Wednesday, 26 August 2020

బెదిరింపులు తట్టుకోలేక పోతున్నా.. నన్ను చంపేయాలని చూస్తున్నారు.. బోరున విలపించిన టీవీ నటి

కుంకుం భాగ్య సీరియల్ ఫేమ్, టీవీ నటి (19) తనకు ప్రాణహాని ఉందంటూ బోరున విలపించింది. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాలో వీడియో పోస్ట్ చేస్తూ ఆవేదన చెందింది. తన తండ్రే తనపై బెదిరింపులకు పాల్పడుతున్నారని, చంపేస్తా అని వార్నింగులిస్తూ భయబ్రాంతులకు గురి చేస్తున్నట్లు చెబుతూ కన్నీరు పెట్టుకుంది. ఈ మేరకు తనకు రక్షణ కల్పించాలని కోరింది. రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన తన తండ్రి రామ్ రతన్ శంఖధార్ తనకు ఇష్టం లేని పెళ్లి చేయాలని చూస్తున్నారని, 28 ఏళ్ల ఓ వ్యక్తితో తన వివాహం జరిపించాలని చూస్తుండగా తాను నిరాకరించడంతో బెదిరింపులకు పాల్పడుతున్నారని తృప్తి శంఖధార్ చెప్పింది. తన జుట్టు పట్టుకుని లాగుతూ దారుణంగా కొట్టారని, అయితే పోలీసులు తన ఫిర్యాదును స్వీకరించడం లేదని.. తనకు రక్షణ కల్పించాలని కోరుతూ ఆమె తీవ్ర ఆవేదన చెందింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. Also Read: కాగా ఈ వీడియోపై స్పందించిన రాయ్ బరేలి పోలీసులు తమకు సదరు నటి నుంచి ఎటువంటి ఫిర్యాదు రాలేదని తెలిపారు. ఆమె సోషల్ మీడియాలో చేసిన ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. మరవైపు నటి తృప్తి శంఖధార్ తండ్రి రామ్ రతన్ శంఖధార్ కూడా ఈ ఆరోపణలను ఖండించారు. తృప్తి శంఖధార్ ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ‘ఓయ్ ఇడియట్’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.‌


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/31wGGS5

No comments:

Post a Comment

Why Pakistan Has Launched A War Against Afghanistan

'Islamabad feels it has no alternative, but to address the challenges from the Afghan-Taliban through an open war.' from rediff To...