆమె అంటోంది. మరి ఈ ఏడుపుకి కారణం ఏంటంటే.. వంట చేయడానికి కూరగాయలు తరుగుతుంటే రెండు వేళ్లకు గాయం అయిందట. కత్తి చాలా పదునుగా ఉండటం వల్ల పొరపాటున గాయం అయిందట. ఈ విషయాన్ని చెబుతూ తన రెండు వేళ్లకు గాయం కావడంతో చిన్నపిల్లలా ఏడ్చేశానని ఇలియానా పేర్కొంది. అయితే ఇది చూసిన కొందరు నెటిజన్లు ఆమెను పెళ్లిపై ప్రశ్నించారు. దీంతో ఈ ప్రశ్నకు ఆసక్తికర సమాధానమిచ్చింది ఇలియానా. తనకు కూడా త్వరగా చేసుకోవాలని ఉందని చెబుతూనే.. తనకు కావాల్సిన విధంగా ఉండే వరుడు దొరకడం లేదంటూ హాట్ కామెంట్ వదిలింది. పెళ్లి విషయంలో ఇలియానా ఇలా ఓపెన్ కావడంతో నెటిజన్స్ మరింత రెచ్చిపోతూ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో ఓ విదేశీ ఫోటో గ్రాఫర్‌తో ప్రేమాయణం నడిపి సహజీవనం కూడా చేసింది ఇలియానా. ఆ తర్వాత కొన్ని కారణాలతో అతడితో బ్రేకప్ చేసుకొని ఒంటరిగా ఉంటోంది. ఈ విషయమై గతంలో రియాక్ట్ అయిన ఇల్లీ బేబీ.. బ్రేకప్ తర్వాత చాలా కాలం పాటు డిప్రెషన్‌లో ఉన్నట్లు పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరోసారి పెళ్లి టాపిక్‌పై ఇలియానా రియాక్ట్ కావడంతో అందరి దృష్టి ఆమె పెళ్లిపై పడింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3BrLXZO

iMac Pro With M1 Pro, M1 Max Chips to Launch in 2022: Report

The next-generation iMac, which is currently in the works, could possibly be called iMac Pro.

from NDTV Gadgets - Latest https://ift.tt/3GC7rHh

Majority Crypto-Coins Including Bitcoin, Ether Begin November with Dips

While the Bitcoin price remains above the $60,000 (roughly Rs. 45 lakh) mark, Dogecoin and Shiba Inu also continue their streak of adding gains to their values.

from NDTV Gadgets - Latest https://ift.tt/3nEQgvO

Roblox Back Online After Facing Outage Over Weekend

Roblox, the popular gaming platform, faced a prolonged outage that began on Friday and lasted through the weekend.

from NDTV Gadgets - Latest https://ift.tt/3w5fwzu

Samsung Galaxy S21 FE Could Be Launched at CES 2022

Samsung Galaxy S21 FE will reportedly launch during next year's Consumer Electronics Show (CES).

from NDTV Gadgets - Latest https://ift.tt/3Epx0cG

Megastar Chiranjeevi : దెయ్యం లుక్‌లో చిరంజీవి.. అంద‌రినీ భ‌య‌పెడుతున్న మెగాస్టార్!

కెరీర్ ప్రారంభంలో దొంగ సినిమా చూసిన వారికి ‘గోలీమార్‌.. కాష్మోరా కౌగిలిస్తే ఏం చేస్తారో.. ’ అనే పాట గుర్తుండే ఉంటుంది. ఆ సినిమాలో హీరోయిన్‌ను భ‌య‌పెట్ట‌డానికి మెగాస్టార్ దెయ్యంలా మారిపోతారు. మైకేల్ జాక్స‌న్ ఆల్బ‌మ్‌ను స్ఫూర్తిగా తీసుకుని చిరంజీవి అప్ప‌ట్లో చేసిన ఈ సాంగ్ ఆడియెన్స్‌ను తెగ ఆక‌ట్టుకుంది. ఇన్నేళ్ల త‌ర్వాత మ‌రోసారి చిరంజీవి దెయ్యం లుక్‌లో మ‌ళ్లీ క‌నిపించారు. ఎప్పుడూ న‌వ్వుతూ కూల్‌గా క‌నిపించే చిరంజీవి దెయ్యం లుక్‌ను చూస్తే పిల్ల‌లు జ‌డుసుకుంటారు. అయితే ఇప్పుడు చిరంజీవి చేస్తున్న సినిమాల్లో ఏదీ హార‌ర్ సినిమా లేదే. ఎందుకలా ఆయ‌న దెయ్యం లుక్‌లో క‌న‌ప‌డుతున్నార‌నే సందేహం రాక మాన‌దు. అయితే చిరంజీవి దెయ్యం లుక్‌.. సినిమా కోసం కాదండోయ్‌.. హాలోవీన్ సంద‌ర్భంగా ఆయ‌న వేసిన రియ‌ల్ గెట‌ప్‌. ప‌లువురు సినీ సెల‌బ్రిటీలు హాలోవీన్ సెలబ్రేష‌న్స్ చేసుకున్నారు. వారిలో చిరంజీవి కూడా ఉన్నారు. ఆయ‌న త‌న హాలోవీన్ లుక్‌ను ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేశారు. ఈ వీడియోతో పాటు ఎగ్జ‌యిట్‌మెంట్ డే అని క్యాప్ష‌న్ పోస్ట్ చేయ‌డం అంద‌రినీ ఆక‌ట్టుకుంటుంది. ఆరున్న‌ర ప‌దులు వ‌య‌సు దాటినా ఆయ‌న ఎంతో ఉత్సాహంగా పిల్ల‌ల‌తో పోటీ ప‌డుతూ ఈ సెల‌బ్రేష‌న్స్‌లో పాల్గొన‌డం ఆయ‌న ఫ్యాన్స్‌కు ఆనందాన్నిస్తుంది. ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే.. చిరంజీవి ఏక‌ధాటిగా సినిమాలు చేస్తున్నారు. ఇప్ప‌టికే ఆచార్య సినిమా షూటింగ్‌ను ఆయ‌న పూర్తి చేసేశారు. ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 4న విడుద‌ల‌వుతుంది. మ‌రోవైపు గాడ్‌ఫాద‌ర్ సినిమా షూటింగులో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే మెహ‌ర్ ర‌మేశ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందబోయే భోళా శంక‌ర్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్ల‌డానికి చిరంజీవి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. ఈ సినిమా న‌వంబ‌ర్ 11న లాంఛ‌నంగా ప్రారంభ‌మై, న‌వంబ‌ర్ 15 నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనుంది. సిస్ట‌ర్ సెంటిమెంట్ ప్ర‌ధానంగా సాగే ఈ చిత్రంలో చిరంజీవి చెల్లెలు పాత్ర‌లో కీర్తి సురేశ్ న‌టిస్తుంది. ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దీని త‌ర్వాత బాబి ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌లో మ‌రో సినిమా చేయ‌డానికి చిరంజీవి సిద్ధంగా ఉన్నారు. వ‌చ్చే ఏడాది మెగా ఫ్యాన్స్‌కు పండ‌గేన‌ని చెప్పాలి. ఎందుకంటే చిరంజీవి న‌టించిన మూడు చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద సంద‌డి చేయ‌డం ప‌క్కాగా క‌నిపిస్తోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3jTO4jj

ఎన్టీఆర్‌ను అలా చూపిస్తే ఒప్పుకుంటారా?... డైరెక్టర్ కాకపోయుంటే.. రాజమౌళి ఆస‌క్తిక‌ర‌మైన స‌మాధానాలు

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళికి, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌కి మ‌ధ్య చాలా మంచి అనుబంధం ఉంది. ఇద్ద‌రి కాంబినేష‌న్లో స్టూడెంట్ నెం.1, సింహాద్రి, య‌మ‌దొంగ‌, ఇప్పుడు సినిమాలు రూపొందాయి. అయితే RRRలో ఎన్టీఆర్‌తో పాటు మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కూడా న‌టిస్తున్నారు. రీసెంట్‌గా ఓ కాలేజ్ ఈవెంట్‌లో పాల్గొని అక్క‌డున్న వారు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ఆస‌క్తిక‌ర‌మైన స‌మాధానాలు ఇచ్చారు. ఆ క్ర‌మంలో ఒక‌వేళ మీరు డైరెక్ట‌ర్ కాక‌పోయుంటే ఏమై ఉండేవారు అని ఒక‌రు ప్ర‌శ్నిస్తే.. నాకు డ్రైవింగ్ వ‌చ్చు.. క‌చ్చితంగా మంచి డ్రైవ‌ర్‌ను అయ్యేవాడిని అని చెప్పారు జ‌క్క‌న్న‌. అలాగే RRRలో పాత్ర 30 నిమిషాలే ఉంటుంద‌ట క‌దా..నిజ‌మేనా! అని మ‌రొక‌రు ప్ర‌శ్నించారు. నిజంగా అలా చేస్తే ఎవ‌రైనా ఒప్పుకుంటారా? మీరు చెప్పండి త‌న‌దైన స్టైల్లో స‌మాధానం ఇచ్చేశారు రాజ‌మౌళి. బాహుబ‌లి’ త‌ర్వాత రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న సినిమా RRR..కావ‌డంతో ఎంటైర్ ఇండియ‌న్ మూవీ ఇండ‌స్ట్రీ ఆస‌క్తిగా ఎదురుచూస్తుంది. ఇదొక ఫిక్ష‌న‌ల్ పీరియాడిక‌ల్ డ్రామా. ఇద్ద‌రు స్వాతంత్య్ర స‌మ‌ర యోధుల‌కు సంబంధించింది. ఎన్టీఆర్ గోండు వీరుడు కొమురం భీమ్‌గా క‌నిపిస్తుంటే, మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో రామ్‌చ‌ర‌ణ్ న‌టించారు. 1940 బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమాలో ఈ ఇద్ద‌రు యోధులు క‌లుసుకుని, గొడ‌వ‌ప‌డి, బ్రిటీష్‌వారిని ఎదిరిస్తే ఎలా ఉంటుంద‌నే క‌థాంశంతో రూపొందిన చిత్రమే RRR. ఇందులో ఎక్క‌డా చ‌రిత్ర‌ను వ‌క్రీక‌రించలేద‌ని, అంతా ఫిక్షన‌ల్ సినిమా అని రాజ‌మౌళి ఇంట‌ర్వ్యూలో తేట తెల్లం చేసేశారు. టాలీవుడ్ స్టార్ హీరోలైన యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్ మూవీ కావ‌డంతో ఇటు మెగా ఫ్యాన్స్‌, అటు నందమూరి ఫ్యాన్స్‌తో పాటు టాలీవుడ్ ప‌రిశ్ర‌మ అంతా ఎదురుచూస్తుంది. ఇక బాలీవుడ్ నుంచి అజ‌య్ దేవ‌గ‌ణ్‌, ఆలియా భ‌ట్‌తో పాటు శ్రియా శ‌ర‌న్‌, స‌ముద్ర ఖ‌ని త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ల్లో న‌టించారు. అలాగే హాలీవుడ్‌కి చెందిన ఒలివియా మోరిస్‌, రే స్టీవెన్ స‌న్‌, అలిస‌న్ డూడి కూడా కీల‌క పాత్ర‌ల్లో నటించారు. పాన్ ఇండియా రేంజ్‌లో అగ్ర న‌టీన‌టులు చేసిన సినిమా కావ‌డంతో సినిమా క‌లెక్ష‌న్స్ ప‌రంగా ఎలాంటి సంచ‌నాల‌కు తెర తీస్తుందోనిన ట్రేడ్ వ‌ర్గాలు ఎదురుచూస్తున్నాయి. ఇంత మందిలో ఆస‌క్తి పెంచుతోన్న ఈ సినిమా వ‌చ్చే ఏడాది సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 7న రావ‌డం ప‌క్కా అయ్యింది. సోమ‌వారం(న‌వంబ‌ర్ 1) ఉద‌యం 11 గంట‌ల‌కు సినిమా నుంచి 45 సెక‌న్ల ఉండే గ్లింప్స్‌ను విడుద‌ల చేస్తున్నారు. ఈ గ్లింప్స్ ఎలా ఉండ‌బోతుందోన‌ని అంద‌రిలో క్యూరియాసిటీ పెరిగిపోయింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3nN4bjK

Puneeth RajKumar : పునీత్ చ‌దువు చెప్పించిన 1800 పిల్ల‌ల బాధ్య‌త నాదే: హీరో విశాల్‌

పునీత్ రాజ్‌కుమార్ మ‌ర‌ణం సినీ ఇండ‌స్ట్రీకి తీర‌ని లోటు. ఆయ‌న సినీ ప‌రిశ్ర‌మ‌కే కాదు, స‌మాజానికి కూడా ఎంతో సేవ చేశారు. ఎన్నో అనాథాశ్ర‌మాలు, వృద్ధాశ్ర‌మాలల‌కు సాయం చేయ‌డ‌మే కాకుండా, 1800 పిల్ల‌లకు చ‌దువు చెప్పిస్తున్నారు. ఇప్పుడాయ‌న లేరు క‌దా! మ‌రి ఆ పిల్ల‌ల భ‌విష్య‌త్తు ఏంటి? అనే సందేహం ఉంటుంది. అయితే మంచి మ‌న‌సుతో మంచి ప‌నులు చేసేవారికి ఆ దేవుడు ఏదో ఒక రూపంలో అండ‌గా నిల‌బ‌డుతూ ఉంటారు. పునీత్ ఎంతో ఇష్టంగా చేస్తున్న ఈ ప‌నికి ఓ స్నేహితుడిగా నేనున్నానంటూ ముందుకు వ‌చ్చారు హీరో విశాల్‌. పునీత్ చ‌దువు చెప్పిస్తున్న 1800 పిల్ల‌ల‌కు వ‌చ్చే ఏడాది చ‌దువుకు అయ్యే ఖ‌ర్చును నేను చూసుకుంటాన‌ని హీరో తెలిపారు. విశాల్, ఆర్య న‌టించిన చిత్రం ఈ దీపావ‌ళి సంద‌ర్భంగా న‌వంబ‌ర్ 4న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్బంగా జ‌రిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పునీత్ రాజ్‌కుమార్‌తో ఉన్న స్నేహాన్ని విశాల్ గుర్తు చేసుకున్నారు. అంతే కాదు. ఆయ‌న బాధ్య‌త‌లో తాను కొంత బాగం తీసుకుంటున్న‌ట్లు తెలిపారు. ‘‘పునీత్ రాజ్‌కుమార్ ఓ మంచి వ్య‌క్తి.. ఆయ‌న లేరనే వార్త‌ను చ‌దివినా, వింటున్నా న‌మ్మాల‌నిపించ‌డం లేదు. క‌ళ్ల‌లో నీళ్లు తిరుగుతున్నాయి. త‌న న‌ష్టాన్ని జీర్ణించుకోలేక‌పోతున్నాను. పునీత్ రాజ్‌కుమార్ మ‌ర‌ణం కేవ‌లం సినీ ఇండ‌స్ట్రీకే కాదు. స‌మాజానికి, ఆయ‌న‌తో అసోసియేట్ అయిన వారంద‌రికీ పెద్ద న‌ష్టాన్ని చేకూర్చింది. పునీత్‌లాంటి డౌన్ టు ఎర్త్ ప‌ర్స‌న్‌ను నేను ఇండ‌స్ట్రీలో చూడ‌లేదు. ఆయ‌న ఇండ‌స్ట్రీలో క‌లిసినా, బ‌య‌ట క‌లిసినా స‌రే! ఒకేలా ఉంటారు. నేను చూసిన వారిలో చాలా గొప్ప వ్య‌క్తి . ఆయ‌న ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని కోరుకుంటున్నాను. ఒక వ్య‌క్తి(పునీత్‌) ఇన్ని చేయ‌గ‌లుగుతాడా? అనుకుంటే న‌మ్మ‌లేం. అన్ని మంచి ప‌నులు చేశారు. 1800 పిల్ల‌ల‌కు చ‌దువుకు భ‌రోసానిస్తున్నారు. అలాగే అనాథ పిల్ల‌ల‌కు అండ‌గా నిల‌బ‌డుతున్నారు. వృద్ధాశ్ర‌మాల‌కు సాయం చేశారు. అంతే కాదు, ఆయ‌న చనిపోయిన త‌ర్వాత కూడా త‌న క‌ళ్ల‌ను ఇత‌రుల‌కు దానం చేశారు. ఈ విష‌యాల‌ను త‌లుచుకుంటే ఎంతో బాధ‌గా ఉంటుంది. ఇక పునీత్ చ‌దువు చెప్పిస్తున్న 1800 పిల్ల‌ల బాధ్య‌త‌ను వ‌చ్చే ఏడాది నేను చూసుకుంటాన‌ని ఈ సంద‌ర్భంగా హామీ ఇస్తున్నాను’’ అన్నారు హీరో విశాల్. హీరో విశాల్, ఆర్య ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘ఎనిమి’. దీపావ‌ళి సంద‌ర్భంగా న‌వంబ‌ర్ 4న తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో విడుద‌ల‌వుతుంది. ఆనంద్ శంక‌ర్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. ఎస్‌.వినోద్ కుమార్ నిర్మాత‌. అదే రోజున ర‌జినీకాంత్ హీరోగా న‌టించిన పెద్ద‌న్న‌(అన్నాత్త‌) కూడా విడుద‌ల‌వుతుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3jQdZbh

Binance - What I Hate, Love, and Fear About the Cryptocurrency Exchange

Binance is one of the biggest players in the cryptocurrency ecosystem but it is also facing increasing regulatory scrutiny and legal challenges that could prove to be challenges. A negative impact on...

from NDTV Gadgets - Latest https://ift.tt/3GPjf9l

ఫామ్‌హౌస్‌ను పేకాట క్ల‌బ్‌గా మార్చేసిన యంగ్ హీరో...షాకిచ్చిన పోలీసులు.. అస‌లు నిజాలేంటి?

రేవు పార్టీలు జ‌ర‌గ‌డం అనేవి గుట్టు చ‌ప్పుడు కాకుండా పోలీసుల క‌ళ్లు గ‌ప్పి జ‌రిగిపోతుంటాయి. ఒక రేవు పార్టీలే కావు.. చాలా విష‌యాలు పోలీసుల‌కు తెలియ‌కుండా జ‌రుగుతుంటాయని ఓ ప్ర‌ముఖ ఛానెల్ నిర్వ‌హించిన ఆప‌రేష‌న్‌లో బ‌ట్ట‌బ‌య‌లైంది. అస‌లేం జ‌రిగింద‌నే విష‌యంలోకి వెళితే, హైద‌రాబాద్ శివార్లులోని మంచి రేవుల ద‌గ్గ‌ర ఓ ఫామ్ హౌస్ ఉంది. అది కేవ‌లం ఫామ్ హౌస్ అనుకుంటే పొర‌బ‌డ‌ట్టే. పెద్ద జూద‌శాల‌గా మారిపోయింది. ఈ విష‌యాన్ని పోలీసులు, ఛానెల్‌వాళ్లు క‌నిపెట్టేశారు. ఈ యంగ్ హీరో ఆధ్వ‌ర్యంలోనే ఈ ఫామ్ హౌస్ క‌మ్ పేకాట క్ల‌బ్ ర‌న్ అవుతుంద‌ని పోలీసులు భావిస్తున్నారు. ఇక్క‌డొక రేంజ్‌లో బిజినెస్ జ‌రుగుతుంది. క్యాసినోను మించిన రేంజ్‌లో వ్యాపారం జ‌రుగుతుండ‌టం కొస‌మెరుపు. ఇదంతా సుమంత్ చౌద‌రి అనే వ్య‌క్తి న‌డిపిస్తున్నాడ‌నే వార్త‌లు వ‌చ్చినా, అస‌లు సూత్ర‌ధారి మాత్రం స‌ద‌రు యంగ్ హీరోనే అని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నుంచి ఈ ఫామ్‌హౌస్‌ను ఐదేళ్ల పాటు లీజుకు తీసుకుని దాన్ని పేకాట క్ల‌బ్‌గా మార్చార‌ట‌. ఇప్పుడీ కేసులో స‌ద‌రు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కూడా చిక్కుకున్న‌ట్లైంది. ఫామ్ హౌస్‌పై రైడ్ చేసిన పోలీసులు 25 మందిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో పాటు 25 లక్షల క్యాష్‌, స్వాపింగ్ మెషీన్లు, కార్ల‌ను సీజ్ చేశారు. తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని రియ‌ల్ ఎస్టేట్ స‌హా ప‌లు రంగాల‌కు చెందిన బ‌డా బాబులు ఈ ఫామ్‌హౌస్‌కు వ‌స్తార‌ని టాక్‌. ఈ వ్య‌వ‌హారం వెనుక యంగ్ హీరో నాగ‌శౌర్య ఉన్నాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. కానీ ఎటువంటి ఆధారాలు దొరికిన దాఖ‌లాలు లేవు. మ‌రి ఈయ‌న పేరు ఇరికించారా? నిజంగానే ఆయ‌న హ‌స్తం ఉందా? అని తెలియాల్సి ఉంది. మ‌రి ఇప్పుడిప్పుడే సినిమాల్లో ఎదుగుతున్న నాగ‌శౌర్య పేరు ఇలా బ‌య‌ట‌కు రావడం నిజంగా ఆయ‌న‌కు ఇబ్బందిని కలిగించేదే. అయితే దీనిపై ఆయ‌నెలా స్పందిస్తారు.. అసలు సుమంత్ చౌదరి ఎవరు? నిజంగానే సుమంత్ చౌదరికి నాగశౌర్యకి సంబంధం ఉందా? అనే విషయాలపై నిజంగా అస‌లు స్పందిస్తారో లేదో చూడాలి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3w0Rsxo

