Saturday, 15 August 2020

సెక్స్ కోసమే ఆడది.. ఎందరో తల్లుల్ని తగలబెట్టిన దేశం మనది.. పూరి జగన్నాథ్ సంచలన వ్యాఖ్యలు

డాషింగ్ డైరెక్టర్ మీడియా అనే కొత్త దారిలో తనలోని భావాలను బయట పెడుతున్న సంగతి తెలిసిందే. సమాజంలోని అన్ని అంశాలపై స్పందిస్తూ తన అభిప్రాయాలను, చరిత్రను స్వేచ్ఛగా బయటపెడుతున్న ఆయన.. తాజాగా ఓ పోడ్‌కాస్ట్ ఆడియోలో ఆడవాళ్లపై, ఈ సమాజం తీరుపై సంచలన కామెంట్స్ చేశారు. ప్రతి ఒక్క ఆడదానితో ఆలోచనలు రేకెత్తించేలా మాట్లాడారు. చరిత్రను తవ్వుతూ సెన్సేషనల్ విషయాలు బయటపెట్టారు. అవన్నీ.. మనందరికీ తెలిసినవే అయినా మేలుకొలిపేలా స్పూర్తినిస్తూ ఆయన మాట్లాడిన తీరు పలువురిని ఆకర్షిస్తోంది. ఈ ఆడియోలో పూరి తన సొంత వాయిస్‌లో ఏం చెప్పారంటే.. ''స్త్రీని మనం ఎప్పుడూ పుస్తకాల్లోనే గౌరవించాం. నిజ జీవితంలో కాదు.. మాతృస్వామ్య వ్యవస్థ పోయి అధికారం ఎప్పుడైతే మగాళ్ల చేతికొచ్చిందో అప్పటి నుంచే ఆడాళ్లకు కష్టాలు మొదలయ్యాయి. అవసరం కోసమే ఆడది.. సెక్స్ కోసం, వంట కోసం. పూర్వం ఒక అమ్మాయిని తీస్తే ఆ ఇంట్లో ఎంతమంది మగాళ్ళుంటే అందరికీ పెళ్ళామే. అన్నదమ్ములందరితో కాపురం చేయాలి. ఆమెనే ఇల్లాలు అనేవారు. ఆ తర్వాత.. ఓ 1000 సంవత్సరాల క్రితం బాల్య వివాహాలు మొదలయ్యాయి. ఇన్‌సెక్యూరిటీ కారణంగా తల్లిదండ్రులు చిన్నప్పుడే ఆడపిల్లలకు పెళ్లి చేసేవారు. ఎంతో కొంత కన్యాశుల్కం వస్తుందని. దీని తర్వాత వరకట్నం. అది ఇప్పటికీ పోవట్లే. దాని తర్వాత ప్రపంచంలో ఏ దేశంలోనూ జరగని దారుణం. సతీసహగమనం. భర్త చనిపోతే అదే శవంపై బ్రతికున్న భార్యను తగలబెట్టడం. ఇది కొన్ని వందల ఏళ్ళు కొనసాగింది. లాస్ట్ సతీసహగమనం ఎప్పుడు జరిగిందంటే.. 1987 మధ్యప్రదేశ్‌లో 18 ఏళ్ల అమ్మాయిని, 2002 రాజస్థాన్‌లో 65 ఏళ్ల ఆవిడను సజీవ దహనం చేశారు. Also Read: ఏమాటకామాటే.. మనం శాడిస్ట్ నా కొడుకులం. ఆ తర్వాత ఆడదాన్ని విధవను చేసాం. విధవను ఎన్ని కష్టాలు పెట్టామో మనందరికీ తెలుసు. ఎందుకంటే ప్రతి ఇంట్లోనూ మన అమ్మమ్మో.. నాన్నమ్మో ఉన్నారు కాబట్టి. వాళ్ళను చూస్తూ పెరిగాం. తెల్ల చీర కట్టుకోవాలి, కుంకుమ తాకకూడదు, శుభకార్యం వస్తే రానివ్వరు, ఆవిడ ఎదురొస్తే అశుభం అట.. దాక్కొని దాక్కొని చచ్చారు మన అమ్మమ్మలు, నానమ్మలు. ఆచారం ముసుగులో ఉన్న ముర్ఖులం మనం. మన గురించి గొప్పలు చెప్పుకోకండి. ఎందరో తల్లుల్ని తగలబెట్టిన దేశం మనది. ఈ ఒక్క జెనరేషన్ లోనే ఆడాళ్ళు మాట్లాడుతున్నారు, ధైర్యంగా తిరుగుతున్నారు. ఇష్టం లేకుంటే డివోర్స్ తీసుకుంటున్నారు. కానీ 60 వేల సంవత్సరాలు ఆడదానికి మనం నరకం చూపించాం. ఇప్పటికీ ప్రతి గంటకో రేప్ జరుగుతూనే ఉంది. ఎప్పుడు గౌరవించాం స్త్రీని? ఏ దేశంలో స్త్రీ గౌరవించబడుతుందో ఆ దేశాలే రూల్ చేస్తాయి. స్త్రీకి నరకం చూపించిన దేశాలన్నీ సంకనాకి పోయాయి. కావాలంటే చెక్ చేసుకోండి. Also Read: ఇకనుండైనా మగాడి మీద ఆధారపడకుండా ఆడది ఎదగాలి. అసలు మగాన్ని పూర్తిగా వదిలేయండి. మీకు తెలుసా? జమైకాలో పెళ్లిళ్లు లేవు.. ఆడాళ్లే రూల్ చేస్తారు. మగాళ్లను తెచ్చుకుంటారు. నచ్చకపోతే మొగున్ని ఇంట్లోంచి బయటకు తోసేసి మళ్ళీ ఇంకొకడిని తెచ్చుకుంటారు. నా మాట విని మానేయండి పెళ్లిళ్లు. అందగత్తెలకు కాదు ర్యాంప్ వాక్‌లు.. మగాడి తోడు లేకుండా నిలబడే ఆడదానికి పెట్టాలి ర్యాంప్ వాక్‌లు. సక్సెస్‌ఫుల్ విమెన్‌ని క్రియేట్ చేయాలి మన కంట్రీలో. వాళ్ళే మన మిస్ ఇండియాలు'' అంటూ రెచ్చిపోయి మాట్లాడారు పూరి జగన్నాథ్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/31R9GTs

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....