Saturday, 15 August 2020

కన్నీళ్లు ఆగట్లేదు.. ధోనిపై మహేష్ బాబు ఎమోషనల్ ట్వీట్

భారత క్రికెట్ దిగ్గజనం మహేంద్రసింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ తీసుకున్నట్టు ప్రకటించగానే ఒక్కసారి యావత్ భారతదేశం షాక్‌కు గురైంది. ఇక క్రీడా లోకం అయితే మూగపోయింది. అందరూ ఒక్కసారిగా ఎమోషనల్‌గా ఫీల్ అయ్యారు. ఇక ధోని అభిమానులు గురించి వేరేగా చెప్పాల్సిన పని లేదు. టీ 20 వరల్డ్ కప్ తర్వాత రిటైర్ అవుతారేమోనని అందరు భావిస్తున్న తరుణంలో మహీ తాను రిటైర్ అయ్యే సమయం అయిందని ప్రకటించాడు. ఎంఎస్ ప్రకటించడంతో సోషల్ మీడియాలో ఆయన పేరు మారు మ్రోగిపోయింది. ధోని ఫ్యాన్స్‌తో పాటు.. పలువురు సెలబ్రిటీలు సైతం ధోని రిటైర్మెంట్‌పై భావోద్వేగానికి గురవుతున్నారు. నువ్వొక లెజెండ్‌. నీ ఆటను ఎలా మరచిపోగలం అంటూ పలువురు అభిమానులు, క్రికెట్ విశ్లేషకులు, సెలబ్రిటీలు ట్వీట్స్ చేశారు. సూపర్ స్టార్ ..‘2011 వన్డే ప్రపంచకప్‌లో సిక్సర్ బాది భారత్‌కు ప్రపంచకప్ అందించిన ఉద్వేగభరితమైన దృశ్యంకి సంబంధించిన పోస్టర్ షేర్ చేస్తూ.. ఆ ఐకానిక్ సిక్సర్‌ను ఎలా మరచిపోగలం. 2011 ప్రపంచకప్ ఛాంపియన్స్ !! వాంఖడే స్టేడియంలో ఉన్నట్టు ఉంది. ఆ సన్నివేశాలు తలచుకుంటే గర్వంగా ఉంది. ఎమోషనల్ అవుతున్నా. క్రికెట్ ఎప్పటికీ ఒకేలా ఉండదు’ అంటూ మహేష్ ట్వీట్ చేశారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2PWCNiG

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....