Rajinikanth : హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన రజినీకాంత్

సూప‌ర్‌స్టార్ హాస్పిట‌ల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి చేరుకున్నారు. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా తెలియ‌జేశారు. ‘‘నా చికిత్స పూర్తయ్యింది. ఆదివారం రాత్రి ఇంటికి చేరుకున్నాను. నా ఆరోగ్యం బాగు ప‌డాల‌ని ప్రార్థ‌న‌లు చేసిన నా మిత్రులు, శ్రేయోభిలాషులు, అభిమానుల‌కు హృద‌య పూర్వ‌కంగా కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నాను’’ అన్నారు. మూడు రోజుల ముందు ర‌జినీకాంత్‌కు త‌లనొప్పిగా ఉంద‌నిపించ‌డంతో ఆయ‌న్ని కావేరి హాస్పిట‌ల్‌లో జాయిన్ చేయించారు. అక్క‌డ వైద్యులు ఆయ‌న్ని ప‌రిశీలించి మెద‌డులోని న‌రాల్లో ఏవో బ్లాక్స్ ఉన్నాయ‌ని గుర్తించి చికిత్స అందించారు. క‌రోటిడ్ ఆర్ట‌రీ రివాస్కుల‌రైజేష‌న్ శ‌స్త్ర చికిత్స చేయించుకోవాల‌ని వైద్యులు ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు సూచించారు. డాక్ట‌ర్స్ సూచ‌న మేర‌కు వైద్య నిపుణుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ర‌జినీకాంత్‌కు క‌రోటిడ్ ఆర్ట‌రీ రివాస్కులైజేష‌న్ శ‌స్త్ర చికిత్స పూర్త‌య్యింది. రెండు రోజుల పాటు హాస్పిట‌ల్‌లోనే రెస్ట్ తీసుకున్న ర‌జినీకాంత్ ఇప్పుడు ఇంటికి చేరుకున్నారు. ఈ మ‌ద్య‌నే గ‌త వారమే ర‌జినీకాంత్ కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి వెళ్లి స్వీక‌రించారు. మ‌రోవైపు ఆయ‌న లేటెస్ట్ మూవీ అన్నాత్త‌(పెద్ద‌న్న‌) దీపావళి సంద‌ర్భంగా న‌వంబ‌ర్ 4న‌ విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. త‌లైవ‌ర్ అభిమానులు సినిమా కోసం చాలా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. అదే స‌మ‌యంలో ర‌జినీకాంత్‌కు అనారోగ్య స‌మ‌స్య‌లు రావ‌డంతో వారిలో కంగారు మొద‌లైంది. అయితే ఆయ‌న శ‌స్త్ర చికిత్స త‌ర్వాత ఇంటికి చేరుకోవ‌డంతో అభిమానులు హ్యాపీగా ఫీల‌వుతున్నారు. వ‌యో భారంతో ర‌జినీకాంత్‌కు అనారోగ్య స‌మ‌స్య‌లు ఎక్కువ‌గా వ‌స్తున్నాయి. ఎమెసిస్‌, బ్రాంకైటిస్ వంటి స‌మ‌స్య‌ల‌తో ర‌జినీ చాలా ఇబ్బందులు ప‌డ్డారు. ప్ర‌తి ఏడాది అమెరికాలో రెగ్యుల‌ర్‌గా చికిత్స చేయించుకుంటూనే ఉన్నారు. ఒకానొక ద‌శ‌లో ఆయ‌న రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించాల‌ని అనుకున్నారు. అన్నీ సిద్ధం అవుతున్న సంద‌ర్భంలో గ‌త ఏడాది డిసెంబ‌ర్‌లో ఉన్న‌ట్లుండి సీరియ‌స్‌గా అనారోగ్యంతో ఇబ్బంది ప‌డ్డారు. అప్పుడాయ‌న షూటింగ్ చేస్తున్నారు. అయితే సినిమాకు బ్రేక్ వేసి ట్రీట్‌మెంట్ తీసుకున్నారు త‌లైవ‌ర్‌. అటు పిమ్మ‌ల డాక్ట‌ర్స్ స‌ల‌హా మేర‌కు ఆరోగ్య ప‌రిస్థితుల రీత్యా, ర‌జినీకాంత్ రాజకీయాల్లోకి రాన‌ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. మరి సినిమాల విషయంలో రజినీకాంత్ భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది అందరిలోనూ ఆసక్తిని పెంచుతోంది. ఇప్పటికే కొందరు దర్శకులు ఆయనతో సినిమా చేయాలని ఎదురుచూస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2ZEjnrv

Popular Game Platform Roblox Has Been Down Since Friday

Popular gaming app and platform Roblox has been down since Friday night, and the company confirmed that the outage is due to an internal issue. It is carrying out the necessary maintenance work to get...

from NDTV Gadgets - Latest https://ift.tt/3muCigP

చెరుకు రసం అమ్ముతున్న సప్తగిరి!.. వీడియోతో అసలు గుట్టు విప్పిన గెటప్ శ్రీను

సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటాడు. తన సినిమాకు సంబంధించిన బాగానే ప్రమోట్ చేసుకుంటాడు. అప్పుడప్పుడు తన అభిమానులతో చిట్ చాట్ చేస్తుంటాడు. లైవ్‌లోకి వచ్చి నెటిజన్లు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తుంటాడు. బుల్లితెర, వెండితెరపై గెటప్ శ్రీను ఇప్పుడు ఫుల్ బిజీగా మారిపోయాడు. తన చేతిలో ఐదారు ప్రాజెక్ట్‌లున్నాయి. హీరోగానూ చేస్తూనే మరో వైపు సైడ్ కారెక్టర్లతో దూసుకుపోతోన్నాడు. అలా వెండితెర మీద ఎంత బిజీగా ఉన్న జబర్దస్త్ షోను మాత్రం వదలడం లేదు. తాజాగా గెటప్ శ్రీను ఓ వీడియోను షేర్ చేశాడు. అందులో కమెడియన్, హీరో, నటుడు చెరుకు రసం తయారు చేస్తున్నాడు. రోడ్డు పక్కన ఉన్న చెరుకు బండి వద్ద ఆగారు. శ్రీను, సప్తగిరి ఇద్దరూ కలిసి చెరుకు రసాన్ని తయారు చేసినట్టు కనిపిస్తోంది. ఆ చెరుకు బండి యజమానిని పక్కకు తప్పించినట్టు కనిపిస్తోంది. ఇందులో సప్తగిరి చెరుకు రసాన్ని తయారు చేస్తుండగా.. శ్రీను సాయం చేశాడు. చెరుకు గడలు, అల్లం ముక్కలు అందిస్తూ శ్రీను సాయం చేశాడు. సప్తగిరి చెరుకు రసాన్ని పట్టేస్తున్నాడు. మొత్తానికి చిన్నప్పటి మెమోరీస్ అంటూ గెటప్ శ్రీను ఈ వీడియోను షేర్ చేశాడు. ఇక ఈవీడియో మీద నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. నాకు తెలుసు ముందే మీరు ఇలాంటి సైడ్ బిజినెస్ పెడతారు అని ఒకడు అంటాడు. అన్నా నాకు ఓ గ్లాస్ ఇవ్వు అని ఇంకొకడు అంటున్నాడు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని చూపించారు అని ఇంకొకడు అంటాడు. మొత్తానికి ఈ వీడియో మాత్రం నెట్టింట్లో వైరల్ అవుతోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3mv5WCz

BalaKrishna : చిరంజీవిపై నిజంగా మీకున్న అభిప్రాయమేంటి?.. మోహన్‌బాబుని ఇరకాటంలో పెట్టిన బాలయ్య

టాలీవుడ్ ప‌రిశ్ర‌మ‌లో సీనియ‌ర్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, క‌లెక్ష‌న్ కింగ్ మోహన్‌బాబు మ‌ధ్య ఎప్పుడూ ఏదో ఒక గొడ‌వ న‌డుస్తూనే ఉంటుంది. కొన్నిరోజులు స్నేహంగానే ఉంటారు. మ‌రికొన్ని రోజులు ఒక‌రితో ఒక‌రు మాట్లాడుకోరు. రీసెంట్‌గా జ‌రిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌ల గొడ‌వ‌తో చిరంజీవి, మోహ‌న్‌బాబు మ‌ధ్య డైరెక్ట్‌గా మాట‌లు లేవు. దీనిపై మోహ‌న్‌బాబు కొన్నిసార్లైనా స్పందించారు కానీ.. చిరంజీవి త‌న‌కేమీ ప‌ట్ట‌న‌ట్లే ఉన్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌హా మెగా కుటుంబ స‌భ్యులు మాత్రం వారిద్ద‌రూ చాలా మంచి స్నేహితుల‌నీ చెప్పేస్తున్నారు. అయితే ఇప్పుడు చిరంజీవితో నీకేం గొడ‌వ‌? అని మ‌రోసారి మ‌రొక‌రు మోహ‌న్‌బాబు డైరెక్ట్‌గా ప్ర‌శ్నించారు. అయితే ఈసారి మోహ‌న్‌బాబు స‌మాధానం చెప్పాల్సిన అవ‌స‌రం ఉంది. ఎందుకంటే అక్క‌డ ప్ర‌శ్న వేసింది నంద‌మూరి బాల‌కృష్ణ‌. చిరంజీవిగారి మీద మీకు నిజంగా ఉన్న అభిప్రాయం ఏంటి? అని బాల‌కృష్ణ మ‌రో ప్ర‌శ్న వేయ‌గానే మోహ‌న్‌బాబు ఏం చెప్పాలా? అని పైకి చూశారు. అవును నిజ‌మే! నంద‌మూరి బాల‌కృష్ణ తొలి డిజిట‌ల్ ఎంట్రీ ఆహాలోని టాక్‌షో అన్‌స్టాప‌బుల్ ద్వారా జ‌రిగింది. బాల‌కృష్ణ అన్‌స్టాప‌బుల్ టాక్ షో.. రొటీన్‌గా మాత్రం ఉండ‌దు. వాడిగా, వేడిగా ఉంటుంద‌న‌డానికి విడుద‌లైన ప్రోమోనే సాక్ష్యం. దీపావ‌ళి సంద‌ర్భంగా న‌వంబ‌ర్ 4న ప్రసారం కాబోతున్న ఈ టాక్‌షోకు తొలి అతిథి మంచు మోహ‌న్‌బాబు ఆయ‌న కొడుకు విష్ణు, కూతురు ల‌క్ష్మీ ప్ర‌స‌న్న‌. ఈ టాక్‌షోలో మోహ‌న్‌బాబుని ఇరుకున పెట్టే ప్ర‌శ్న‌ను సంధించారు బాల‌య్య‌. ఇంత‌కీ ఆ ప్ర‌శ్న దేనిగురించో తెలుసా? చిరంజీవి గురించే. ఇదో ర‌కంగా మోహ‌న్ బాబుని ఇరుకున పెట్టే ప్ర‌శ్నే అయినా ఆయ‌నేమ‌ని చెప్పారో తెలుసుకోవాలంటే మాత్రం.. అన్‌స్టాప‌బుల్ తొలి ఎపిసోడ్ చూసేయాల్సిందే మ‌రి. దీనికి సంబంధించిన ప్రోమో చాలా ఆస‌క్తిక‌రంగా ఉంది. అటు బాల‌య్య‌, ఇటు మోహ‌న్‌బాబు మ‌న‌సు విప్పి చాలా విష‌యాలు మాట్లాడుకున్నారు. వ్య‌క్తిగ‌త ప్ర‌శ్న‌లే కాదు, ప్రొఫెష‌న‌ల్, పొలిటిక‌ల్ ప్ర‌శ్న‌ల‌ను కూడా బాల‌య్య సంధించారు. వాటికి మోహ‌న్‌బాబు త‌న‌దైన రీతిలో స‌మాధానం ఇచ్చారు. సినిమాల‌కే ప‌రిమ‌త‌మైన నంద‌మూరి బాల‌కృష్ణ తొలిసారి డిజిట‌ల్ ఎంట్రీ ఇచ్చారు. అది కూడా తెలుగు ఓటీటీ ఆహా ద్వారా. ఇందులో టాప్ టాలీవుడ్ సెల‌బ్రిటీల ఇంట‌ర్వ్యూల‌ను ఎంతో ఆహ్లాద‌కంగా డీల్ చేశార‌ని ప్రోమో చూస్తేనే అర్థ‌మ‌వుతుంది. ఇంకా లైన్‌లో రానా ద‌గ్గుబాటి, నేచుర‌ల్ స్టార్ నాని, పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ వంటి వారితో బాల‌య్య ఇంట‌ర్వ్యూస్ ఎలా సాగాయ‌నేది త్వ‌ర‌లోనే తెలియ‌నున్నాయి. ఈ టాక్‌షో తొలి సీజ‌న్ పూర్తి చేయ‌డానికి బాల‌య్య‌కు దాదాపు ఐదు కోట్ల రూపాయ‌ల రెమ్యున‌రేష‌న్ ఇచ్చిన‌ట్లు వార్తలు బ‌లంగా వినిపిస్తున్నాయి. అయితే ఇన్నిరోజులు చేసిన ఇంట‌ర్వ్యూస్ ఒక‌టైప్ అయితే బాల‌కృష్ట లేటెస్ట్ టాక్ షో అన్ స్టాప‌బుల్ మాత్రం నెక్ట్స్ రేంజ్ అనే చెప్పాలి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3BvhytM

కొన్ని సార్లు వదిలేయడమే ముఖ్యం!.. డిప్రెషన్‌లో అలా చేస్తానన్న సమంత

ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉంది. విడాకుల విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టేసినట్టు కనిపిస్తోంది. నాగ చైతన్యకు సంబంధించిన మెమోరీస్‌ను కూడా తన వద్ద ఉంచుకోవడం లేదనిపిస్తోంది. చైతూ ఫోటోలను తన ఇన్ స్టాగ్రాం నుంచి సమంత డిలీట్ చేసేస్తోంది. అయితే సమంత ఇప్పుడు మాత్రం తన స్నేహితులతో కలిసి తెగ ఎంజాయ్ చేస్తోంది. గత వారం అంతా ఛార్ ధామ్ యాత్ర అంటూ తీర్థ యాత్రల్లో మునిగి తేలిసింది. హిమాయలయాలు, పుణ్య క్షేత్రాలు అంటూ దైవ చింతనలో గడపింది. ఈ వారం అంతా కూడా దుబాయ్‌లో దుమ్ములేపేసింది. అయితే సమంత తన ఫ్రెండ్స్ ప్రీతమ్, సాధన సింగ్‌లతో కలిసి దుబాయ్ వీధుల్లో నానా హంగామా చేసింది. ఇంకా అక్కడే ఉన్నట్టు కనిపిస్తోంది. అయితే సమంత తన రూం ఎలా ఉంటుంది..బెడ్రూం ఎంత దారుణంగా ఉంటుందో చూపించింది. అలా చిందరవందరగా ఎక్కడపడితే అక్కడే బట్టలు పడేసి ఉంటాయని సమంత చెప్పేసింది. అలా గందరగోళంగా ఉన్న రూంను ఎంతో నీట్‌గా చేసేశారంటూ ఆర్గనైజ్ విత్ ఈజ్ అనే కంపెనీ గురించి సమంత ప్రమోషన్ చేసింది. ఆర్గనైజ్ విత్ ఈజ్ ఇలా మన రూంను ఎంతో అందంగా చేసేసిందని సమంత చెప్పుకొచ్చింది. మామూలుగా అయితే తనకు ఎప్పుడైనా మూడ్ బాగా లేకపోయినా, డిప్రెషన్‌లా అనిపించినా కూడా బట్టలన్నీ సర్దుకుంటూ క్లీన్ చేసుకుంటుందట. మొత్తానికి సమంత మాత్రం తన రూంను చూపించింది. అందులో బెడ్డు మీద కుప్పలు కుప్పలుగా బట్టలు పడేసి ఉంటే సాధన, ప్రీతమ్, సమంతలు మాత్రం బెడ్డు మీద ముచ్చట్లు పెట్టుకుంటూ ఉన్నారు. కొన్ని సార్లు సర్దడం, అన్నీ కలపడం కంటే అలా వదిలేయడం బెటర్ అన్నట్టుగా ఓ కొటేషన్‌ను సమంత చెప్పుకొచ్చింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3mstkkf

hero Nani: త‌న విల‌న్‌కు స‌పోర్ట్‌ చేయడానికి ముందుకొచ్చిన నేచుర‌ల్ స్టార్ నాని!

త‌న విల‌న్‌కు నేచుర‌ల్ స్టార్ స‌పోర్ట్ ఇవ్వ‌టం ఏంటి? అనే సందేహం రాక‌మాన‌దు. ఇంత‌కీ నాని విల‌న్ ఎవ‌రా? అంటే కార్తికేయ‌. కార్తికేయకు నాని ఏవిధంగా స‌పోర్ట్ చేస్తున్నారంటే.. హీరోగా న‌టించిన రాజా విక్ర‌మార్క చిత్రం ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌డం ద్వారా. యువ క‌థానాయ‌కుడు కార్తికేయ లేటెస్ట్ మూవీ ‘రాజా విక్ర‌మార్క‌’. యాక్ష‌న్ స్పై థ్రిల్ల‌ర్. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ టీజ‌ర్‌కు చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. సినిమాను న‌వంబ‌ర్ 12న విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు. న‌వంబ‌ర్ 1న సాయ‌త్రం 4 గంట‌ల 15 నిమిషాల‌కు ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే ఈ సినిమా ట్రైల‌ర్‌ను నేచుర‌ల్ స్టార్ నాని విడుద‌ల చేయ‌బోతున్నారు. ఇది వ‌ర‌కు నాని హీరోగా న‌టించిన గ్యాంగ్ లీడ‌ర్‌లో కార్తికేయ విల‌న్‌గా న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇలా ఓ అప్‌క‌మింగ్ హీరోకు ఆల్ రెడీ సెటిల్ అయిన హీరో స‌పోర్ట్ చేయ‌డం అనేది అభినందించాల్సిన విష‌య‌మే. ఇప్ప‌టి వ‌ర‌కు కార్తికేయ ప‌క్కా మాస్‌కు, యూత్‌కు క‌నెక్ట్ అయ్యే పాత్ర‌ల‌ను పోషించారు. కానీ తొలిసారి తన రూట్ మార్చి రాజా విక్ర‌మార్క‌తో డిఫ‌రెంట్ అటెంప్ట్ అయితే చేశార‌ని టీజ‌ర్‌తోనే అర్థ‌మైంది. న‌వంబ‌ర్ 1న విడుద‌ల కానున్న ట్రైల‌ర్ ఏ మేర‌కు ఆక‌ట్టుకుంటుంద‌నేది అంద‌రిలో ఆస‌క్తిని పెంచిన విష‌య‌మే. మ‌రోవైపు సినిమా కూడా న‌వంబ‌ర్ 12న విడుద‌ల‌వుతుంది. సాయి శ్రీపల్లి దర్శకత్వం వహించిన ఈ మూవీలో తాన్యా రవిచంద్రన్ హీరోయిన్‌గా న‌టించింది. హ్యాపీడేస్ ఫేమ్ సుధాక‌ర్‌ కోమాకుల కీలకపాత్రలో నటిస్తున్నారు. ఆదిరెడ్డి, 88 రామా రెడ్డి ఈ చిత్రానికి నిర్మాత‌లు. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందిస్తున్నారు. తొలి చిత్రం RX 100తో సూప‌ర్ హిట్ కొట్టి ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన కార్తికేయ ఆ రేంజ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. అలాగే కేవ‌లం హీరోగా న‌టిస్తే స‌రిపోతుంద‌నే ఫీలింగ్ కూడా లేదు. అవ‌కాశం ఉంటే విల‌న్‌గా కూడా న‌టించ‌డానికి ఆయ‌న సిద్ధం. ఎందుకంటే ఇప్ప‌టికే నాని గ్యాంగ్ లీడ‌ర్ చిత్రంలో కార్తికేయ విల‌న్‌గా న‌టించి ఆక‌ట్టుకున్నారు. ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ వ‌లిమై చిత్రంలోనూ కార్తికేయ విల‌న్‌గా న‌టిస్తున్నారు. ఒక‌వైపు న‌చ్చితే గ్రేషేడ్స్ ఉన్న పాత్ర‌లు చేస్తున్న కార్తికేయ హీరోగానూ వైవిధ్య‌మైన సినిమాలు చేస్తూ త‌న మార్క్ క్రియేట్ చేసుకుంటున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3mqqVGF

TDP పగ్గాలు చంద్రబాబుకు ఎందుకిచ్చావ్? బాలయ్యకు మోహన్ బాబు సూటి ప్రశ్న.. నటిసింహం షాకింగ్ రియాక్షన్

నందమూరి నటసింహం ట్రాక్ మార్చేశారు. ఇన్నాళ్లు రాజకీయాలు, సినిమాలతో బిజీగా ఉన్న ఆయన, ఇక డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నారు. ''అనిపించింది అందాం.. అనుకున్నది చేద్దాం.. ఎవరు ఆపుతారో చూద్దాం'' అని గర్జిస్తూ నేరుగా ఆన్ లైన్ వేదికలపై అడుగు పెడుతున్నారు నటసింహం. 'అన్‌స్టాప‌బుల్‌' అంటూ రంగంలోకి దూకుతున్నారు. ఈ షో తొలి ఎపిసోడ్‌ను మంచు మోహ‌న్‌ బాబు అండ్ ఫ్యామిలీపై చిత్రీక‌రించారు. ఇది దీపావ‌ళి సంద‌ర్భంగా న‌వంబ‌ర్ 4న ప్రసారం కానున్న నేపథ్యంలో తాజాగా ఈ షో ప్రోమో రిలీజ్ చేశారు. కేవలం 3 నిమిషాలతో కట్ చేసిన ఈ వీడియోలో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఇప్పటి వరకు ఎప్పుడూ చూడని విధంగా కొత్త అవతారంలో దర్శనమిచ్చారు బాలయ్య బాబు. సీనియర్ హీరోలు బాలకృష్ణ, మధ్య నడిచిన సంభాషణ ఎపిసోడ్‌పై అంతులేని ఆసక్తి నెలకొల్పింది. కామెడీ, కాంట్రవర్సీ కలగలపి సందడి చేశారు ఇద్దరు బడా హీరోలు. అలాగే ఈ ఇద్దరి జీవితాలకు సంబంధించిన సినీ, రాజకీయ విషయాలపై ఎన్నో సీక్రెట్స్ ఈ ఎపిసోడ్‌ ద్వారా తెలుసుకోవచ్చని ప్రోమో చూస్తుంటే స్పష్టమవుతోంది. ఇక ఈ ప్రోమోలో బాలయ్యను కొన్ని విషయాలపై మోహన్ బాబు సూటిగా ప్రశ్నించడం హైలైట్ అయింది. ''తెలుగుదేశం స్థాపించింది అన్న నందమూరి తారక రామారావు గారు. ఆయన తదనంతరం టీడీపీ పార్టీ పగ్గాలు నువ్వు తీసుకోకుండా చంద్రబాబుకు ఎందుకిచ్చావ్? అంటూ సూటిగా బాలయ్యను ప్రశ్నించారు మోహన్ బాబు. దీనిపై ఆ ఒక్కటి అడగొద్దు.. అన్నట్లుగా షాకింగ్ రియాక్షన్ ఇచ్చారు బాలకృష్ణ. ఇలాంటి ఎన్నో ఆసక్తికర సన్నివేశాలతో సాగిపోతున్న ఈ ప్రోమో వీడియో క్షణాల్లో వైరల్ అయింది. రిపీట్ చేసుకొని మరీ చూస్తున్నారు ప్రేక్షకులు. చూస్తుంటే బాలయ్య బాబు హోస్ట్ చేస్తున్న ఈ షో భారీ టీఆర్ఫీలు రాబట్టడం ఖాయమే అని తెలుస్తోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3GApkGr

అమ్మాయిల ప్రైవేట్ పార్ట్స్‌తో ఆడుకోవడం సరదా!.. కామాంధుడి గుట్టు విప్పిన చిన్మయి

సింగర్,డబ్బింగ్ ఆర్టిస్ట్, నటి సోషల్ మీడియాలో ఎంత బిజీగా ఉంటారో అందరికీ తెలిసిందే. మహిళ సమస్యలను ఎప్పుడూ ప్రపంచానికి తెలిసేలా చేస్తుంటుంది. మహిళలు ఎదుర్కొనే బాధలను, సమాజంలో అమ్మాయిలపై జరిగే అకృత్యాలను ఎప్పటికప్పుడూ ఎత్తి చూపిస్తూనే ఉంటుంది. అలాంటి చిన్మయి తాజాగా కొన్ని స్టోరీలను షేర్ చేసింది. తన ఇన్ స్టాగ్రాం స్టోరీల్లో ఓ కామాంధుడి కథను చెప్పింది. ఇద్దరు వ్యక్తులు చాటింగ్ చేసుకున్న తీరు.. అందులోనే చర్చించుకున్న విషయాలు, మాట్లాడుకున్న అసభ్యకర పదజాలం గురించి చిన్మయి స్పందించింది. మొన్నటికి మొన్న సబ్యసారి అడ్వర్టైజ్మెంట్, మంగళసూత్రాల మీద ఆయన చేసిన అసభ్యకర యాడ్ వివాదాస్పదంగా మారింది. దానిపై చిన్మయి స్పందించింది. మంగళసూత్రం కేవలం ఓ ఆభరణం లాంటిదేనని చిన్మయి అభిప్రాయపడింది. అయితే అది కేవలం ఆడవారికే ఎందుకు.. మరి మగవాళ్లకు పెళ్లైందని చూపించేందుకు ఎందుకు ఎలాంటి ఆభరణాలు పెట్టలేదని చిన్మయి ప్రశ్నించింది. అయితే తాజాగా ఓ కామాంధుడు చేసిన చాటింగ్, తన ఫ్రెండుతో పెట్టిన ముచ్చట్ల గురించి చిన్మయి గుట్టు విప్పింది. వాడికి పద్నాలుగేళ్ల వయసు వచ్చినప్పుడు అమ్మాయిల వక్షోజాల మీద కన్ను పడింది. వాటిని పట్టుకోవడం వాడికి సరదా అంటా. రద్దీగా ఉన్న చోట లేదా ఒంటరిగా ఉన్న సమయంలో అమ్మాయిల వక్షోజాలను తాకేవాడట. దాంట్లో వాడు ఎక్స్ పర్ట్ అంటా. అలా తన గురించి తాను గొప్పగా చెప్పుకున్నాడు. ఆ వయసులో అది సరదా అని అలా తన గ్యాంగులో తానే గ్రేట్.. ఎక్కువ మందివి పట్టుకున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఇలాంటి వాళ్లు కూడా సమాజంలో ఉన్నారు చూడండి అంటూ చిన్మయి తీవ్రంగా ఆవేదన చెందింది. సరదా కోసం అలాంటి పనులు చేసేవాడట అంటూ చిన్మయి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంకా చాలా చండాలంగా చేసిన ఆ చాటింగ్ వివరాలు, చేసిన ఘన కార్యాలు రాయడానికి కూడా వీల్లేకుండా ఉన్నాయి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2ZD3DoF

ఏడుపొస్తోంది.. నా బిడ్డలకు మోసం చేస్తున్నాను.. బాలయ్య ముందు కన్నీళ్లు పెట్టుకున్న మోహన్ బాబు

అదేంటి? మోహ‌న్‌బాబు త‌నేంతో ప్రేమించే త‌న పిల్ల‌ల‌ను మోసం చేస్తున్నారా? అనే సందేహం రాక మాన‌దు. ఈ మాట అన్న‌ది మోహ‌న్‌బాబే. అయితే మాట‌ల‌కు అర్థం సంద‌ర్భాన్ని బ‌ట్టి మారిపోతూ ఉంటుంది. ఇంత‌కీ మోహ‌న్‌బాబు ఏ సంద‌ర్భంలో ఈ మాట చెప్పార‌నే విష‌యం తెలియాలంటే మాత్రం నంద‌మూరి బాల‌కృష్ణ హోస్ట్ చేస్తున్న టాక్ షో అన్‌స్టాప‌బుల్ చూడాల్సిందే. దీపావ‌ళి సంద‌ర్భంగా న‌వంబ‌ర్ 4న అన్‌స్టాప‌బుల్ షో ఆహాలో ప్ర‌సారం కానుంది. దీనికి సంబంధించిన ప్రోమో విడుద‌లైంది. అస‌లు బాల‌కృష్ణ‌తో టాక్ షో అంటే ఎలా ఉండ‌బోతుందోన‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ ప్రోమో చూస్తే మాత్రం త‌ప్ప‌కుండా ఇదొక డిఫ‌రెంట్ టాక్ షో అని అర్థ‌మ‌వుతుంది. రొటీన్ టాక్ షోకు బాల‌య్య త‌న‌దైన ఎనర్జీని జోడించారు. మాస్‌, క్లాస్ ఆడియెన్స్‌ను ఆక‌ట్టుకునేలా డైలాగులేశారు. ఇక ప్ర‌శ్న‌ల సంగ‌తి స‌రేస‌రి! అటు మోహ‌న్‌బాబుని, ఇటు బాలకృష్ణ‌ని సినీ జ‌ర్న‌లిస్టులు అడ‌గ‌టానికి సంకోచించే ప్ర‌శ్న‌ల‌కు ఈ టాక్ షో స‌మాధానం చెప్పేస్తుంది. అలాగే ఒక ప‌ర్స‌న‌ల్ క్వ‌శ్చ‌న్ అని బాల‌కృష్ణ అన‌గానే మోహ‌న్‌బాబు విస్కీనా? అని అన్నారు. అప్పుడు బ్యాగ్రౌండ్‌లో ఏక్ పెగ్ లా అనే పాట రావ‌డం ఆక‌ట్టుకుంటుంది. హీరోగా నిల‌బడాల‌నుకుంటున్న‌ప్పుడు విఫ‌ల‌మ‌వుతుండ‌గా ఎప్పుడైనా బాధ‌ప‌డ్డారా? అని బాల‌కృష్ణ అడిగిన ప్ర‌శ్న‌కు మోహ‌న్‌బాబు ఎమోష‌న‌ల్ అయ్యి క‌న్నీళ్లు పెట్టుకున్నారు. . త‌లుచుకుంటే ఏడుపొస్తుంది సోద‌రా!, నా బిడ్డ‌ల‌కు మోసం చేస్తున్నాన‌నిపించింది. ఎందుకంటే నేను ఉన్న ఇల్లు అమ్మేశాను. ఎవ‌రూ స‌హాయం చేయ‌లేదు అని బాధ‌ప‌డ్డారు. అదే స‌మ‌యంలో మోహ‌న్‌బాబు కూడా బాల‌కృష్ణ‌ను కొన్ని ప్ర‌శ్న‌లు వేశారు. ఇక షోలో ల‌క్ష్మి, విష్ణు ఎంట్రీ ఇచ్చారు. మీరు నాన్న‌తో ఈ మ‌ధ్య చెప్పిన అబ‌ద్దాలేంటి? అని ఇద్ద‌రినీ బాల‌కృష్ణ అడిగిన ప్ర‌శ్న‌కు మోహ‌న్‌బాబు మాట్లాడుతూ ల‌క్ష్మి ఈ మ‌ధ్య అబ‌ద్దాలు నేర్చుకుంది కానీ.. విష్ణు అబ‌ద్దాలు చెప్ప‌డు అని అన్నారు. దానికి మీరు అలా అనుకుంటారు డాడో డాడి.. అంటూ ల‌క్ష్మీ మంచు రియాక్ష‌న్ బావుంది. షోలో దంచ‌వే మేన‌త్త కూతురా పాట‌కు బాల‌కృష్ణ‌, ల‌క్ష్మీ మంచు క‌లిసి డాన్స్ చేశారు. అలాగే ల‌క్ష్మీ మంచు జై బాల‌య్య అని ఎన‌ర్జిటిక్‌గా చెప్పింది’’ అన్నారు. ఈ ఎపిసోడ్ కోసం బాల‌య్య త‌న లుక్‌ను పూర్తిగా మార్చేశారు. బాల‌య్య లుక్‌కు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైర‌ల్ అవుతున్నాయి. ఈ షో కోసం బాల‌య్య‌కు భారీ రెమ్యున‌రేష‌న్ ద‌క్కిన‌ట్లు టాక్‌. ఇండ‌స్ట్రీలో వినిపిస్తోన్న వార్త‌ల ప్ర‌కారం దాదాపు ఐదు కోట్ల రూపాయలు బాల‌య్య‌కు ఈ షో కోసం చెల్లించార‌ట‌. దీనికి వ‌చ్చే రెస్పాన్స్‌ను బ‌ట్టి త‌దుపరి సీజ‌న్‌ను ఎప్పుడు చేయాల‌నేది ప్లాన్ చేస్తార‌ని కూడా టాక్ వినిపిస్తోంది. డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ బాల‌కృష్ణ అన్‌స్టాప‌బుల్‌ను చిత్రీక‌రిస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3bslaC6

RRR : ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్‌లలో ఎవరు బెస్ట్ చెప్పిన రాజమౌళి

బాహుబ‌లితో తెలుగు సినిమా స్థాయిని ప్ర‌పంచానికి చాటిన ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి త‌దుప‌రి చిత్రం RRR. పాన్ ఇండియా రేంజ్‌లో టాలీవుడ్ టాప్ స్టార్స్ అయిన యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌ల‌తో పాటు బాలీవుడ్ స్టార్స్ ఆలియా భ‌ట్‌, అజ‌య్ దేవ‌గ‌ణ్ ఇంకా హాలీవుడ్ స్టార్స్ ఒలివియా మోరిస్‌, రే స్టీవెన్ స‌న్‌, అలిస‌న్ డూడి త‌దిత‌రుల‌తో ఈ సినిమాను రూపొందించారు. 1940 బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఫిక్ష‌న‌ల్ పీరియాడిక్ మూవీ ఇది. భారీ తారాగ‌ణం.. నాలుగు వంద‌ల కోట్ల రూపాయ‌ల‌కు పైగానే బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రంపై అంద‌రిలో భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇప్ప‌టికే సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా ఓ ప‌క్క జ‌రుగుతుండ‌గా మ‌రోవైపు రాజ‌మౌళి త‌న సినిమాకు కావాల్సిన ప్ర‌మోష‌న్స్ వేగ‌వంతం చేశారు. రీసెంట్‌గా జ‌క్క‌న్న ఓ ఇంట‌ర్వ్యూలో RRR గురించి మాట్లాడారు. ఆ స‌మ‌యంలో ప్ర‌భాస్‌, రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌.. ఈ ముగ్గురితో మీరు ప‌నిచేశారు. మీ దృష్టిలో మీరు ఎవ‌రికీ ఓటేస్తారు? అని ఒక‌రు ప్ర‌శ్నించారు. అస‌లు రాజ‌మౌళి ఎలాంటి స‌మాధానం చెబుతారా? అని అంద‌రిలో ఆస‌క్తి పెరిగింది. అయితే రాజ‌మౌళి తెలివైన ప్ర‌శ్న‌ను చాలా తెలివిగా డీల్ చేసి అంద‌రితో ఔరా! అనిపించుకున్నారు. ఇంత‌కీ రాజ‌మౌళి ఏమ‌న్నారంటే.. ‘‘ఒక్కొక్క సంద‌ర్భంలో ఒక్కొక్క‌రుంటారు. సినిమా గురించి, యాక్టింగ్ గురించి ఏదైనా మాట్లాడాలంటే ఎన్టీఆర్‌తో స‌మ‌యం గ‌డ‌ప‌టానికి ఇష్ట‌ప‌డ‌తాను. అలాగే నాకు జంతువులు అంటే చాలా ఇష్టం. ఓ ర‌కంగా పిచ్చి. ఆ జంతువులు ఎలా ప్ర‌వ‌ర్తిస్తాయి. వాటి గురించి తెలుసుకోవ‌డానికి గంట‌ల స‌మ‌యం వెచ్చిస్తాను. వాటి గురించి మాట్లాడాలంటే రామ్‌చ‌ర‌ణ్‌తో స‌మ‌యం గ‌డ‌ప‌టానికి ఇష్ట‌ప‌డ‌తాను. అలాగే పుడ్ గురించి మాట్లాడాలంటే ప్ర‌భాస్‌తో టైమ్ స్పెండ్ చేస్తాను’’ అని అన్నారు రాజ‌మౌళి. RRRలో తెలంగాణ గోండు వీరుడు కొమురం భీమ్‌గా యంగ్ టైగ‌ర్ క‌నిపించ‌నుంటే, ఆంధ్ర ప్రాంతానికి చెందిన మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజుగా మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ క‌నిపించ‌నున్నారు. ఈ రెండు పాత్ర‌లు చ‌రిత్ర‌లో క‌లుసుకోలేదు. అయితే ఒక‌వేళ క‌లుసుకుని బ్రిటీష్‌వారిపై పోరాడితే ఎలా ఉంటుంద‌నే ఫిక్ష‌న‌ల్ పాయింట్‌తో రాజ‌మౌళి ఈ సినిమాను తెర‌కెక్కించారు.అలాగే ఈ రెండు పాత్ర‌లు ఎలా ఉండ‌బోతాయ‌నే విష‌యాన్ని టీజ‌ర్స్ ద్వారా ప్రెజెంట్ చేశారు ద‌ర్శ‌క‌ధీరుడు. అలాగే న‌వంబ‌ర్ 1న ఈ సినిమాలో 45 సెక‌న్ల గ్లింప్స్‌ను విడుద‌ల చేస్తున్నారు. అలాగే సినిమాను వ‌చ్చే ఏడాది సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 7న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3pSBBjF

Bala Krishna : బాలకృష్ణ అన్‌స్టాపబుల్.. ఐదు ఎపిసోడ్స్ లిస్టు ఇదే..నిజంగా ఆహా అనాల్సిందే!

నందమూరి బాల‌కృష్ణ డిజిట‌ల్ ఎంట్రీ ఇచ్చేశారు. ఇక స్క్రీన్‌పై సంద‌డి చేయాల్సింది మాత్రమే మిగిలింది. తెలుగు ఓటీటీ మాధ్య‌మ‌మైన ఆహాలో బాల‌య్య అన్‌స్టాప‌బుల్ అనే టాక్‌షో కు వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే షోకు సంబంధించిన ప్రోమో విడుద‌లైంది. ప్ర‌స్తుతం అన్న‌పూర్ణ స్టూడియోలో షోకు సంబంధించిన షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. తొలి ఎపిసోడ్‌ను మంచు మోహ‌న్‌బాబు ఫ్యామిలీతో చిత్రీక‌రించారు. ఇందులో మంచు మోహ‌న్‌బాబు, ల‌క్ష్మీ ప్ర‌స‌న్న‌, విష్ణు పాల్గొన‌గా..వారిని బాల‌కృష్ణ ప్ర‌శ్న‌ల‌డిగారు. ఈ షోకు సంబంధించిన చిత్రీక‌ర‌ణ ఎప్పుడో ముగిసింది. దీన్ని దీపావ‌ళి సంద‌ర్భంగా న‌వంబ‌ర్ 4న విడుద‌ల ప్ర‌సారం చేయ‌బోతున్నారు. నంద‌మూరి అభిమానులంద‌రూ ఈ షో కోసం చాలా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఇండ‌స్ట్రీ తాజా స‌మాచారం మేర‌కు ఇప్ప‌టి వ‌ర‌కు అన్‌స్టాప‌బుల్‌లో ఐదు ఎపిసోడ్స్‌కు సంబంధించిన చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింద‌ట‌. తొలి ఎపిసోడ్‌ను మోహ‌న్‌బాబు అండ్ ఫ్యామిలీపై చిత్రీక‌రించారు. ఇక రెండ‌వ షోను రానా ద‌గ్గుబాటిపై చిత్రీక‌రించారు. ఇక మూడో ఎపిసోడ్‌ నేచుర‌ల్ స్టార్ నానితో ఉంటుంది. ప్ర‌స్తుతం ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది. త‌ర్వాత నాలుగో షోను పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌పై చిత్రీక‌రించ‌బోతున్నారు. ఇక ఐద‌వ ఎపిసోడ్‌ను నంద‌మూరి మ‌రో న‌ట వార‌సుడు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌పై చిత్రీక‌రిస్తార‌ట‌. నిజంగానే అన్ స్టాప‌బుల్ ఇంట‌ర్వ్యూస్ లైనప్ మాత్రం అదిరింది. ప్ర‌తి ఎపిసోడ్ అంచ‌నాల‌ను పెంచేస్తుంద‌న‌డంలో సందేహం లేదు. ఈ ఎపిసోడ్ కోసం బాల‌య్య త‌న లుక్‌ను పూర్తిగా మార్చేశారు. బాల‌య్య లుక్‌కు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైర‌ల్ అవుతున్నాయి. ఈ షో కోసం బాల‌య్య‌కు భారీ రెమ్యున‌రేష‌న్ ద‌క్కిన‌ట్లు టాక్‌. ఇండ‌స్ట్రీలో వినిపిస్తోన్న వార్త‌ల ప్ర‌కారం దాదాపు ఐదు కోట్ల రూపాయలు బాల‌య్య‌కు ఈ షో కోసం చెల్లించార‌ట‌. దీనికి వ‌చ్చే రెస్పాన్స్‌ను బ‌ట్టి త‌దుపరి సీజ‌న్‌ను ఎప్పుడు చేయాల‌నేది ప్లాన్ చేస్తార‌ని కూడా టాక్ వినిపిస్తోంది. డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ బాల‌కృష్ణ అన్‌స్టాప‌బుల్‌ను చిత్రీక‌రిస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం బాలయ్య హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేసిన అఖండ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా విడుదలపై ఓ క్లారిటీ వస్తుందని సమాచారం. దీని తర్వాత , గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. దీన్ని మైత్రీ మూవీస్ వారు నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నవంబర్ నుంచే ఆ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమవుతుందని సినీ వర్గాల సమాచారం.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3bwc1bu

ఒత్తిడిలో తీసుకున్న నిర్ణయాలు! రోజులు మారుతుంటే జరిగేది అదే.. సమంత సెన్సేషనల్ కామెంట్స్

ట్విట్టర్ ఖాతా నుంచి ఎప్పుడైతే అక్కినేని పేరును తొలగించిందో అప్పటినుంచి సోషల్ మీడియాలో పేరు మారుమోగిపోతోంది. నాగ చైతన్యతో విడాకుల విషయమై బోలెడన్ని వార్తలు షికారు చేసిన అనంతరం అవన్నీ నిజమే అని ప్రకటించి షాకిచ్చింది సమంత. చైతూతో వివాహ బంధానికి ఫుల్‌స్టాప్ పెడుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇక ఆ క్షణం నుంచి తనదైన దారిలో వెళుతూ సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది సమంత. సోషల్ మీడియా ఖాతా ద్వారా తన రెగ్యులర్ అప్‌డేట్స్ ఇస్తూనే మోటివేషనల్ లైన్స్ షేర్ చేస్తోంది. వ్యక్తిగత జీవితానికి దైర్యం ముఖ్యమంటూ ఆమె షేర్ చేస్తున్న సందేశాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే అమ్మాయి చదువు, పెళ్లి అంటూ ఆడపిల్లల తల్లిదండ్రులకు సూచనలిచ్చిన సామ్.. తాజాగా మరో ఆసక్తికర పోస్ట్ పెట్టింది. ప్రముఖ రైటర్ రాబర్ట్ రాసిన పదాలను ఇన్స్‌స్టా స్టోరీగా పెట్టేసింది. ఒక మనిషి ఒత్తిడిలో ఉన్నప్పుడు తీసుకునే నిర్ణయాలే ఆ మనిషి ఏంటనేది తెలియజేస్తాయని, ఆ సమయంలో మనిషి స్వభావం బయట పడుతుందని రాబర్ట్ రాసిన వాక్యాలను అందరి ముందు పెట్టింది సమంత. అంతేకాదు రోజు రోజుకూ పరిస్థితులు మారుతాయని, మీ కోసం ఏది ఉద్దేశించబడి ఉంటుందో, ఏదైతే మీరు కోరుకుంటారో దానికి మార్గం పడుతూ వస్తుంది అని సామ్ పేర్కొంది. దీంతో ఈ పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సమంత చెప్పిన దాంట్లో పలు అర్థాలు వెతుకుతున్నారు నెటిజన్లు. ఇకపోతే ఇటీవలే తన 'శాకుంతలం' సినిమా షూటింగ్ కంప్లీట్ చేసిన సమంత.. ప్రస్తుతం స్నేహితులతో కలిసి సరదాగా షికార్లు కొడుతోంది. విదేశాలను చుట్టి వస్తూ అక్కడి అందాలను కేమ్రాలో బంధించి అభిమానుల ముందు పెడుతోంది. ప్రస్తుతం సామ్.. దుబాయ్ టూర్‌లో ఉంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3muDFMD

టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణకు అస్వస్థత.. ఆసుపత్రిలో చికిత్స

టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణకు స్వల్ప అస్వస్థత గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ను శనివారం రాత్రి సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం వైద్యుల సమక్షంలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం ఆయన ఇంట్లోనే ప్రమాదవశాత్తు జారి పడ్డారు. అప్పటి నుంచి మందులు వాడుతున్నా పెద్దగా ప్రయోజనం లేకపోగా నిన్న రాత్రి నొప్పులు ఎక్కువ కావడంతో ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని, ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కుటుంబ సభ్యులు అంటున్నారు. ఒకానొక సమయంలో వరుస సినిమాలతో బిజీగా ఉన్న .. టాలీవుడ్ మూడు తరాల హీరోలతో తెరపంచుకున్నారు. సిపాయి కూతురు సినిమాతో 1959లో సినీ ఎంట్రీ ఇచ్చిన ఆయన.. 2019లో విడుదలైన ‘ఎన్టీఆర్‌ కథానాయకుడు’, ‘మహర్షి’ చిత్రాల తర్వాత వెండితెరకు దూరంగా ఉంటున్నారు. వయసు మీద పడటంతో ఆనారోగ్య కారణాలతో ఇంటిపట్టునే ఉంటున్నారు కైకాల. గత 60ఏళ్లుగా తెలుగు సినిమా రంగంలో 777 సినిమాల్లో నటించారు కైకాల సత్యనారాయణ. నటుడిగా పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రలు చేసిన ఆయన.. పలు చిత్రాల్లో హాస్య నటుడిగా, ప్రతినాయకుడిగా, నాయకుడిగా ప్రధాన భూమికలు పోషించారు. ఆయన పోషించిన వైవిధ్యమైన పాత్రలకు గుర్తుగా 'నవరస నటనా సార్వభౌమ' అనే బిరుదును ఇచ్చింది తెలుగు సినిమా ఇండస్ట్రీ.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3bujLuR

Saturday 30 October 2021

Everything You Should Know About Facebook's Name Change

What exactly is metaverse, and why did Facebook decide to change its name to Meta? Everything you need to know.

from NDTV Gadgets - Latest https://ift.tt/3bsA6QM

RT70 : నిర్మాత‌గా మారిన ర‌వితేజ‌.. రామాయణంతో మాస్ మ‌హారాజాకు లింకు .. వివాదాల‌కు దారి తీస్తుందా!

మాస్ మ‌హారాజా ర‌వితేజ రెండు వైపులా ప‌దున్న క‌త్తిలా దూసుకెళ్లిపోతున్నారు. ఒక‌వైపు సినిమాలు పూర్తి చేస్తున్నారు.. మ‌రోవైపు కొత్త సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేస్తున్నారు. ఇప్ప‌టికే ఖిలాడి సినిమాను పూర్తి చేసిన ఈ కమ‌ర్షియ‌ల్ స్టార్ హీరో త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వంలో ధ‌మాకా సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అల్యూమియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. ఈ సినిమాను కూడా చాలా త్వ‌ర‌గా పూర్తి చేసేస్తున్నారు మాస్‌రాజా. ఈ సినిమా కంప్లీట్ కాకుండానే నెక్ట్స్ సినిమాకు ఓకే చెప్పేశారు. 70వ చిత్రాన్ని అధికారికంగా అనౌన్స్ చేశారు. దానికి సంబంధించి ఓ పోస్ట‌ర్‌ను కూడా విడుద‌ల చేశారు. ఈ పోస్ట‌ర్‌ను గ‌మ‌నిస్తే.. ఇందులో హీరోలు వెళ్లిపోరు అనే లైన్ ఉంది. దీనికి త‌గిన‌ట్లు ఆల‌యంపై ఉండే శిల్పాలు.. అందులో మ‌న ఇతిహాసం రామాయ‌ణంను సూచిస్తున్నాయి. అందులో రావణాసురుడు శిల్పం ప్ర‌ముఖంగా క‌నిపిస్తుంది. అంటే రాముడు.. రావ‌ణాసురుడుకి ఈ క‌థ‌కు ఉన్న లింకేంట‌నేది తెలుసుకోవాలంటే వేచి చూడక త‌ప్ప‌దు. ద‌ర్శ‌కుడు సుధీర్ వ‌ర్మ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌, టైటిల్‌ను న‌వంబ‌ర్ 5న ఉద‌యం 10 గంట‌ల 08 నిమిషాల‌కు విడుద‌ల చేస్తున్నారు. శ్రీకాంత్ విస్సా అందిస్తున్న క‌థ‌, మాట‌లు అందిస్తున్నారు. అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మూవీ అనౌన్స్‌మెంట్ పోస్ట‌ర్‌ను చూసి ర‌వితేజ ఫ్యాన్స్ సెల‌బ్రేష‌న్స్ చేసుకుంటున్నారు. స‌రికొత్త సినిమాతో మా హీరో సిల్వ‌ర్ స్క్రీన్‌పై సంద‌డి చేయ‌డం ఖాయ‌మ‌ని వారు ఆనందంగా ఉన్నారు. అయితే ఇతిహాసాల‌ను ఆధారంగా చేసుకుని సినిమాల‌ను తెర‌కెక్కించే స‌మ‌యంలో చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. లేకుంటే వివాదాల‌కు కేరాఫ్‌గా మారిపోతాయి. అయితే ర‌వితేజ ఇలాంటి వివాదాల‌కు దూరంగానే ఉంటారు. మ‌రి రామాయ‌ణంకు, ర‌వితేజ సినిమాకు లింకేంటో తెలుసుకోవాలంటే ఆగ‌క త‌ప్ప‌దు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేంటే ఈ సినిమాతో రవితేజ నిర్మాత‌గా మారుతున్నారు. సినిమా అనౌన్స్‌మెంట్ పోస్ట‌ర్‌లో ఆర్‌టి టీమ్ వ‌ర్క్స్ అనే పేరుంది. అంటే ఇది ర‌వితేజ టీమ్ వ‌ర్క్స్ అనే నెటిజ‌న్స్ భావిస్తున్నారు. మ‌రి రవితేజ త‌న సినిమాల‌కు మాత్ర‌మే నిర్మాత‌గా ఉంటారా? లేక వేరే టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేస్తాడా? అనేది చూడాలి. సాధార‌ణంగా ఎక్స్‌పెరిమెంట‌ల్ సినిమాలంటే క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌కు ర‌వితేజ ప్రాధాన్యం ఇస్తుంటాడు. అందుకు కార‌ణం ఆయ‌నకు ఎక్స్‌పెరిమెంట్స్ మూవీస్ పెద్ద‌గా క‌లిసి రాలేదు. మ‌రి సుధీర్ వ‌ర్మ ఈసారి రవితేజ‌ను డిఫ‌రెంట్‌గా ఎలా ప్రెజెంట్ చేసి మెప్పిస్తారో వేచి చూద్దాం మ‌రి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3muHXnh

ఆశ ఎన్‌కౌంటర్ ట్రైలర్: కల్పితం అంటూనే అంతా చూపించిన ఆర్జీవీ

కాంట్రవర్సీ ఎక్కడ ఉంటే చూపు అక్కడే. ఈ విషయాన్ని ఎవరో చెప్పడం కాదు.. ఆయన తీరు చూసే ప్రతి ఒక్కరికీ అర్థమవుతుంది. వివాదాస్పద సినిమాలు తీయడంలో తనకంటూ స్పెషల్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్న ఆయన.. ఎవరెన్ని విమర్శలు చేసినా తన దారి తనదే అన్నట్లుగా వెళుతున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌ నగర శివారులో జరిగిన నేపథ్యంలో సినిమా రూపొందించారు ఆర్జీవీ. నవంబర్ 26, 2019న షాద్ నగర్ సమీపంలో జరిగిన దిశ సామూహిక అత్యాచారం యావత్ భారత దేశాన్ని ఆగ్రహంలో ముంచెత్తింది. ఆ తర్వాత దిశ నిందితులు ఎన్‌కౌంటర్ చేయబడ్డారు. అయితే నలుగురు యువకులు అత్యంత పాశవికంగా దిశను సామూహిక అత్యాచారం చేసి హతమార్చిన ఈ దుర్ఘటనను, ఆ తర్వాత ఆ దారుణానికి ఒడిగట్టిన ఆ నలుగురు యువకుల ఎన్‌కౌంటర్ దృశ్యాలను తన సినిమాలో చూపించబోతున్నారు రామ్ గోపాల్ వర్మ. ఈ మూవీకి ఆశ ఎన్ కౌంటర్ అని పేరు పెట్టిన ఆర్జీవీ.. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. 2 నిమిషాల నిడివితో కూడిన ఈ వీడియోలో దిశ ఘటనను చూపించే ప్రయత్నం చేశారు. అయితే ట్రైలర్ మొదట్లో మాత్రం 'ఈ చిత్రం ఏ వ్యక్తుల పైన, ఏ ఘటనల పైన ఆధారపడి తీయలేదు కేవలం కల్పితం' అని చెబుతూ తనదైన దారిలో వెళ్లారు వర్మ. చిత్రాన్ని దిశ సంఘటన చోటు చేసుకున్న తేదీ నవంబర్ 21న రిలీజ్ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఇకపోతే ఈ సినిమా సోనియా ఆశ అనే అమ్మాయి టైటిల్ రోల్ పోషిస్తోందని ఆర్జీవీ తెలిపారు. అనురాగ్‌ కంచర్ల ప్రొడక్షన్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాకు ఆనంద్‌ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2ZL0AKP

How to Add Links to Instagram Stories

Instagram earlier allowed only users with more than 10,000 followers to post links in Stories. However, it recently removed that condition and now any user can add links to their Instagram Stories....

from NDTV Gadgets - Latest https://ift.tt/3boRfdR

అందుకే పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయలేదు.. ఓ సారి ఆయన్ని కలిస్తే! సీక్రెట్ బయటపెట్టిన రాజమౌళి

తెలుగు సినిమా రేంజ్ ఏంటనేది ప్రపంచానికి చాటిచెప్పిన దర్శకుడు . బాహుబలి లాంటి భారీ సినిమాతో గత రికార్డులన్నీ తుడిపేశారు జక్కన్న. ఇక ఎల్లలుదాటిన క్రేజ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సొంతం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది అభిమానుల గుండెల్లో గూడు కట్టుకున్నారు పవన్. మరి అలాంటి ఈ ఇద్దరు దిగ్గజాలు కలిస్తే ఆ సంచలనాలు ఉహించగలమా? రాజమౌళి- పవన్ కళ్యాణ్ కాంబోలో సినిమా రావాలనేది ఎంతోమంది సినీ ప్రియుల కోరిక. తాజాగా ఈ విషయమై రియాక్ట్ అయ్యారు రాజమౌళి. తాజాగా శ్రీకాకుళంలో జరిగిన ఓ కాలేజ్ ఫెస్టివల్‌కు ముఖ్య అతిథిగా విచ్చేసిన రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు ఛేహారు. పవన్‌తో మీ సినిమా ఎప్పుడని ఓ స్టూడెంట్ అడగడంతో ఓపెన్ అయ్యారు జక్కన్న. పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేయాలని చాలా సంవత్సరాలు వెయిట్ చేశానని, కానీ అది కుదరలేదని చెబుతూ గత విషయాలు ప్రస్తావించారు రాజమౌళి. ''ఓ సారి ఓ మూవీ షూటింగ్ జరుగుతుండగా పవన్‌ని కలిశాను. ఆయనతో మాట్లాడితే చాలా కంఫర్టబుల్‌గా అనిపించింది. ఆ తర్వాత సార్ మీరు చెప్పండి మీకు ఎలాంటి సినిమా చేయాలని ఉంది అని అడిగా. మీరు ఎలాంటి సినిమా అనుకుంటున్నారో అది చెప్పండి. ఎలాంటి సినిమా చేయడానికైనా నేను రెడీ అన్నారు. సరే సార్ అయితే మీరు టైమివ్వండి.. ఏ టైమ్‌లో రమ్మంటే ఆ టైమ్‌లో వచ్చి మీకు కథ చెబుతా అన్నాను. ఆ తర్వాత ఆయన దగ్గర్నుంచి కబురొస్తుందని చూశాను.. రాలేదు. ఆయన వేరే వేరే సినిమాలు చేస్తూ బిజీ అయ్యారు. ఈ లోపు నా థింకింగ్ మారిపోయింది. జస్ట్ మాస్ సినిమాలు కాదు.. మోర్ బిగ్గర్, వైడర్ రీచ్ ఉన్న సినిమాలు చేయాలని అనుకున్నా. అలా 'మగధీర', 'యమదొంగ'.. లాంటి సినిమాలు చేస్తూ వచ్చా. ఆయనకేమో సినిమాలకంటే రాజకీయాల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చింది. ఈ లోపల ఎక్కువ నంబర్ ఆఫ్ డేస్ సినిమాలకు ఇలా నా డైరెక్షన్ వెళ్ళిపోయింది. సో.. పవన్ అంటే నాకు చాలా ఇష్టం, గౌరవం కూడా. కాకపోతే మేమిద్దరం వేర్వేరు మార్గాల్లో ట్రావెల్ చేస్తున్నాము'' అన్నారు. ప్రస్తుతం RRR సినిమాతో బిజీగా ఉన్నారు రాజమౌళి. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న ఈ భారీ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3jRmTpk

Call of Duty: Vanguard to Forza Horizon 5: Games to Play in November

Call of Duty: Vanguard, Battlefield 2042, Forza Horizon 5, and more games are set to hit the shelves this November. Here are some of the most exciting games set to release on PS5, PS4, Xbox Series X,...

from NDTV Gadgets - Latest https://ift.tt/2ZHATLa

How to Record Calls Using Truecaller on Android Phones

In this article, we are giving a step-by-step guide on how you can record calls using Truecaller for Android.

from NDTV Gadgets - Latest https://ift.tt/3nMhr82

పునీత్‌కు కన్నీటి వీడ్కోలు.. అశ్రు నయనాల నడుమ ముగిసిన స్టార్ హీరో అంత్యక్రియలు

కన్నడ పవర్‌ స్టార్‌ శుక్రవారం గుండెపోటుతో మరణించడంతో యావత్ సినీ ఇండస్ట్రీ షాక్ అయింది. ఉదయం జిమ్‌ చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిన ఆయన ఆసుపత్రికి తరలించాక చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. పునీత్‌ మరణవార్త సౌత్ ఇండియాలో సినీ ప్రేక్షకులను తీవ్రంగా కలచివేసింది. పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఇక శనివారం బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో ఏర్పాటు చేసిన పునీత్‌ అంతిమ దర్శనానికి తెలుగు, తమిళ చిత్రసీమలకు చెందిన నటీనటులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కంఠీరవ మైదానంలో పునీత్ భౌతిక కాయానికి నివాళులర్పించి శ్రద్థాంజలి ఘటించారు. బాలకృష్ణ, జూనియర్‌ ఎన్టీఆర్‌ పునీత్‌ పార్ధివ శరీరాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. అయితే నిన్న (శనివారం) సాయంత్రమే పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియలు జరగాల్సి ఉండగా.. ఆయన పెద్ద కూతురు అమెరికా నుంచి వచ్చేందుకు ఆలస్యం కావడం వల్ల నేటి తెల్లవారు జామున పునీత్ అశ్రు నయనాల నడుమ పునీత్ అంత్యక్రియలు జరిపారు. బెంగళూరులోని శ్రీ కంఠీరవ స్టూడియోస్‌‌లో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియలు ముగిశాయి. పునీత్‌ పార్థివ దేహంపై కాసేపు జాతీయ జెండాను కప్పి ఉంచి, అనంతరం ఆ పతాకాన్ని పునీత్‌ భార్యకు అందజేశారు. కంఠీరవ స్టూడియోస్‌‌లోని తండ్రి సమాధి దగ్గరే ఆయన కూడా సమాధి అయ్యారు. ఈ అంతిమయాత్రలో కర్నాటక సీఎం బసవరాజ్ బొమ్మై, మాజీ సీఎంలు యడ్యూరప్ప, సిద్దరామయ్యలతో పాటు పలువురు మంది సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొని పునీత్‌కు కడసారి వీడ్కోలు పలికారు. పునీత్ భార్య అశ్విని, కుమార్తెలు వందిత, ధృతి, సోదరుడు శివరాజ్‌కుమార్ రోదనలు పలువురి చేత కంటతడి పెట్టించాయి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/315SJrB

S. S. Rajamouli: ప్రభాస్‌- రాజమౌళి వార్! జనాల్లో ఓ రేంజ్ చర్చలు.. ఈ విషయమై జక్కన్న రియాక్షన్ వైరల్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దర్శక ధీరుడు రాజామౌళి.. ఇద్దరూ ఇద్దరే. ఎల్లలు దాటిన క్రేజ్ ఈ ఇద్దరి సొంతం. బాహుబలి సిరీస్‌తో యావత్ సినీ ఇండస్ట్రీ ఎప్పటికీ చెప్పుకునే భారీ హిట్ ఇచ్చిన ఘనత ఈ ఇద్దరి సొంతం. ఇద్దరూ కలిశారంటే అదో సంచలనం. మరి అదే ఇద్దరూ విడివిడిగా పోటీకి దిగితే?. మరికొద్ది రోజుల్లో అదే సీన్ చూడబోతున్నాం. వచ్చే జనవరిలో సినిమాతో జక్కన్న బరిలోకి దిగబోతుంటే సినిమాతో ప్రభాస్ రంగంలోకి దూకుతున్నారు. దీంతో ఈ ఇద్దరి 'ఢీ'పై టాలీవుడ్ వర్గాల్లో ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి. అటు తెరకెక్కిస్తున్న భారీ సినిమా RRR, ఇటు ప్రభాస్ హీరోగా నటిస్తున్న 'రాధే శ్యామ్' సినిమాలు చాలాకాలంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఎట్టకేలకు ఈ రెండు సినిమాలు జనవరి నెలలోనే, అది కూడా వారం గ్యాప్‌లో రిలీజ్ కానున్న నేపథ్యంలో తెలుగు ప్రేక్షకుల దృష్టి మొత్తం సంక్రాంతిపై పడింది. జనవరి 7వ తేదీన RRR గ్రాండ్ రిలీజ్ ఉండగా, జనవరి 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా 'రాధే శ్యామ్' ప్రేక్షకుల ముందుకొస్తోంది. దీంతో ఈ రెండు సినిమాలు పోటీపడనున్నాయనే టాక్ షురూ అయింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ఇష్యూపై దర్శక ధీరుడు రాజమౌళి క్రేజీగా రియాక్ట్ అయ్యారు. RRR, రాధే శ్యామ్ మధ్య గట్టిపోటీ ఉండనుందా? అనే ప్రశ్నపై ఆయన స్పందించారు. సినిమాల మధ్య పోటీ అనేది సహజమని, గతంలో కూడా ఉంది.. ఇప్పుడూ ఉంటుందని జక్కన్న చెప్పారు. అయితే ఎన్ని సినిమాలు విడుదలైనా కంటెంట్‌ బాగుంటే ప్రేక్షకులు అన్ని సినిమాలను ఆదరిస్తారు. కాబట్టి అందులో పోటీ అనుకోవడానికి ఏమీ లేదు. మా సినిమాతో పాటు అన్ని సినిమాలు కూడా బాగా రాణించాలని కోరుకుంటున్నాము అని చెప్పుకొచ్చారు రాజమౌళి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3w1Ufq0

ఆ కోరిక తీరకుండానే పునీత్ వెళ్లిపోయారు.. విషయం చెబుతూ డైరెక్టర్ ఎమోషనల్ కామెంట్స్

క‌న్న‌డ స్టార్ హీరో శుక్ర‌వారం గుండెపోటుతో మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే. ఆయన మరణంతో యావత్ సినీ ఇండస్ట్రీ శోక సంద్రంలో మునిగిపోయింది. ఎంతో భవిష్యత్, ఇతరులను ఆదుకోవాలనే మంచి మనసున్న పునీత్ ఇకలేరనే వార్తను ఏ ఒక్కరూ జీర్ణించుకోలేక పోతున్నారు. ఇక ఆయ‌న‌తో అనుబంధం ఉన్న పలు భాషల సినీ సెల‌బ్రిటీలయితే కన్నీరుమున్నీరయ్యారు. పలువురు స్టార్స్ బెంగుళూరు చేరుకొని పునీత్ భౌతికకాయానికి నివాళులర్పించారు. అయితే పునీత్ తన చిరకాల కోరిక నెరవేరకుండానే వెళ్లిపోయారని పేర్కొంటూ దర్శకుడు ఎమోషనల్ అయ్యారు. ఈ మేరకు పునీత్‌తో తనకున్న అనుబంధాన్ని పంచుకుంటూ అసలు విషయం చెప్పారు. పునీత్ వల్లే తాను వెండితెరకు పరిచయమయ్యానని గుర్తు చేసుకున్నారు. తన రెండో ప్రాజెక్ట్‌ ‘అజయ్‌’ కూడా ఆయనతోనే చేశానని చెప్పారు. తాను గారితో '' సినిమా ప్రకటించిన వెంటనే తనకు పునీత్ కాల్ చేసి అభినందించారని మెహర్ రమేష్ చెప్పారు. అలాగే చిరంజీవి గారితో నటించాలనే తన కోరికను ఈ సినిమాతో తీర్చాలని ఆయన కోరినట్లు తెలిపారు. వీలైతే అతిథి పాత్ర లేదంటే కనీసం పాటలోనైనా ఆయనతో కలిసి ఓ చిన్న స్టెప్పు వేస్తానని పునీత్ తనతో అన్నారని మెహర్ రమేష్ చెప్పుకొచ్చారు. అయితే ఈ విషయాన్ని తాను చిరంజీవి గారితో కూడా చర్చించానని, పునీత్ కోసం ఓ స్పెషల్ రోల్ రాయాలని అనుకున్నానని, అలాగే నవంబర్‌లో జరగనున్న మా సినిమా ప్రారంభోత్సవానికి పునీత్‌ను ముఖ్యఅతిథిగా పిలవాలని భావించామని చెప్పారు. ఇంతలో పునీత్ ఈ లోకం విడిచి వెళ్లారని తెలుపుతూ కన్నీరు పెట్టుకున్నారు మెహర్ రమేష్. కాగా, పునీత్ భౌతిక కాయానికి నివాళులర్పించిన చిరంజీవి.. పునీత్‌ రాజ్‌కుమార్‌ అకాలమరణం తీవ్రంగా కలచివేసిందని అన్నారు. బెంగళూరు వచ్చిన ప్రతిసారి పునీత్‌ను కలిసేవాడినని, దేవుడు చాలా అన్యాయం చేశాడని అన్నారు. ఆయన కుటుంబానికి ఆ భగవంతుడు ధైర్యం ఇవ్వాలని ప్రార్థిస్తున్నా అని పేర్కొన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3bGA9Zr

ఆనంద్ దేవరకొండ పేరు మరిచిన అల్లు అర్జున్.. స్టేజ్ మీదే సారీ చెప్పిన బన్నీ

తమ్ముడిగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ తనకంటూ ప్రత్యేక మార్క్ క్రియేట్ చేసేందుకు కష్టపడుతున్నాడు. ఈ క్రమంలో స్క్రిప్ట్‌లకు ప్రాధాన్యమిస్తూ కథలను ఎంచుకుంటున్నా. అందుకే మిడిల్ క్లాస్ మెలోడీస్ అనే సినిమా వచ్చింది. హిట్ అయింది. ఇక ఇప్పుడు అంటూ రాబోతోన్నాడు. నవంబర్ 12న రాబోతోన్న ఈ మూవీ ట్రైలర్‌ను నేడు విడుదల చేశారు. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా వచ్చాడు. అయితే స్టేజ్ మీద బన్నీ కాస్త ఎమోషనల్ అయ్యాడు. విజయ్ దేవరకొండ ఎంత ఇంటెలిజెంటో అంత స్వీట్. కొందరు అలా ఉండరు. కానీ విజయ్ మాత్రం చాలా స్వీట్. అందుకే నాకు చాలా ఇష్టం. చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ స్టార్డం వచ్చింది. విజయ్ మీద ఎన్ని ప్రయోగాలైనా చేయోచ్చు. ఆయన ఇంకా ఎంతో ఎత్తుకు ఎదుగుతాడు. కేవలం నటనే కాదు.. వ్యాపారాల్లోనూ సక్సెస్ అయ్యాడు. రౌడీ వేర్స్ అంటే నాకు చాలా ఇష్టం. మామూలుగానే నాకు బట్టలంటే ఇష్టం. రౌడీ నుంచి బట్టలు వచ్చాయంటే ఎంతో ఎగ్జైట్ అవుతాను. ఇక నిర్మాతగానూ మారాడు. యంగ్ టాలెంట్‌కు సాయం చేస్తున్నాడు. విజయ్ అలా ఎదిగిపోతూ ఉంటే మీకు జెలస్ అనిపించదా? అని కొందరు అడిగారు. జెలస్ ఎందుకు ఉంటుంది. అలా అనుకున్నప్పుడు మనం కరెక్ట్‌గా పని చేయడం లేదన్నట్టు. ఈ పరుగు పందెంలో ఎవరు ఎక్కువగా పరిగెడుతుంటే వారికి సాయం చేయాలి. అయినా మనం పక్కన చూసి పరిగెత్త కూడదు. మన దారిలో మనం పరిగెత్తాలి. ఈ సినిమా హీరో గురించి చెప్పాలి. నా తమ్ముడు లాంటి వాడే. ఎందుకంటే నాక్కూడా ఇలాంటి తమ్ముడే ఉన్నాడు’ అని అల్లు అర్జున్ స్పీచ్ ఇస్తున్నాడు. అలా ఆనంద్ పేరు మరిచిపోయి.. మళ్లీ విజయ్ దేవరకొండ అనే అన్నాడు. పక్కనుంచి ఆనంద్ చెప్పే ప్రయత్నం చేసినా కూడా పేరు అంతగా గుర్తుకు రాలేదు. చివరకు ఆనంద్ దేవరకొండ అని చెప్పేశాడు. కానీ అలా పేరు మరిచిపోయినందుకు అక్కడే క్షమాపణలు చెప్పేశాడు బన్నీ. ఆ తరువాత తన ప్రసంగాన్ని కొనసాగించాడు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3EsA1cc

GameStop COO Jenna Owens Exits After a Short 7-Month Stint

GameStop chief operations officer Jenna Owens is exiting from the company only seven months after joining the video games retailer.

from NDTV Gadgets - Latest https://ift.tt/3muNfiC

Apple Protests Outside Payment Links on App Store Ahead of Epic Hearing

Apple has raised a strong objection to allowing third-party payment links on App Store as directed by a US district court following a lengthy trial with Fortnite-maker Epic Games.

from NDTV Gadgets - Latest https://ift.tt/3nBdzqk

Apple Co-Founder Steve Wozniak Says Bitcoin is 'Mathematical Purity'

Apple co-founder Steve Wozniak has said that Bitcoin is mathematical purity and can't be copied. He said cryptocurrency holds an awful lot of promise.

from NDTV Gadgets - Latest https://ift.tt/3GBNhNl

Shyam Singha Roy : RISE OF SHYAM అంటూ నాని రచ్చ.. ఫస్టి సింగిల్ ఎప్పుడంటే?

నేచురల్ స్టార్ వరుసగా సినిమాలు రెడీ చేస్తున్నాడు. లాక్డౌన్ వచ్చి పెద్ద హీరోలు కూడా ఎవ్వరూ సినిమాలను రిలీజ్ చేయలేదు. కానీ నాని మాత్రం గత లాక్డౌన్ సమయంలో ఓ చిత్రాన్ని వదిలాడు. మళ్లీ ఈ లాక్డౌన్ తరువాత ఇంకో చిత్రాన్ని వదిలాడు. అయితే అలా నాని ఓటీటీలో తన చిత్రాలను వదిలేస్తూ ఆడియెన్స్‌ను ఎంటర్టైన్ చేస్తున్నాడు. కానీ సినిమాలు మాత్రం అనుకున్నంతగా ఆడటం లేదు. నాని వీ, టక్ జగదీష్ సినిమాలు అంతగా వర్కవుట్ అవ్వలేదు. అలా ఓటీటీలు నానికి కలిసి రావడం లేదో ఏమో గానీ.. ఇక ఇప్పుడు మాత్రం నాని దుమ్ములేపేందుకు రెడీ అవుతున్నాడు. నాని రాహుల్ సంకృత్యాన్ కాంబోలో అనే సినిమా రాబోతోన్న సంగతి తెలిసిందే. కలకత్తా నేపథ్యంలో, పునర్జన్మల బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమా ఉండబోతోన్నట్టు టాక్. అందుకే రెండు షేడ్స్ ఉన్న లుక్స్‌ను రివీల్ చేశారు. ఒక దాంట్లో ఎంతో సీరియస్‌గా ఉంటే ఇంకో దాంట్లో ఎంతో కూల్‌గా కనిపించాడు. మొత్తానికి ఈ సారి కథను కలకత్తాకు తీసుకెళ్లి హిట్ పట్టుకొస్తాడేమో. నిహారిక ఎంటర్టైన్మెంట్స్‌పై వెంకట్ బోయనపల్లి ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోన్న ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ ప్రారంభించేశారు. మిక్కీ జే మేయర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించాడు. అంటూ మొదటి పాటను నవంబర్ 6న విడుదల చేయబోతోన్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ను వదిలారు. అందులోనాని దర్జాగా కూర్చున్నాడు. ఓ చేతితో సిగరేట్ ఉంది.. కళ్లు మాత్రం ఎంతో సీరియస్‌గా కనిపిస్తోంది. మొత్తానికి శ్యామ్ సింగ రాయ్ కథ వేరేలా ఉందనిపిస్తోంది. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌లుగా నటిస్తోన్న ఈ చిత్రానికి సత్యదేవ్ జంగా కథను అందించారు. జాన్ వర్గీస్ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా.. తెలుగు తమిళ కన్నడ మళయాల భాషల్లో డిసెంబర్ 24న విడుదల కాబోతోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3GBxpKT

Facebook Is Meta. Does That Mean FAANG Becomes MAANG?

Facebook's rebranding to Meta beckons another name change. The reference to the influential Big Tech consisting of Apple, Amazon, Netflix, and Google apart from Facebook might now go from FAANG to...

from NDTV Gadgets - Latest https://ift.tt/3bvZO6F

Redmi Note 11 Series Said to Be Rebranded as Xiaomi 11i for India

Redmi Note 11 Pro and Redmi Note 11 Pro+ are tipped to be rebranded for India as Xiaomi 11i and Xiaomi 11i HyperCharge, respectively. Both smartphones were launched in China earlier this week along...

from NDTV Gadgets - Latest https://ift.tt/3w2Org3

Vishnu Manchu : మంచు విష్ణు పరువుతీసీన హైపర్ ఆది.. తెగ నవ్వుకుంటున్న నెటిజన్లు.. పర్యావసానం ఎలా ఉంటుందో?

వేసే పంచులు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. ట్రెండ్‌కు తగ్గట్టుగా కౌంటర్లు వేస్తుంటారు. నిత్యం జరిగే వాటిపై కౌంటర్లు వేస్తుంటారు. ఎవరైతే సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటారో అలాంటి వారిపై ఆది కౌంటర్లు వేస్తుంటాడు. అలా గతంలో కత్తి మహేష్, రాకేష్ మాస్టర్, కతర్ పాప, శ్రీరెడ్డి ఇలా కొందరిపై హైపర్ ఆది పంచ్‌లు వేశాడు. అలా ఎవరు ఎప్పుడు ట్రెండ్ అయితే వారి మీద తన స్కిట్లలో వెరైటీ పంచ్‌లు రాసుకుంటాడు. వారిపై సెటైర్లు వేస్తుంటాడు. తాజాగా హైపర్ ఆది కన్ను మీద పడింది. మా ఎన్నికల్లో మంచు విష్ణు చేసిన హడావిడి అంతా కాదు. మీడియాతో మాట్లాడుతూ మంచు విష్ణు చెప్పిన మాటలు, చేసిన అతిపై నెట్టింట్లో లెక్కలేనన్ని మీమ్స్, ట్రోల్స్ వచ్చాయి. ఓ సందర్భంగా నా గురించి పది ఊర్లను దత్తత తీసుకున్నాను.. నేను చెప్పను... మీరే వెళ్లి చూసుకోండి అని అంటాడు.. చెప్పను అన్న తరువాత ఎలా తెలుస్తుంది.. ఎలా వెళ్లి తెలుసుకోవాలి? అంటూ ట్రోల్స్, మీమ్స్ జరిగాయి. ఇక మంచు విష్ణు తన ప్రసంగాల్లో ఎక్కువగా వాడిన పదం అంకుల్. లెట్ దెమ్ నో అంకుల్ అంటూ ఎక్కువగా వాడేశాడు. ఇక టంగుటూరి వీరేహం పకహం అంటూ ఏదేదో మాట్లాడేశాడు. ఇలా మంచు విష్ణు నాడు సోషల్ మీడియాలో ఎదుర్కొన్న ట్రోలింగ్‌లపై తాజాగా హైపర్ ఆది సెటైర్లు వేశాడు. మొత్తానికి దీపావళి ఈవెంట్ రాక ముందే పేలిపోయేలా ఉంది. అన్నీ మీకే తెలిసినట్టు మాట్లాడుతారేంటి? ఇంతకు ముందు ప్రియమణి గారు మా సైడ్ వచ్చి ఏమన్నారంటే.. అని ఆది అనడం.. హా ఏమన్నారు అని రోజా కౌంటర్ వేయడం. ఆదిని రాం ప్రసాద్ అందరూ పట్టుకుని ఉంటే.. లెట్ దెమ్ నో అంకుల్ లెట్ దెమ్ నో.. అంటూ మంచు విష్ణును గుర్తుకు చేశాడు. స్కిట్‌లో గెటప్ శ్రీను అంకుల్ లేడు కాబట్టి సరిపోయింది.. అసలు మీకు స్కిట్ గురించి తెలుసా? మీకు స్క్రిప్ట్ మీద శూన్యం.. ఆ గుడివాడ రహల గురించి తెలుసా? అంటూ కౌంటర్ వేశాడు. బయట నన్ను ఎప్పుడూ ఓ పది మంది పొగుడుతూ ఉంటారు.. అని ఆది అనడం.. ఎవరు అని పక్కనుంచి రాంప్రసాద్ అడగడం.. వాళ్ల పేర్లు నేను చెప్పను.. కావాలంటే మీరు వెళ్లి అడగండి వాళ్లు నా గురించి చెబుతారు అని మరో సెటైర్ వేశాడు. దీపావళి ఈవెంట్ ప్రోమో కింద ఆది వేసిన పంచ్‌లు, మంచు విష్ణును ఆడుకున్న తీరుకు అందరూ నవ్వుకుంటున్నారు. మొత్తానికి మంచు విష్ణు మీద వచ్చిన ట్రోల్స్ మాత్రం ఫుల్లుగానే వైరల్ అయ్యాయన్నమాట. అయితే ఆది పంచులు వేశాడు మరి దాని పర్యావసానం ఎలా ఉంటుందో చూడాలి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3bplfXm

పెళ్లై ఏడాది.. భర్త సీక్రెట్ చెప్పిన చందమామ.. రాత్రి అలా చేస్తాడన్న కాజల్

గత ఏడాది ఈ సమయానికి పరిస్థితులు ఎలా ఉన్నాయో అందరికీ తెలిసిందే. కరోనా దెబ్బకు అందరూ విలవిల్లాడిపోయారు. ఫస్ట్ వేవ్ దెబ్బకు అందరూ కుదేలయ్యారు. కొన్ని కొన్నిరంగాలు అలా పుంజుకోవడం ప్రారంభించాయి. ఎక్కడా ఎక్కువ మంది కలిసి ఈవెంట్లు ఏర్పాటు చేసుకోవడానికి అనుమతులు లేవు. అలాంటి సమయంలోనే తన ప్రేమను బయపెట్టేసింది. తన ప్రేమ గురించి ప్రపంచానికి వింతగా తెలియజేసింది. గౌతమ్ కిచ్లూతో ఎప్పటి నుంచో స్నేహబంధాన్ని కొనసాగిస్తూ వచ్చిన కాజల్ మొత్తానికి లాక్డౌన్ ఎఫెక్ట్‌తో ప్రేమ పీఠల వరకు తెచ్చేసింది. అలా అక్టోబర్ 30న గత ఏడాది ముంబైలో అతి కొద్ది మంది సన్నిహితుల మధ్య కాజల్ పెళ్లి వేడుకలు జరిగాయి.. సెలెబ్రిటీలు ఎవ్వరూ కూడా వెళ్లలేదు. కేవలం సోషల్ మీడియా వేదికగానే శుభాకాంక్షలు అందించారు. అలా కాజల్ గౌతమ్ పెళ్లి నిరాండబరంగానే జరిగినా కూడా వారం రోజులు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. ఆమె ధరించిన పెళ్లి చీర, వాడిన కాస్ట్యూమ్స్, హనీమూన్ పిక్స్ ఇలా ఎన్నోన్నో విషయాలతో నెట్టింట్లో తెగ హల్చల్ చేసింది. అయితే మొత్తానికి కాజల్ ఇప్పుడు ఫుల్ ఖుషీగా ఉంది. తన పెళ్లై ఏడాది అవుతోంది. వివాహా బంధానికి ఏడాది పూర్తి కావడంతో కాజల్ ఎమోషనల్ అయింది. అలానే భర్తకు సంబంధించిన ఓ సీక్రెట్‌ను బయటపెట్టేసింది. అర్దరాత్రి తన భర్త గునుగుతాడట. నిద్ర లేచే ఉన్నావా? ఇదిగో ఇలా ఈ డాగ్ వీడియో చూడు కాజల్ అని అంటాడట. అలా అనడం తనకు ఎంతో ఇష్టమట. హ్యాపీ వెడ్డింగ్ యానీవర్సరీ అంటూ తన భర్తతో అన్యోన్యంగా ఉన్న ఫోటోను కాజల్ షేర్ చేసింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2ZBkTdW

NTR: పునీత్ రాజ్‌కుమార్‌కు ఎన్టీఆర్ నివాళి...కాసేపు మౌనంగా అలానే చూసిన తార‌క్‌

క‌న్న‌డ అగ్ర క‌థానాయ‌కుడు పునీత్ రాజ్‌కుమార్ మ‌ర‌ణ వార్త తెలిసిన సినీ ఇండ‌స్ట్రీ షాక‌య్యింది. ముఖ్యంగా టాలీవుడ్ స్టార్స్ తో పునీత్ రాజ్‌కుమార్‌కు స‌న్నిహిత సంబంధాలున్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్‌కు పునీత్‌కు మంచి అనుబంధం ఉంది. పునీత్ మ‌రి లేర‌నే వార్త విన‌గానే తార‌క్ షాక‌య్యారు. శ‌నివారం ఆయ‌న బెంగుళూరు చేరుకుని పునీత్ రాజ్‌కుమార్ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. ఆయ‌న చాలా సేపు పునీత్ రాజ్‌కుమార్ పార్థివ దేహాన్ని అలా చూస్తుండిపోయారు. ఆ స‌మ‌యంలో ఎవ‌రితోనూ మాట్లాడ‌లేదు. క‌ళ్లార్ప‌కుండా అలా కొద్ది సేపు చూసిన చివ‌ర‌కు న‌మస్కారం చేసి అక్క‌డ నుంచి పునీత్ అన్న‌య్య శివ రాజ్‌కుమార్‌ను క‌లిసి ఆయ‌న్ని ఓదార్చారు. అక్క‌డ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేశారు. ఎన్టీఆర్‌ను పునీత్ రాజ్‌కుమార్ త‌న సోద‌రుడిగా భావించేవారు. ఆ అనుబంధంతోనే పునీత్ హీరోగా న‌టించిన చ‌క్ర‌వ్యూహ చిత్రంలో ఎన్టీఆర్ గెల‌యా..గెలయా అనే పాట‌ను పాడారు. ఈ సినిమాకు ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ సంగీతం అందించారు. అంత‌కు ముందుగానే పునీత్ పార్థివ దేహాన్ని సంద‌ర్శించిన బాల‌కృష్ణ ఎమోష‌న‌ల్‌గా క‌న్నీళ్లు పెట్టుకున్నారు. ఇదంతా విధిరాత అంటూ త‌ల కొట్టుకున్నారు. రాజ్‌కుమార్ ఫ్యామిలీతో త‌మ‌కున్న అనుబంధాన్ని ఆయ‌న ఈ సంద‌ర్భంగా నెమ‌ర‌వేసుకున్నారు. నందమూరి హీరోల‌తో పాటు ఇటు చిరంజీవి కుటుంతో, మోహ‌న్‌బాబు ఫ్యామిలీ, మ‌హేశ్ ఫ్యామిలీతో పునీత్‌కు మంచి అనుబంధం ఉంది. ప్ర‌స్తుతం పునీత్ రాజ్‌కుమార్‌ పార్థివ దేహాన్ని కంఠీర‌వ స్టేడియంలో అక్క‌డ ప్ర‌జ‌ల సంద‌ర్శనార్థం ఉంచారు. ల‌క్ష‌లాదిగా ప్ర‌జ‌లు పునీత్‌కు నివాళ‌లు అర్పిస్తున్నారు. శ‌నివారం సాయంత్రం అంత్య‌క్రియ‌లు జ‌రుగుతాయి. ప్ర‌స్తుతం పునీత్ రాజ్‌కుమార్ కుమార్తె వందిత‌ అమెరికా నుంచి వ‌స్తున్నారు. ఆమె శ‌నివారం బెంగ‌ళూరుకి చేరుకుంటారు. ఆమె తుది చూపు చూసిన త‌ర్వాత పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛ‌నాల‌తో జరుగుతాయి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3jQa2nj

OnePlus 7 Series Receive Call Interface Fix With New Update

OnePlus 7 Pro and OnePlus 7 are getting OxygenOS 11.0.4.1 update that is bundled with the October 2021 Android security patch. Alongside, the update also gets a couple of bug fixes and improvements....

from NDTV Gadgets - Latest https://ift.tt/3jR781w

Researchers Name New Species of Human Ancestors: Homo Bodoensis

Researchers have named a new ancestral human species Homo Bodoensis that lived in Africa around half a million years ago.

from NDTV Gadgets - Latest https://ift.tt/3mAaF6h

RRR గ్లింప్స్ రిలీజ్‌డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్.. అందరిలో పెరుగుతోన్న అంచనాలు

జ‌క్క‌న్న రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా రూపొందుతోన్న మోస్ట్ అవెయిటింగ్ మూవీ ఆప్ ఇండియా RRR. నిజానికి ఈ శుక్ర‌వారం(అక్టోబ‌ర్ 29)రోజున ఈ సినిమా నుంచి ముప్పై, న‌ల‌భై సెక‌న్ల పాటు గ్లింప్స్‌ను విడుద‌ల చేయాల‌ని చిత్ర యూనిట్ భావించింది. అయితే క‌న్న‌డ స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్ ఆక‌స్మాత్తుగా చ‌నిపోవ‌డంతో కార్య‌క్ర‌మాన్ని వాయిదా వేశారు. ఈ విష‌యాన్ని ట్విట్ట‌ర్ ద్వారా చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. అయితే తాజాగా గ్లింప్స్‌ను ఆదివారం అంటే న‌వంబ‌ర్ 1న ఉద‌యం 11 గంట‌ల‌కు విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. ఈ గ్లింప్స్ 45 సెక‌న్ల పాటు ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌నుంది. ‘బాహుబ‌లి’ త‌ర్వాత రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న సినిమా కావ‌డంతో ఎంటైర్ ఇండియ‌న్ మూవీ ఇండ‌స్ట్రీ ఆస‌క్తిగా ఎదురుచూస్తుండ‌గా.. టాలీవుడ్ స్టార్ హీరోలైన యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్ మూవీ కావ‌డంతో ఇటు మెగా ఫ్యాన్స్‌, అటు నందమూరి ఫ్యాన్స్‌తో పాటు టాలీవుడ్ ప‌రిశ్ర‌మ అంతా ఎదురుచూస్తుంది. అగ్ర న‌టీన‌టులు చేసిన సినిమా కావ‌డంతో సినిమా క‌లెక్ష‌న్స్ ప‌రంగా ఎలాంటి సంచ‌నాల‌కు తెర తీస్తుందోనిన ట్రేడ్ వ‌ర్గాలు ఎదురుచూస్తున్నాయి. ఇంత మందిలో ఆస‌క్తి పెంచుతోన్న ఈ సినిమా వ‌చ్చే ఏడాది సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 7న రావ‌డం ప‌క్కా అయ్యింది. ఇప్ప‌టికే క‌రోనా దెబ్బ‌కు రెండు, మూడు సార్లు సినిమా విడుద‌ల వాయిదా ప‌డింది. కానీ ఈసారి మాత్రం డేట్ ఫిక్స‌యిపోండ‌ని జ‌క్క‌న్న అంద‌రికీ చెప్పేశాడ‌ట‌. నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. మ‌రో వైపు ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి RRR ర‌న్ టైమ్‌ను లాక్ చేశాడ‌ట‌. సినిమా ర‌న్ టైమ్ 2 గంట‌ల 45 నిమిషాల‌ని న్యూస్ నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా రెండున్నర గంట‌లు ఉంటేనే ఎక్కువ‌. కానీ.. రాజ‌మౌళి త‌న సినిమాకు 165 నిమిషాలు ఫిక్స్ చేయ‌డం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఒక‌వైపు రాజ‌మౌళి తుది మెరుగులు దిద్దే ప‌నిలోఉంటూనే RRRను ప్ర‌మోట్ చేయ‌డంలో బిజీగా ఉంటున్నారు. సినిమా మ‌రింత ఎఫెక్టివ్‌గా ఆడియెన్స్‌కు క‌నెక్ట్ కావాల‌ని జక్క‌న్న తీవ్రంగా యోచిస్తున్నాడ‌ట‌.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3Bthg6o

Aviation Industry Voices 'Deep Concern' Over Safety Following 5G Rollout

The aviation industry has raised an alarm over the use of 5G network in the C-Band spectrum and its potential impact on the safety of flights.

from NDTV Gadgets - Latest https://ift.tt/3pMOmMx

Microsoft Edges Past Apple to Become World's Most Valuable Company

Microsoft has now become the world's most valuable company beating Apple whose shares fell about 2 percent following the results of the fiscal fourth quarter ending September 25.

from NDTV Gadgets - Latest https://ift.tt/3CuHXsS

Nokia XR20 Rugged Smartphone Goes on Sale in India: All the Details

Nokia XR20 is now available for purchase in India. The smartphone was launched on October 18 and is powered by a Snapdragon 480 SoC, paired with 6GB of RAM and 128GB of onboard storage. The smartphone...

from NDTV Gadgets - Latest https://ift.tt/3pLtNjA

Massive Solar Flare to Hit Earth's Atmosphere: All You Need to Know

An intense X1-class solar flare is scheduled to hit the Earth's atmosphere on Sunday, October 31, NASA has said.

from NDTV Gadgets - Latest https://ift.tt/3nJowq8

దేవుడు అన్యాయం చేశాడు..నాకు వ్య‌క్తిగ‌తంగా తీర‌ని లోటు అంటూ అంటూ బాల‌కృష్ణ ఎమోష‌న‌ల్ స్పీచ్‌

కన్నడ అగ్ర కథానాయకుడు మ‌ర‌ణం క‌న్న‌డ సినీ ఇండ‌స్ట్రీకి తీర‌ని లోటు. అయితే న‌టుడిగా, వ్య‌క్తిగా ఆయ‌న ఓ క‌న్న‌డ సినీ రంగానికే ప‌రిమితం కాలేదు. తెలుగు, త‌మిళ‌, హిందీ స‌హా ప‌లు చిత్ర ప‌రిశ్ర‌మ‌ల‌తో ఆయ‌న మంచి స్నేహ బంధాన్ని కొన‌సాగించారు. పునీత్ ఇక లేర‌నే వార్త అంద‌ర‌నీ షాక్‌కు గురి చేసింది. శ‌నివారం పునీత్ పార్థివ దేహాన్ని నంద‌మూరి బాల‌కృష్ణ సంద‌ర్శించి నివాళులు అర్పించారు. ఈ సంద‌ర్భంగా బాల‌కృష్ణ త‌ల కొట్టుకుని విధిరాత అంటూ చాలా ఎమోష‌న‌ల్ అయ్యి క‌న్నీళ్లు పెట్టుకున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న అక్క‌డున్న మీడియాతో మాట్లాడారు. ‘‘పునీత్ రాజ్‌కుమార్‌గారు లేర‌నే వార్త న‌మ్మ‌లేని నిజం. వార్త తెలియ‌గానే షాక‌య్యాను. ఒకే త‌ల్లికి పుట్ట‌క‌పోయినా సోద‌రుల్లాగా క‌లిసి పోయాం. రెండు కుటుంబాల మ‌ధ్య చాలా మంచి స్నేహ బాంధ‌వ్యాలున్నాయి. నాన్న‌గారు, రాజ్‌కుమార్‌గారు రెండు ఫ్యామిలీల మ‌ధ్య అలాంటి అనుబంధాన్ని ఏర్ప‌రిచారు. దేవుడు చాలా అన్యాయం చేశాడు. న‌టుడిగా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోవ‌డ‌మే కాదు, సామాజిక సేవా కార్య‌క్ర‌మాల‌తో ఎంద‌రికో అండ‌గా నిల‌బ‌డ్డారు. చ‌నిపోయిన త‌ర్వాత కూడా ఆయ‌న త‌న క‌ళ్ల‌ను దానం చేశారు. అంత మంచి మ‌న‌సున్న వ్య‌క్తి. నేను ఎమ్మెల్యేగా ఉన్న‌ప్పుడు లేపాక్షి ఉత్స‌వాల‌కు రావాల‌ని కోరితే శివ‌రాజ్‌కుమార్‌గానీ, పునీత్ రాజ్‌కుమార్‌గానీ వ‌చ్చేవారు. ఈరోజు ఆయ‌న మ‌న మ‌ధ్య లేర‌నేది నిజం. అయితే మ‌న గుండెల్లో ఉండిపోతారు’’ అన్నారు బాలకృష్ణ‌. పునీత్ రాజ్‌కుమార్ టాలీవుడ్ ఇండ‌స్ట్రీతో అంద‌రికంటే ఆయ‌నే ఎక్కువ స్నేహ సంబంధాల‌ను ఏర్ప‌రుచుకున్నారు. ఇక్క‌డి నుంచి ఏ హీరో బెంగుళూరు వెళ్లినా, పునీత్ వెళ్లి ప్ర‌త్యేకంగా క‌లిసి మాట్లాడేవారు. అలాంటి వ్య‌క్తి ఉన్న‌ట్లుండి దూరం కావ‌డాన్ని ఎవ‌రూ జీర్ణించుకోలేక‌పోతున్నారు. య‌న్‌.టి.ఆర్ బ‌యోపిక్ స‌మ‌యంలో బాల‌కృష్ణ సినిమా ప్ర‌మోష‌న్స్‌కు బెంగుళూరు వెళ్లిన‌ప్పుడు పునీత్ ఆయ‌న ప‌క్క‌నే కూర్చున్నారు. బాల‌కృష్ణ ముఖంపై ఏదో ఉంటే త‌న ఖ‌ర్చీఫ్ తీసుకుని దాన్ని శుభ్రం చేశారు. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతుంది. పునీత్ రాజ్‌కుమార్‌ పార్థివ దేహాన్ని కంఠీర‌వ స్టేడియంలో అక్క‌డ ప్ర‌జ‌ల సంద‌ర్శనార్థం ఉంచారు. శ‌నివారం సాయంత్రం అంత్య‌క్రియ‌లు జ‌రుగుతాయి. ప్ర‌స్తుతం పునీత్ రాజ్‌కుమార్ కుమార్తె అమెరికా నుంచి వ‌స్తున్నారు. ఆమె శ‌నివారం బెంగ‌ళూరుకి చేరుకుంటారు. ఆమె తుది చూపు చూసిన త‌ర్వాత పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛ‌నాల‌తో జరుగుతాయి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3BvSEtT

పునీత్ రాజ్‌కుమార్‌కు బాల‌కృష్ణ నివాళి.. త‌ల కొట్టుకుని.. క‌న్నీళ్లు పెట్టుకున్న నంద‌మూరి హీరో

క‌న్న‌డ ప్ర‌ముఖ క‌థానాయ‌కుడు పునీత్ రాజ్ కుమార్ మ‌ర‌ణం సినీ ప‌రిశ్ర‌మ‌ను శోక సంద్రంలో ముంచేసింది. ముఖ్యంగా పునీత్‌కు తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలోని స్టార్స్‌తో మంచి అనుబంధాన్ని ఏర్ప‌రుచుకున్నారు. శ‌నివారం కంఠీర‌వ మైదానంలో పార్థివ దేహాన్ని ప్ర‌జ‌ల సంద‌ర్శ‌నార్థం ఉంచారు. ప్ర‌జ‌లు ల‌క్ష‌ల్లో పునీత్ పార్థీవ దేహాన్ని సంద‌ర్శిస్తున్నారు. ఈ క్ర‌మంలో టాలీవుడ్ సీనియ‌ర్ అగ్ర క‌థానాయ‌కుడు నంద‌మూరి బాల‌కృష్ణ పునీత్ రాజ్‌కుమార్ పార్థీవ దేహానికి నివాళులు అర్పించారు. పునీత్ రాజ్‌కుమార్ సోదరుడు శివ రాజ్‌కుమార్ ఈ నేప‌థ్యంలో బాల‌కృష్ణ చాలా ఎమోష‌న‌ల్ అయ్యారు. క‌న్నీళ్లు పెట్టుకున్నారు. ఇదంతా విధిరాత అంటూ త‌ల కొట్టుకుని త‌న భావోద్వేగాన్ని ప్ర‌ద‌ర్శించారు. బాల‌కృష్ణ‌తో నిర్మాత సాయి కొర్ర‌పాటి ఉన్నారు. తెలుగు చిత్ర‌సీమంటే క‌న్న‌డ కంఠీర‌వ రాజ్‌కుమార్ ఫ్యామిలీకి ఎంతో ఇష్టం. మ‌న నటీనటుల‌ను ఎంత‌గానో ఆద‌రించేవారు. పునీత్ రాజ్‌కుమార్ విష‌యానికి వ‌స్తే.. వారి ఫ్యామిలీలో టాలీవుడ్ ఇండ‌స్ట్రీతో అంద‌రికంటే ఆయ‌నే ఎక్కువ స్నేహ సంబంధాల‌ను ఏర్ప‌రుచుకున్నారు. ఇక్క‌డి నుంచి ఏ హీరో బెంగుళూరు వెళ్లినా, పునీత్ వెళ్లి ప్ర‌త్యేకంగా క‌లిసి మాట్లాడేవారు. అలాంటి వ్య‌క్తి ఉన్న‌ట్లుండి దూరం కావ‌డాన్ని ఎవ‌రూ జీర్ణించుకోలేక‌పోతున్నారు. ముఖ్యంగా నంద‌మూరి ఫ్యామిలీతో పునీత్‌కు చాలా మంచి స్నేహ బంధం ఉంది. ఆ మ‌ధ్య‌లో బాల‌కృష్ణ త‌న‌ సినిమా ప్ర‌మోష‌న్స్‌కు బెంగుళూరు వెళ్లిన‌ప్పుడు పునీత్ ఆయ‌న ప‌క్క‌నే కూర్చున్నారు. బాల‌కృష్ణ ముఖంపై ఏదో ఉంటే త‌న ఖ‌ర్చీఫ్ తీసుకుని దాన్ని శుభ్రం చేశారు. తానో పెద్ద హీరోన‌నే ఫీలింగ్‌ను ఎక్క‌డా చూపించేవారు కాదు పునీత్‌. ఆర్య సినిమా చూసి బన్నీకి స్పెషల్‌గా ఫోన్ చేసి మాట్లాడారంటే ఆయన మంచితనం, కలుపుగోలుతనం అర్థం చేసుకోవచ్చు. అలాగే చరణ్‌తో ఫ్రెండ్లీగా ఉండేవారు. అదే అంద‌రికీ ఆయ‌న్ని చాలా ద‌గ్గ‌ర చేసింద‌ని అందరూ అంటారు. పునీత్‌లాంటి ఓ మంచి వ్య‌క్తిని, స్నేహ‌శీలిని కోల్పోవ‌డం సినీ ఇండ‌స్ట్రీకి పెద్ద లోటే. కేవ‌లం సినిమాల‌తోనే కాదు, ఎంతో మంది ఆప‌న్నుల‌కి అండ‌గా నిలిచి త‌న దాతృత్వాన్ని చాటుకున్నారు. ఇబ్బందుల్లో ఉన్న వారికి ఆర్థిక సాయాన్ని అందించారు. చిన్న పిల్ల‌లు, అనాథ పిల్ల‌ల‌కు విద్య‌ను అందిస్తున్నారు పునీత్‌. అలాంటి వ్య‌క్తి ఉన్న‌ట్లుండి దూర‌మ‌వ‌డం అంద‌రికీ షాకింగ్‌గా అనిపిస్తుంది. సినీ సెల‌బ్రిటీలంద‌రూ త‌మ‌న సంతాపాన్ని వ్య‌క్తం చేశారు. పునీత్ రాజ్‌కుమార్‌ పార్థివ దేహాన్ని కంఠీర‌వ స్టేడియంలో అక్క‌డ ప్ర‌జ‌ల సంద‌ర్శనార్థం ఉంచారు. శ‌నివారం సాయంత్రం అంత్య‌క్రియ‌లు జ‌రుగుతాయి. ప్ర‌స్తుతం పునీత్ రాజ్‌కుమార్ కుమార్తె అమెరికాలో ఉన్నారు. అక్క‌డ నుంచి ఆమె శ‌నివారం బెంగ‌ళూరుకి చేరుకుంటారు. ఆమె తుది చూపు చూసిన త‌ర్వాత పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియలు జరుగుతాయి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3nKQKk2

నేను వాటిని ప‌ట్టించుకోలేదు.. ఆలియాభ‌ట్ టార్చ‌ర్ పెట్టింది.. వాళ్ల‌తో ప‌నిచేయడం చాలా ఈజీ..రాజ‌మౌళి సెన్సేష‌న‌ల్ కామెంట్స్‌

ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి త‌న ప్రెస్టీజియ‌స్ మూవీ RRR ప్ర‌మోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఒక‌వైపు మూవీ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌తో త‌ల‌మున‌క‌లై ఉంటూనే పాన్ ఇండియా రేంజ్‌లో త‌న సినిమాను ప్ర‌మోట్ చేసుకోవ‌డంపై కూడా దృష్టి పెట్టారు. రాజమౌళి రీసెంట్‌గా ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో త‌న సినిమా RRR ..ఆలియా గురించి, ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌, అజ‌య్ దేవ‌గ‌ణ్ స‌హా ఇత‌ర స్టార్స్‌ను డైరెక్ట్ చేయ‌డం గురించి ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను ఆయ‌న తెలియ‌జేశారు. ‘‘నేను డైరెక్టర్‌గా న‌టీన‌టులు ఉత్తరాదివారా, ద‌క్షిణాదివారా, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ .. అంటూ వారి మ‌ధ్య హ‌ద్దుల‌ను చూడ‌టం మ‌ర‌చిపోయాను. ఆడియెన్స్ విష‌యంలోనూ అంతే నేను భాషా బేదాలు చూడటం మ‌ర‌చిపోయాను. స్క్రిప్ట్ కూడా అంతే నా స్క్రిప్ట్‌కు భాష‌తో సంబంధం లేకుండా ఏ న‌టుడు అయితే న్యాయం చేస్తాడా? అని ఆలోచించే అప్రోచ్ అవుతాను. అలాగే నేను డైరెక్ట్ చేసిన బాహుబ‌లి కార్డ్‌ను కూడా ఉప‌యోగించుకోను. స్క్రిప్ట్ ప్ర‌కార‌మే ముందుకెళ‌తాను. RRR లో అజ‌య్ దేవ‌గ‌ణ్‌గారు కీల‌క పాత్ర పోషించారు. ఆయ‌న ఈగ హిందీ వెర్ష‌న్ మ‌క్కీకి డ‌బ్బింగ్ చెప్పారు. అప్ప‌టి నుంచి ఆయ‌న‌తో అనుబంధం ఉంది. స్టార్స్‌తో ప‌నిచేయడం నాకు చాలా ఈజీ. వారికి సంబంధించిన వ‌ర్క్ విష‌యంలో వారెంతో ప్రొఫెష‌న‌ల్‌గా ఉంటారు. అజ‌య్ దేవ‌గ‌ణ్‌గారిని తీసుకుంటే, ఆయ‌న షూటింగ్ స‌మ‌యంలో ఎప్పుడూ త‌న వ్యానిటీ వ్యాన్‌లో కూర్చోలేదు. బ‌య‌టే కూర్చుని షాట్ ఎలా వ‌స్తుందో గ‌మ‌నించేవారు. అలాగే న‌న్ను చూస్తుండేవారు. నేనెప్పుడైనా ఆయ‌న్ని చూస్తే లేచి నా ద‌గ్గ‌ర‌కు న‌డుచుకుంటూ వ‌చ్చి నాతో ఏమైనా అవ‌స‌రం ఉందా సార్‌! అని అడిగేవారు. ఇక ఆలియా భ‌ట్ అయితే మ‌మ్మ‌ల్ని టార్చ‌ర్ పెట్టేసింది. త‌న లైన్స్ గురించి, డిక్ష‌న్ గురించి పూర్తిగా తెలుసుకునేది. ఇక ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్ రెండు ద‌శాబ్దాలుగా తెలుసు. నాకు మంచి స్నేహితులు, సోద‌ర స‌మానులు. వారితో ప‌నిచేయ‌డం ఎప్పుడూ నాకు క‌ష్ట‌మ‌నిపించ‌లేదు’’ అని తెలిపారు రాజమౌళి. ‘బాహుబ‌లి’ త‌ర్వాత రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న సినిమా కావ‌డంతో ఎంటైర్ ఇండియ‌న్ మూవీ ఇండ‌స్ట్రీ ఆస‌క్తిగా ఎదురుచూస్తుండ‌గా.. టాలీవుడ్ స్టార్ హీరోలైన యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్ మూవీ కావ‌డంతో ఇటు మెగా ఫ్యాన్స్‌, అటు నందమూరి ఫ్యాన్స్‌తో పాటు టాలీవుడ్ ప‌రిశ్ర‌మ అంతా ఎదురుచూస్తుంది. అగ్ర న‌టీన‌టులు చేసిన సినిమా కావ‌డంతో సినిమా క‌లెక్ష‌న్స్ ప‌రంగా ఎలాంటి సంచ‌నాల‌కు తెర తీస్తుందోనిన ట్రేడ్ వ‌ర్గాలు ఎదురుచూస్తున్నాయి. ఇంత మందిలో ఆస‌క్తి పెంచుతోన్న ఈ సినిమా వ‌చ్చే ఏడాది సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 7న రావ‌డం ప‌క్కా అయ్యింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3GA7QtJ

Friday 29 October 2021

Puneeth Rajkumar: పునీత్ మరణవార్తతో ఆగిన అభిమాని గుండె

ఫ్యాన్స్‌లో డైహార్డ్ ఫ్యాన్స్ వేరు. త‌మ అభిమాన హీరోను ఎవ‌రైనా ఏమైనా చిన్న మాట అంట‌నే విన‌డానికి ఒప్పుకోరు. వారిపైకి గొడ‌వ‌కెళ‌తారు. కొట్టేసుకుంటారు. వారి ప్ర‌వ‌ర్త‌న చూస్తే అబ్బో త‌న హీరో కోసం చ‌నిపోయేలా ఉన్నాడ‌నేంత ప్రేమ ఉందే అనిపిస్తుంది. కానీ నిజంగానే ఇప్పుడుత‌ను ప్రాణంగా ప్రేమించే హీరో లేడ‌ని తెలియ‌గానే ఓ అభిమాని గుండె ఆగింది. కన్నడ ప‌వ‌ర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మ‌ర‌ణం అభిమానుల‌కు షాక్ ఇచ్చి వారిని శోక సంద్రంలో ముంచేసింది. శుక్ర‌వారం ఉద‌యం గుండెపోటుతో పునీత్ రాజ్‌కుమార్ అకాల మ‌ర‌ణం చెందారు. మ‌ర‌ణ‌వార్త విన్న త‌ర్వాత క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం త‌గు చ‌ర్య‌లు తీసుకుంది. థియేట‌ర్స్‌ను మూసి వేసింది. మ‌ద్యపాన విక్ర‌యాల‌పై ఆదివారం వర‌కు ప్ర‌భుత్వం నిషేధం విధించింది. అయితే త‌మ అభిమాన క‌థానాయ‌కుడు ఇక లేర‌నే వార్త‌ను అభిమానులు జీర్ణించుకోలేక‌పోతున్నారు. పునీత్ మర‌ణ‌వార్త విన‌గానే మునియ‌ప్ప‌న్ అనే అభిమాని గుండె ఆగిపోయింది. పొన్నాచ్చి తాలూకాలోని మ‌రూరుకి చెందిన మునియ‌ప్ప‌న్‌కు పునీత్ అంటే ప్రాణం. ఇప్పుడు నిజంగా ఆ ప్రాణ‌మే పోయింది. పునీత్ చ‌నిపోయార‌నే వార్త తెలియ‌గానే మునియ‌ప్ప‌న్‌కు గుండెపోటు వ‌చ్చింది. వెంట‌నే ఆయ‌న్ని ద‌గ్గ‌ర‌లోని హాస్పిట‌ల్‌కు తీసుకెళ్లారు. అయితే అప్ప‌టికే ఆయ‌న చ‌నిపోయిన‌ట్లు డాక్ట‌ర్లు చెప్పారు. మునియ‌ప్ప‌న్‌కు ఏడాది వ‌య‌సున్న పాప ఉంది. రీల్ హీరోగా, రియ‌ల్ హీరోగా ఎంద‌రికో స్ఫూర్తిగా నిలిచి ముందుకు న‌డిపిన వ్య‌క్తి పునీత్ రాజ్ కుమార్‌. ఇలా ఉన్న‌ట్లుండి దూర‌మైపోవ‌డం ఆయన కుటుంబంలోని వ్య‌క్తికే కాదు. సినీ ఇండ‌స్ట్రీకి కూడా తీర‌ని లోటే. పునీత్‌తో అనుబంధం ఉన్న వారెవ‌రైనా ఆయ‌న్ని అంత సులువుగా మ‌ర‌చిపోలేరు. భాష‌తో సంబంధం లేకుండా స్టార్స్‌, టెక్నిషియ‌న్స్ అంద‌రూ పునీత్ రాజ్‌కుమార్ మ‌ర‌ణంపై స్పందించారు. త‌మ సంతాపాల‌ను వ్య‌క్తం చేశారు. శ‌నివారం పునీత్ అంత్య‌క్రియ‌లు జ‌రుగుతాయి. పునీత్ రాజ్‌కుమార్ కుమార్తె అమెరికా నుంచి వ‌స్తున్నారు. బాల‌న‌టుడిగా కెరీర్‌ను ప్రారంభించిన పునీత్‌.. హీరోగా 29 సినిమాల్లో న‌టించారు. చిన్న వ‌య‌సులో బాల‌నటుడిగా జాతీయ అవార్డును అందుకున్నారు పునీత్‌.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3GAs9ah

నిహారిక కొణిదెల కొత్త వెబ్ సిరీస్‌.. సీక్రెట్ రివీల్ చేసిన మెగాడాట‌ర్‌!

హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వ‌క ముందుగానే మెగాడాట‌ర్ నిహారిక ..వెబ్ సిరీస్‌ల‌తో ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన సంగ‌తి తెలిసిందే. సినిమాల్లోహీరోయిన్‌గా న‌టిస్తే ల‌క్ క‌లిసి రాలేదు. ఆ త‌ర్వాత ఆమె పెళ్లి చేసుకుని కొన్ని రోజుల పాటు ఇండ‌స్ట్రీకి దూరంగా ఉన్నారు. అయితే ఇప్పుడు మ‌ళ్లీ త‌న ప్రాజెక్ట్స్‌తో బిజీగా మారాల‌ని అనుకుంటున్నారు. అందులో భాగంగానే కొన్ని రోజుల నుంచి ఆమె త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో ఓసీఎఫ్ఎస్ అనే హ్యాష్ ట్యాగ్‌ను జ‌త చేస్తూ పోస్టులు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అస‌లు దీని అర్థ‌మేంటో తెలియ‌క చాలా మంది నెటిజ‌న్స్ నిహారిక‌ను అదేంటో చెప్ప‌మ‌ని కూడా అడిగారు. కానీ ఇన్ని రోజులు నిహారిక వారి ప్ర‌శ్న‌కు స‌మాధానాన్ని దాట వేస్తూ వ‌చ్చింది. అయితే శుక్ర‌వారం ఆమె తండ్రి, న‌టుడు మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఇన్నిరోజులు దాచి పెడుతూ వ‌చ్చిన సీక్రెట్‌ను నిహారిక రివీల్ చేసింది. ఓసీఎఫ్ఎస్ అంటే ఒక చిన్న ఫ్యామిలీ స్టోరి అని తెలియ‌జేస్తూ ఓ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది నిహారిక‌. ఇది తాను నిర్మాత‌గా జీ5 సంస్థ కోసం నిర్మిస్తోన్న వెబ్ సిరీస్ అని కూడా ఈ సంద‌ర్భంగా ఆమె తెలియ‌జేసింది. దానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఇందులో సంతోశ్ శోభ‌న్‌, సిమ్రాన్ శ‌ర్మ హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఇంకా సీనియ‌ర్ న‌రేశ్‌, తుల‌సి త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్‌లో ఐదు ఎపిసోడ్స్ ఉంటాయి. ఒక్కో ఎపిసోడ్ న‌లబై నిమిషాల వ్య‌వ‌ధితో ఉంటుంది. న‌వంబ‌ర్ 19న ఈ వెబ్ సిరీస్ అందుబాటులోకి రానుంది. అలాగే తండ్రి పుట్టిన‌రోజు సెల‌బ్రేష‌న్స్‌లో భ‌ర్త‌తో పాటు పాల్గొంది. త‌న ఫ్యామిలీ ఫొటోను నిహారిక ఇన్‌స్టాలో షేర్ చేసింది. దీంతో పాటు ఫ్యామిలీయ అనే క్యాప్ష‌న్ కూడా జోడింది. ఇప్పుడీ ఫొటో నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది. పెళ్లికి ముందే ముద్ద‌ప‌ప్పు అవ‌కాయ్‌, నాన్న కూచి వంటి వెబ్ సిరీస్‌లో న‌టించిన నిహారిక ‘ఒక మ‌న‌సు’ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తర్వాత సూర్య కాంతం, ఒరు నెల్లనాల్ పాత్తు సొల్రన్ అనే తమిళ సినిమాల్లో హీరోయిన్‌గా న‌టించింది. అయితే హీరోయిన్‌గా మాత్రం అనుకున్న రేంజ్‌లో స‌క్సెస్‌ను అందుకోలేక‌పోయింది. ఈ క్ర‌మంలో ఆమె చైత‌న్య జొన్న‌ల‌గ‌డ్డ‌ను వివాహం చేసుకుని కొన్నిరోజులు పాటు కుటుంబంతో స‌మ‌యాన్ని గ‌డిపారు. ఇప్పుడు మ‌ళ్లీ ఎంట్రీ ఇచ్చారు. మారుతున్న ట్రెండ్‌ను ఫాలో అవుతతూ డిజిట‌ల్ మాధ్య‌మంకు వెబ్ సిరీస్‌ల‌ను నిర్మించడానికి ఆమె సిద్ధ‌మ‌య్యారు. ఇక భ‌విష్య‌త్తులో ఆమె ఎలాంటి ప్రాజెక్ట్స్‌ను రూపొందిస్తుద‌నేది తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3mzKKM1

Puneeth Raj Kumar: పునీత్ హ‌ఠాన్మ‌ర‌ణం..క్వ‌శ్చ‌న్ మార్క్‌లా మారిన‌ రూ.400 కోట్ల మార్కెట్‌

సినీ రంగంలో ఓ స్టార్ హీరో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర చూపించే ప్ర‌భావం ఎంతో ఎక్కువ‌గా బ‌లంగా ఉంటుంది. నిర్మాత‌లే కాదు..డిస్ట్రిబ్యూట‌ర్స్‌, ఎగ్జిబిట‌ర్స్‌.. థియేట‌ర్స్ యాజ‌మాన్యం ఇలా అంద‌రూ స్టార్ హీరో సినిమా స‌క్సెస్ కావాల‌నే కోరుకుంటారు. ఎందుకంటే స్టార్ హీరో సినిమా స‌క్సెస్ అయితే లాభాల‌ను చూడొచ్చనేది వారి ఆశ‌. అలాంటి ఓ స‌క్సెస్‌ఫుల్ స్టార్ ఆక‌స్మాత్తుగా సుదూర లోకాల‌కు వెళ్లిపోవ‌డం అనేది చాలా మందికి బాధ‌నే మిగిలిస్తే.. బాక్సాఫీస్‌కు ప్ర‌శ్నార్థకాన్ని చూపించింది. ఎందుకంటే ఇప్పుడు పునీత్ రాజ్‌కుమార్ ప్లాన్ చేసుకున్న ప్రాజెక్ట్స్ వేల్యూ రూ.400 కోట్ల‌కు పైమాటేన‌ని బాక్సాఫీస్ వ‌ర్గాల స‌మాచారం. ఎందుకంటే ఆయ‌న సినిమా వ‌స్తుందంటే త‌క్కువ‌లో త‌క్కువ‌గా వంద కోట్ల రూపాయ‌ల బిజినెస్ జ‌రుగుతుంద‌ని ట్రేడ్ వ‌ర్గాల అంచనా. ఇప్పుడు ఆయ‌న రెండు సినిమాలు చేస్తున్నారు. జేమ్స్‌, దిత్వ‌. ఈ రెండు సినిమాలకు ఒక్కో దానికి 50-60 కోట్ల రూపాయ‌ల బ‌డ్జెట్‌ను అనుకుంటే రెండు సినిమాల‌కు క‌లిసి వంద నుంచి నూట ఇర‌వై కోట్ల రూపాయ‌లు బ‌డ్జెట్ అవుతుంది. ఇప్పుడు ఇవి సగంలోనే అగిపోతాయి. మ‌రి ఈ ద‌ర్శ‌క నిర్మాత‌ల ప‌రిస్థితేమిటో అంతు ప‌ట్ట‌డం లేదు. ఇక పునీత్ రాజ్‌కుమార్ నిర్మాత కూడా త‌న సొంత బ్యాన‌ర్‌లోనే సినిమాలు చేస్తుంటారు. ఆయ‌నిప్పుడు ఏకంగా ఐదు సినిమాలు త‌న బ్యాన‌ర్‌లోనే ప్లాన్ చేసుకున్నార‌ట‌. మినిమం అర‌వై కోట్ల బ‌డ్జెట్‌తో మార్కెట్‌ యావ‌రేజ్‌గా వేసుకున్నా.. అవ‌న్నీ క‌లిపితే రూ.300 కోట్ల‌కు పైగానే మార్కెట్‌పై ప్ర‌భావాన్ని చూపిస్తాయి. అంటే మొత్తంగా క‌లుపుకుంటే నాలుగు వంద‌ల కోట్ల రూపాయ‌ల సినిమా బిజినెస్ ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. ఆయ‌న సినిమాల‌ను న‌మ్ముకున్న ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు, ఇత‌ర టెక్నీషియ‌న్స్ ప‌రిస్థితి అగ‌మ్య గోచ‌రంగా మారింది. కానీ ఏం చేద్దాం.. విధి ఆడిన వింత నాట‌కంలో కొన్ని ప్ర‌శ్న‌లకు జ‌వాబులు దొర‌క‌వు. ఇదీ అంతే. మంచి వ్య‌క్తి, రీల్ హీరోగా, రియ‌ల్ హీరోగా ఎంద‌రికో స్ఫూర్తిగా నిలిచి ముందుకు న‌డిపిన వ్య‌క్తి పునీత్ రాజ్ కుమార్‌. ఇలా ఉన్న‌ట్లుండి దూర‌మైపోవ‌డం ఆయన కుటుంబంలోని వ్య‌క్తికే కాదు. సినీ ఇండ‌స్ట్రీకి కూడా తీర‌ని లోటే. పునీత్‌తో అనుబంధం ఉన్న వారెవ‌రైనా ఆయ‌న్ని అంత సులువుగా మ‌ర‌చిపోలేరు. భాష‌తో సంబంధం లేకుండా స్టార్స్‌, టెక్నిషియ‌న్స్ అంద‌రూ పునీత్ రాజ్‌కుమార్ మ‌ర‌ణంపై స్పందించారు. త‌మ సంతాపాల‌ను వ్య‌క్తం చేశారు. శ‌నివారం పునీత్ అంత్య‌క్రియ‌లు జ‌రుగుతాయి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3jPFOAH

Puneeth RajKumar: టాలీవుడ్‌లో అందరి బంధువయా.. పునీత్ రాజ్‌కుమార్

తెలుగు చిత్ర‌సీమంటే క‌న్న‌డ కంఠీర‌వ రాజ్‌కుమార్ ఫ్యామిలీకి ఎంతో ఇష్టం. మ‌న నటీనటుల‌ను ఎంత‌గానో ఆద‌రించేవారు. పునీత్ రాజ్‌కుమార్ విష‌యానికి వ‌స్తే.. వారి ఫ్యామిలీలో టాలీవుడ్ ఇండ‌స్ట్రీతో అంద‌రికంటే ఆయ‌నే ఎక్కువ స్నేహ సంబంధాల‌ను ఏర్ప‌రుచుకున్నారు. ఇక్క‌డి నుంచి ఏ హీరో బెంగుళూరు వెళ్లినా, పునీత్ వెళ్లి ప్ర‌త్యేకంగా క‌లిసేవారు. ఫంక్ష‌న్స్‌కు అటెండ్ అయ్యేవారు. తార‌క్‌ను నా సోద‌రుడు అనేవారు. ఆ అనుబంధంతోనే ఆయ‌న హీరోగా చేసిన ‘చ‌క్ర‌వ్యూహ‌’లో ‘గెల‌యా గెల‌యా..’ అనే పాటను పాడారు తారక్. అలాగే నందమూరి బాలకృష్ణ అంటే కూడా ఎంతో ఇష్టం. ఆయ‌న సినిమా ప్ర‌మోష‌న్స్‌కు వెళ్లిన‌ప్పుడు పునీత్ ఆయ‌న ప‌క్క‌నే కూర్చున్నారు. బాల‌కృష్ణ ముఖంపై ఏదో ఉంటే త‌న ఖ‌ర్చీఫ్ తీసుకుని దాన్ని శుభ్రం చేశారు. తానో పెద్ద హీరోన‌నే ఫీలింగ్‌ను ఎక్క‌డా చూపించేవారు కాదు పునీత్‌. ఆర్య సినిమా చూసి బన్నీకి స్పెషల్‌గా ఫోన్ చేసి మాట్లాడారంటే ఆయన మంచితనం, కలుపుగోలుతనం అర్థం చేసుకోవచ్చు. అలాగే చరణ్‌తో ఫ్రెండ్లీగా ఉండేవారు. అదే అంద‌రికీ ఆయ‌న్ని చాలా ద‌గ్గ‌ర చేసింద‌ని అందరూ అంటారు. కేవలం నటీనటులతో సత్సంబంధాలుండేవి కాదు. టెక్నీషియన్స్‌ను కూడా ఎంత‌గానో ఎంకరేజ్ చేసేవారు. పూరీ జ‌గ‌న్నాథ్‌, వీర శంక‌ర్, మెహ‌ర్ ర‌మేశ్ వంటివారు ఈ లిస్టులో ఉన్నారు. అస‌లు పునీత్ రాజ్‌కుమార్‌ను ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేసిందే తెలుగు ద‌ర్శ‌కుడైన పూరీ జ‌గ‌న్నాథ్‌. త‌ర్వాత క‌మ‌ర్షియ‌ల్ తెలుగు బ్లాక్‌బ‌స్ట‌ర్స్‌ను క‌న్న‌డ‌లో రీమేక్ చేసి అక్క‌డ కూడా హిట్ కొట్టారు. ఈ లిస్టులో రెడీ, ఒక్కడు, దూకుడు వంటి చిత్రాలున్నాయి. ఆంధ్రావాలా ఇక్కడ ప్లాప్ అయినా క‌ర్ణాట‌క‌లో వీర క‌న్న‌డిగగా పునీత్ న‌టించారు. అలాగే ఒక్క‌డుని అజ‌య్‌గా రీమేక్ చేశారు. దీనికి మ‌ణిశ‌ర్మ‌నే ద‌ర్శ‌కుడు. అలాగే దూకుడు సినిమాను ప‌వ‌ర్ పేరుతో రీమేక్ చేశారు. దానికి త‌మ‌న్ సంగీతాన్ని అందించారు. ద‌ర్శ‌కుడు వీర శంక‌ర్‌, జ‌యంత్ సి.ప‌రాన్జీ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేశారు. జ‌నార్ధ‌న మ‌హ‌ర్షి ఈయ‌న సినిమాల‌కు క‌థ‌ల‌ను అందించారు. మ్యూజిక్ డైరెక్ట‌ర్ చ‌క్రితో పునీత్ వ‌ర్క్‌చేశారు. యువ‌ర‌త్న సినిమా విడుద‌ల స‌మ‌యంలో మీడియాతో మాట్లాడుతూ స్ట్ర‌యిట్ తెలుగు సినిమా చేయాల‌నుకుంటున్నాన‌ని, త్వ‌ర‌లోనే ఆ క‌బురు చెప్తాన‌ని కూడా అన్నారు. అలా వ్య‌క్తిగ‌తంగా, ప్రొఫెష‌న‌ల్‌గా సినిమాల్లో ఎప్పుడూ తెలుగు వారితో అనుబంధాన్ని ఆయ‌న కొన‌సాగించారు పునీత్‌. అందుకనే తెలుగువారికి పునీత్ అంటే ఎంతో ఇష్టం ఏర్ప‌డింది. మ‌న స్టార్స్ ఎప్పుడు ఫోన్ చేసినా అందుబాటులో ఉండేవారు. అలాంటి ఓ మంచి వ్య‌క్తిని, స్నేహ‌శీలిని కోల్పోవ‌డం సినీ ఇండ‌స్ట్రీకి పెద్ద లోటే. కేవ‌లం సినిమాల‌తోనే కాదు, ఎంతో మంది ఆప‌న్నుల‌కి అండ‌గా నిలిచి త‌న దాతృత్వాన్ని చాటుకున్నారు. ఇబ్బందుల్లో ఉన్న వారికి ఆర్థిక సాయాన్ని అందించారు. చిన్న పిల్ల‌లు, అనాథ పిల్ల‌ల‌కు విద్య‌ను అందిస్తున్నారు పునీత్‌. అలాంటి వ్య‌క్తి ఉన్న‌ట్లుండి దూర‌మ‌వ‌డం అంద‌రికీ షాకింగ్‌గా అనిపిస్తుంది. సినీ సెల‌బ్రిటీలంద‌రూ త‌మ‌న సంతాపాన్ని వ్య‌క్తం చేశారు. పునీత్ రాజ్‌కుమార్‌ పార్థివ దేహాన్ని కంఠీర‌వ స్టేడియంలో అక్క‌డ ప్ర‌జ‌ల సంద‌ర్శనార్థం ఉంచారు. శ‌నివారం సాయంత్రం అంత్య‌క్రియ‌లు జ‌రుగుతాయి. ప్ర‌స్తుతం పునీత్ రాజ్‌కుమార్ కుమార్తె అమెరికాలో ఉన్నారు. అక్క‌డ నుంచి ఆమె శ‌నివారం బెంగ‌ళూరుకి చేరుకుంటారు. ఆమె తుది చూపు చూసిన త‌ర్వాత పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియలు జరుగుతాయి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3boQXnt

Redmi Note 11 5G vs Redmi Note 11 Pro vs Redmi Note 11 Pro+

Redmi Note 11 5G is compared alongside the Redmi Note 11 Pro and Redmi Note 11 Pro+ to see the major differences between the three phones. The Redmi Note 11 Pro+ is the most premium variant of the lot...

from NDTV Gadgets - Latest https://ift.tt/3CustFo

Amazon Labour Shortage Hinders One-Day Delivery Ambitions

Labour shortages have cut into Amazon's plan to make one-day delivery standard for members of its Prime loyalty club, delaying its bid to cement its lead in e-commerce and sending costs surging ahead...

from NDTV Gadgets - Latest https://ift.tt/3GwboNy

Twitter, CEO Jack Dorsey, Others Take Jibes as Facebook Changes Name

Facebook on Thursday announced it was changing the parent company's name to "Meta." Following the move, many people saw the rebranding exercise as an excuse to have a go at the social media giant....

from NDTV Gadgets - Latest https://ift.tt/3CvB4HK

Redmi Note Series Has Sold Over 240 Million Units Globally, Says Lu Weibing

Redmi General Manager, Lu Weibing, reportedly said that the global sales of the Redmi Note series have crossed 240 million units. Earlier in February, Xiaomi announced that the global sales of the...

from NDTV Gadgets - Latest https://ift.tt/3Etnjd4

Crypto Assets Worth Over $130 Million Stolen From Cream Finance in Hack

Ethereum-powered lending protocol called Cream Finance has lost $130 million in cryptocurrencies in a new hack. The company has acknowledged the breach and has revealed that an investigation in the...

from NDTV Gadgets - Latest https://ift.tt/3CuqgtA

Ravi Teja: 'ఖిలాడి' లేటెస్ట్ అప్‌డేట్: మాస్ మహారాజ్ దీపావళి కానుక సిద్ధం

మాస్ మహారాజ్ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త సినిమా ''. ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్‌లో కనిపించబోతున్నారు. డింపుల్ హయాతి, మీనాక్షి చైదరీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ కంటే ముందే షూటింగ్ ప్రారంభించుకున్న ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోంది. ‘రాక్షసుడు’ వంటి విజయం తర్వాత రమేష్ వర్మ రూపొందిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన అన్ని అప్‌డేట్స్ ఆ అంచనాలకు రెక్కలు కట్టాయి. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ మరింత వేగవంతం చేసిన చిత్రయూనిట్ మాస్ మహారాజ్ అభిమానుల కోసం దీపావళి కానుక సిద్ధం చేసింది. నవంబర్ 4వ తేదీన దీపావళి కానుకగా చిత్రంలోని సెకండ్ సాంగ్ రిలీజ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని రవితేజ తన ట్విట్టర్ వేదికగా పేర్కొంటూ కొత్త పోస్టర్ షేర్ చేశారు. జీవితంలో డబ్బుకే ప్రాధాన్యం ఇవ్వాలా? భావోద్వేగాలకు ఇవ్వాలా? లేక రెండూ ముఖ్యమా? అని ఆలోచింపజేసే పాత్రల సమ్మేళనమే ఈ 'ఖిలాడీ' మూవీ అంటున్నారు మేకర్స్. జయంతిలాల్‌ గడ సమర్పణలో హ‌వీష్ ప్రొడ‌క్ష‌న్‌, పెన్ స్టూడియోస్ బ్యానర్‌పై రూపుదిద్దుకుంటున్న ఈ మూవీకి 'ప్లే స్మార్ట్' అనేది ట్యాగ్‌లైన్‌. ఈ చిత్రంలో అనసూయ భరద్వాజ్, అర్జున్ కీలక పాత్రల్లో నటిస్తుండగా, రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. అతి త్వరలో రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3vYThLw

Cryptocurrency: Ether Hits All Time High of $4,400

Ether the world's second largest cryptocurrency hit an all-time high, a little over a week after larger rival bitcoin set its own record.

from NDTV Gadgets - Latest https://ift.tt/3EiyhlM

Samsung Leads Q3 Smartphone Shipments, Apple Posts Biggest Gain: IDC

The latest IDC data suggests that worldwide smartphone shipments declined 6.7 percent year over year. This decline is largely attributed to the supply chain and component shortages faced in the...

from NDTV Gadgets - Latest https://ift.tt/3vUIkuc

Apple Doubled Its Business in India, CEO Tim Cook Says

Apple doubled its business in India in the fiscal 2021, CEO Tim Cook said on Friday. iPhone 12 and iPhone 11 are believed to be the two key models helping the Cupertino company gain significant...

from NDTV Gadgets - Latest https://ift.tt/31ceFl4

Bitcoin, Ether Back in Green as Dogecoin Skyrockets by 29 Percent

Ether's milestone this week follows an all-time peak for Bitcoin last week of almost $67,000. It appears to be spurred on by increasing mainstream adoption of crypto tokens. Dogecoin, too, surged...

from NDTV Gadgets - Latest https://ift.tt/3jJX8qU

Thursday 28 October 2021

Amazon Reports Slump in Profits Sue to Labour, Supply Issues

Amazon reported a slump in profit that it expects will continue through the holiday quarter, as higher pay to attract workers and other operational disruptions diminish the company's windfall from...

from NDTV Gadgets - Latest https://ift.tt/3EvLw2F

అందుకుగాను ట్విట్టర్ వేదికగా సారీ చెప్పిన Rx 100 డైరెక్టర్.. ఇదీ నిజాయితీ అంటే!!

తొలి సినిమా Rx100తోనే తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు డైరెక్టర్ . యూత్ ఆడియన్స్ కోరుకునే స్టైల్ మూవీని ప్రేక్షకుల ముందుంచి భారీ విజయం సాధించాడు. దీంతో ఒక్కసారిగా ఆయన నేమ్ టాలీవుడ్‌లో మారుమోగింది. అయితే రీసెంట్‌గా తన రెండో సినిమాగా 'మహా సముద్రం' చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చి ఆశించిన ఫలితం రాబట్టలేకపోయాడు. అయితే ఈ మూవీ రిలీజ్‌కి ముందు మహా సముద్రం మీ అందరికీ నచ్చుతుందని, మరో హిట్ పక్కా అంటూ బల్లగుద్ది చెప్పిన డైరెక్టర్.. తీరా రిలీజ్ తర్వాత చతికిలపడ్డాడు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా కొందరు నెటిజన్స్ ఆయనతో మూవీ రిజల్ట్ గురించి ప్రస్తావించారు. దీంతో ఓపెన్ అయిన అజయ్ భూపతి ట్విట్టర్ వేదికగా సారీ చెప్పాడు. ''మీ అంచనాలను అందుకోలేక పోయినందుకు క్షమించండి.. ఈ సారి మీ అందరినీ సంతృప్తి పరిచే కథతో వస్తాను'' అని పేర్కొంటూ ట్వీట్ చేశాడు అజయ్ భూపతి. ఈ ట్వీట్ చూసిన నెటిజన్స్ ఆయన నిజాయితీని మెచ్చుకుంటూ తదుపరి సినిమాకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. ఏ రంగంలో అయినా జయాపజయాలు సహజం. అయితే ఓటమిని అంగీకరించడం అనేది గొప్ప విషయం. తాజాగా అదే చేశాడు అజయ్ భూపతి. అజ‌య్ భూప‌తి దర్శకత్వంలో శ‌ర్వానంద్‌, సిద్ధార్ధ్ హీరోలుగా రూపొందిన 'మహా సముద్రం' సినిమా రూపొందింది. చిత్రంలో అతిది రావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటించాగా జగపతి బాబు, రావు రమేశ్ ముఖ్యపాత్రలు పోషించారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను రీచ్ కాలేకపోయింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3BragHt

Anasuya: మంత్రి కేటీఆర్‌కి అనసూయ సూటి ప్రశ్న.. ఇదెక్కడి న్యాయం? బడి బాటపై యాంకర్ ఓపెన్ కామెంట్స్

జబర్దస్త్ యాంకర్‌గా యమ జోష్‌లో ఉన్న అటు సోషల్ మీడియాలోనూ హవా నడిపిస్తోంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ అప్‌డేట్స్, ఫోటో షూట్స్ షేర్ చేయడమే గాక సమాజంలో జరుగుతున్న కొన్ని పరిణామాలపై స్పందిస్తోంది ఈ బ్యూటీ. ట్రోలింగ్స్ ఎదురైనా, ఎవరేమనుకున్నా తాను చెప్పాలనుకున్న విషయాన్ని మాత్రం అస్సలు దాచుకోవడం లేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా కొన్ని విషయాలపై మంత్రి కేటీఆర్‌ని సూటిగా ప్రశ్నించింది ఈ జబర్దస్త్ భామ. దాదాపు రెండేళ్ల పాటు విలయతాండవం చేసిన కరోనా ఇప్పుడిప్పుడే కాస్త తగ్గుముఖం పట్టడంతో మెల్లమెల్లగా అని రంగాలు పుంజుకుంటున్నాయి. వ్యాక్సిన్ కార్యక్రమాన్ని పెద్దఎత్తున నిర్వహిస్తూ అందరికీ వ్యాక్సిన్ చేరేలా జాగ్రత్త వహిస్తున్నాయి ప్రభుత్వాలు. అయితే చిన్నపిల్లలకు మాత్రం ఇంకా వ్యాక్సినేషన్ షురూ కాలేదు. కానీ స్కూల్స్ మాత్రం తెరిచేశారు. పిల్లలను పాఠశాలకు పంపించాలని స్కూల్ యాజమాన్యాలు తల్లిదండ్రులను కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఇష్యూపై అనసూయ రియాక్ట్ అవుతూ వరుస ట్వీట్స్ చేసింది. ''డియర్ కేటీఆర్ సర్.. అసలు లాక్‌డౌన్‌ ఎందుకు వచ్చింది ఆపై అన్‌లాక్‌ ఎందుకు చేశారు అనేది అర్థం చేసుకోవాలి. మనందరికీ వ్యాక్సిన్‌ వేస్తున్నామని కాస్త భరోసా ఇచ్చారు. మరి టీకా వేయాల్సిన వయస్సు కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల సంగతేంటి సార్? వాళ్ళను స్కూల్స్‌కి పంపించమని పాఠశాలల యాజమాన్యాలు తల్లిదండ్రులను ఎందుకు బలవంతం చేస్తున్నాయి. పిల్లలు స్కూల్‌లో ఉన్నప్పుడు వారికి ఏమైనా జరిగితే తమ బాధ్యత లేదని పేర్కొంటూ పేపర్‌పై సంతకం కూడా చేయించుకుంటున్నాయి స్కూల్ యాజమాన్యాలు. చెప్పండి.. ఇదెక్కడి న్యాయం.. ఇది ఎంతవరకు సమంజసం. ఎప్పటిలాగే మీరు సరైన మార్గనిర్దేశం చేస్తారని ఆశిస్తున్నా'' అంటూ పోస్ట్ పెట్టింది అనసూయ. ఈ ట్వీట్స్ చూసిన నెటిజన్లు అనసూయ అభిప్రాయాన్ని ఏకీభవిస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3bmEuRe

Apple Results Hit by Supply Chain Woes: All You Need to Know

Supply chain woes cost Apple $6 billion (roughly Rs. 44,890 crore) in sales during the company's fiscal fourth quarter, which missed Wall Street expectations, and Chief Executive Tim Cook said that...

from NDTV Gadgets - Latest https://ift.tt/3GyeyAf

Meta, Formerly Facebook, Could Be Planning to Launch an Apple Watch Rival

Meta, the company formerly known as Facebook, is developing a smartwatch with a front-facing camera and rounded screen, according to an image of the device found inside one of the tech giant's...

from NDTV Gadgets - Latest https://ift.tt/3pIeyIa

Facebook Changes Name to Meta as It Refocusses on Virtual Reality

Facebook is now called Meta, the company said, in a rebrand that focusses on building the "metaverse," a shared virtual environment that it bets will be the successor to the mobile internet.

from NDTV Gadgets - Latest https://ift.tt/3w2h90D

'So far, Covid vaccines protect from severe illness'

'The immune protection may well wane somewhat, and that's what we have to monitor.'

from rediff Top Interviews https://ift.tt/3BpGrqw

వరుడు కావలెను ట్విట్టర్ రివ్యూ: ఇదీ ఫస్టాఫ్, సెకండాఫ్ రిపోర్ట్

విలక్షణ కథలను ఎంచుకుంటూ ముందుకెళ్తున్న యువ హీరో ఈ సారి '' అనే కుటుంబ కథా చిత్రంలో రంగంలోకి దిగారు. లక్ష్మీ సౌజన్యను దర్శకురాలిగా పరిచయం చేస్తూ నేడు (అక్టోబర్ 29) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఇప్పటికే ఈ సినిమా ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్ సినిమాపై తమ అభిప్రాయాన్ని ట్విట్టర్ వేదికగా తెలియజేస్తున్నారు. వ‌రుడు కావలెను చిత్రం ఇంట్రెస్టింగ్ అంశాల‌తో ఆస‌క్తిక‌రంగా సాగిందనే టాక్ వినిపిస్తోంది. కామెడీ, ఎమోష‌న‌ల్ సీన్స్ సినిమాలో హైలైట్ అయ్యాయని అంటున్నారు. ఫ్యామిలీ ఆడియ‌న్స్‌కి మంచి వినోదం పంచే సినిమా ఇది అని అంటున్నారు. ఫస్టాఫ్ పర్లేదు కానీ సెకండాఫ్ మాత్రం కాస్త బోర్ ఫీల్ తెప్పించిందని, మొత్తంగా చెప్పాలంటే యావరేజ్ సినిమా ఇది అని చెబుతున్నారు. కొందరైతే ఈ సినిమా అవుట్ డేటెడ్ అని కామెంట్ చేస్తున్నారు. పాటలు ఫ్రెష్‌గా అనిపిస్తాయని, ప్రొడక్షన్ వ్యాల్యూస్, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో సాగే కొన్ని సీన్లు సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయని అంటున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై పి.డి.వి ప్రసాద్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా రూపొందించిన ఈ చిత్రంలో నాగ శౌర్య సరసన యంగ్ హీరోయిన్ రీతూ వర్మ నటించింది. నదియా, మురళీశర్మ, వెన్నెల కిషోర్, ప్రవీణ్, అనంత్, కిరీటి దామరాజు, రంగస్థలం మహేష్, అర్జున్ కళ్యాణ్, వైష్ణవి చైతన్య, సిద్దిక్ష ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3bkZasH

Romantic Twitter Review: పూరి తనయుడి సినిమా ఎలా ఉందంటే..

పూరి తనయుడు హీరోగా రూపొందిన కొత్త సినిమా ''. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అనిల్ పాదూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నిర్మాణ బాధ్యతలు దగ్గరుండి చూసుకున్నారు . ఈ మూవీతో తన తనయుడి ఎలాగైనా ట్రాక్ ఎక్కించాలని బలంగా ఫిక్సయిన పూరి.. చిత్ర ప్రమోషన్స్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకొని సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశారు. నేడు (అక్టోబర్ 29) ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. అయితే ఇప్పటికే ఈ మూవీ ప్రీమియర్స్ చూసిన సినీ ప్రముఖులు, టాలీవుడ్ దర్శక నిర్మాతలు సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. అదేవిధంగా ఈ మూవీ చూసిన ఆడియన్స్ సినిమా ఎలా ఉందో తమ తమ అభిప్రాయాలు తెలుపుతూ ట్విట్టర్‌లో పోస్టులు పెడుతున్నారు. పూరి స్టైల్‌లో ఈ మూవీ అదిరిపోయిందని, పూరి గారి అబ్బాయి ఇరగదీశాడని అంటున్నారు. పూరీ కనెక్ట్స్ పతాకంపై పూరీ జగన్నాథ్‌, ఛార్మి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు సునీల్‌ కశ్యప్‌ సంగీతం అందించారు. రమ్యకృష్ణ పవర్ ఫుల్ పోలీసాఫీసర్‌గా నటించింది. ఆకాష్ సరసన హాట్ బ్యూటీ కేతిక శర్మ హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే విడుదలైన రొమాంటిక్ పోస్టర్స్, టీజర్, ట్రైలర్స్ సినిమాపై ఓ రేంజ్ అంచనాలు క్రియేట్ చేయగా.. ప్రభాస్ అందించిన ప్రమోషన్స్ ప్లస్ అయ్యాయి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/31dAEIk

అఖిల్ ‘ఏజెంట్‌’లో మెగాస్టార్ లుక్ లీక్‌.. చూస్తే ఫ్యాన్స్‌కు కిక్కే!

ఈ ఏడాది అక్కినేని న‌ట వార‌సులు అక్కినేని నాగ‌చైత‌న్య‌, అఖిల్‌ల‌కు బాగా క‌లిసొచ్చింది. ల‌వ్‌స్టోరితో నాగ‌చైత‌న్య బ్లాక్బ‌స్ట‌ర్‌ హిట్ వ‌స్తే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌తో అఖిల్ సూప‌ర్ హిట్ కొట్టాడు. అదే ఉత్సాహంతో అఖిల్ ఇప్పుడు నెక్ట్స్ మూవీ స‘ఏజెంట్‌’ కోసం రెడీ అవుతున్నారు. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌కుడు. ఇది ప‌క్కా యాక్ష‌న్ మూవీగా సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. కెరీర్ ప్రారంభంలోనే అఖిల్ చేస్తున్న భారీ బ‌డ్జెట్ మూవీ ఇది. అలాగే ఈ సినిమా కోసం అఖిల్ స‌రికొత్త లుక్‌లో క‌నిపించ‌బోతున్నారు. సిక్స్ ప్యాక్ కూడా పెంచేశాడు. దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్ప‌టికే విడుద‌ల‌య్యాయి. ఈ సినిమాలో మ‌లయాళ మెగాస్టార్ మ‌మ్ముట్టి విల‌న్‌గా న‌టించ‌బోతున్నార‌ని వార్త‌లు వినిపించిన సంగ‌తి తెలిసిందే. కానీ ఇప్పుడు మ‌రో వార్త నెట్టింట తెగ హ‌ల్ చ‌ల్ చేస్తోంది. అది కూడా మ‌మ్ముట్టి లుక్ విష‌య‌మై. ఏజెంట్‌లో స్టైలిష్ లుక్‌లో క‌నిపించ‌బోతున్నారంటూ.. ఓ చిన్న వీడియో క‌నిపిస్తోంది. అందు మ‌మ్ముట్టి చాలా స్టైలిష్‌గా, డిఫ‌రెంట్‌గా క‌నిపిస్తున్నారు. ఈ లుక్ అఖిల్ సినిమా ఏజెంట్ కోస‌మేన‌ని, ఇప్పుడు యూనిట్ అంతా యూర‌ప్‌లో బుడాపెస్ట్‌కు చేరుకుంద‌ని అక్క‌డ షూటింగ్ జ‌రుగుతుంద‌ని, ముఖ్యంగా మ‌మ్ముట్టిపై కీల‌క స‌న్నివేశాల‌ను అక్క‌డే చిత్ర‌క‌రిస్తార‌ని వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. దాదాపు రెండు వారాల పాటు మ‌మ్ముట్టి ఈ సినిమా కోసం డేట్స్ కేటాయించార‌ని కూడా టాక్ వినిపిస్తోంది. అక్కినేని అఖిల్ ‘ఏజెంట్‌’ సినిమాను సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్‌పై అనీల్ సుంక‌ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ స్పై థ్రిల్ల‌ర్‌లో అఖిల్ జోడీగా సాక్షి వైద్య న‌టిస్తుంది. ఇండియ‌న్ జేమ్స్ బాండ్‌గా అఖిల్‌ను వెండితెర‌పై ఆవిష్క‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి. బ‌డ్జెట్ దృష్ట్యా ఈ మూవీని పాన్ ఇండియా రేంజ్లో విడుద‌ల చేస్తారో లేక టాలీవుడ్‌కే ప‌రిమితం చేస్తారో చూడాలి. అఖిల్‌, హ‌లో, మిస్ట‌ర్ మ‌జ్ను చిత్రాలతో హీరోగా మెప్పించినా అక్కినేని అభిమానులు ఆశించిన స్థాయి విజయాన్ని మాత్రం అఖిల్ అందుకోలేక‌పోయారు. అయితే గీతాఆర్ట్స్ 2 బ్యాన‌ర్‌లో చేసిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌తో తొలి స‌క్సెస్ అందుకున్న అఖిల్ ఆ స్పీడును కంటిన్యూ చేస్తాడో లేదో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3mnO6RS

Prabhas: ‘రాధేశ్యామ్‌’ రియ‌ల్ స్టోరీనా!.. ఆయన జీవితమే ఇన్‌స్పిరేషనా ?

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘రాధేశ్యామ్‌’. దాదాపు రెండున్న‌రేళ్లుగా ప్ర‌భాస్ సినిమా కోసం ఎదురుచూస్తున్న ఆయ‌న అభిమానుల‌కు వ‌చ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా ఫెస్టివ‌ల్‌ను తీసుకొస్తుంది. భారీ అంచ‌నాల‌తో అంద‌రూ ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. రీసెంట్‌గా విడుద‌లైన ఈ సినిమా టీజ‌ర్ సినిమాపై అంచ‌నాల‌ను పెంచేసింది. ఇందులో ప్ర‌భాస్ చేతి రేఖ‌ల‌ను ఆధారంగా చేసుకుని వ్య‌క్తి భ‌విష్య‌త్తును చెప్పేసే విక్ర‌మాదిత్య‌గా క‌నిపించ‌బోతున్నారనేది తేట తెల్ల‌మైంది. కాగా.. ఇప్పుడు ఈ సినిమా క‌థాంశంపై ఓ ఆస‌క్తిక‌ర‌మైన వార్తొక‌టి ఫిలింన‌గ‌ర్ సర్కిల్స్‌లో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. అదేంటంటే.. ‘రాధేశ్యామ్‌’ ఓ వ్య‌క్తి జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెర‌కెక్కించారు. అలాగంటే బ‌యోపిక్ అనొచ్చా అంటే చెప్ప‌లేం. ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ కుమార్ ఇంత‌కీ ఎవ‌రి ఇన్‌స్పిరేష‌న్‌తో ఈ సినిమాలో విక్ర‌మాదిత్య పాత్ర‌ను త‌యారు చేసుకున్నారంటే.. విలియం జాన్ వార్న‌ర్ అలియాస్ చెయిరో. ఈయ‌న 19వ శ‌తాబ్దంలో ఐరిష్ దేశానికి చెందిన హ‌స్త‌సాముద్రికా నిపుణుడు. ఈయ‌న‌కు సంఖ్యా శాస్త్రంపై కూడా మంచి ప‌ట్టుంది. మ‌న భార‌త‌దేశంలోనే జ్యోతిశ్యం నేర్చుకున్నాడీయ‌న‌. 1880 ద‌శ‌కంలో అప్ప‌టి రాజుల మ‌ర‌ణాలు, ఇత‌ర విష‌యాల‌ను క‌చ్చితంగా లెక్క‌గ‌ట్టి చెప్పి అంద‌రినీ విస్మ‌యానికి గురిచేశారు. చెయిరో జీవితాన్ని ఆధారంగా చేసుకుని చాలా సినిమాలే రూపొందాయి. ఇప్పుడు కూడా ఆయ‌న జీవితంలోని కొన్ని ఘ‌ట‌న‌ల‌ను బేస్ చేసుకుని దానికి క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌ను జోడించి తెర‌కెక్కించార‌ని టాక్‌. మ‌రి ఇందులో నిజానిజాలేంట‌నేది ద‌ర్శ‌కుడు చెప్పాల్సిందే. జోడీగా ఇందులో పూజా హెగ్డే క‌నిపిస్తోంది. కృష్ణంరాజు స‌మ‌ర్ప‌ణ‌లో యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై వంశీ, ప్ర‌మోద్‌, ప్ర‌శీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ నిర్మాణ సంస్థ టి సిరీస్ కూడా ఇందులో భాగ‌స్వామిగా వ్య‌వ‌హ‌రిస్తోంది. జ‌న‌వ‌రి 14,2022లో సినిమా విడుద‌ల‌వుతుంది. ఇప్పుడు వ‌రుస పాన్ ఇండియా సినిమాల‌తో ప్ర‌భాస్ బిజీగా ఉన్నారు. ఇప్ప‌టికే స‌లార్‌, ఆదిపురుష్ సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. మ‌రోవైపు నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కె, సందీప్ వంగా తెర‌కెక్కించాల్సిన స్పిరిట్ సినిమాలు ప్ర‌భాస్ కోసం వెయిటింగ్‌లో ఉన్నాయి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3bmeNjK

'Residential, hospitality are best-performing sectors'

'The overall market cycle is very positive.' from rediff Top Interviews https://ift.tt/iTjSyPd