Tuesday, 18 January 2022

ఒక్క ఛాన్స్ ప్లీజ్..! బాలకృష్ణపై రామ్ గోపాల్ వర్మ కన్ను.. నేరుగా ఆ మాట అడిగేస్తూ!

నిజాయితీగా ఉండటం, ముక్కుసూటిగా మాట్లాడటం, కోపం వస్తే నోటికి చేతికి పని చెప్పడం బాలయ్య బాబు నైజం. ప్రతి విషయాన్ని లోతుగా కూలంకషంగా పరిశీలించడం, అందులోని లాజిక్స్ వెలికి తీస్తూ ఎవ్వరూ ఊహించని పాయింట్ బయటకు తీయడం, దానిపై విమర్శనాత్మక కోణంలో సెటైర్స్ వేయడం స్టైల్. మరి ఈ ఇద్దరూ ఎదురెదురుగా ఒకే వేదికపై తారసపడితే ఇక ఆ సీన్ ఊహించుకోండి ఎలా ఉంటుందో!. సరిగ్గా అదే టార్గెట్ చేశారు సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవీ. ఆహా ఓటీటీ వేదికపై అంటూ యమ స్పీడుగా దూసుకుపోతున్నారు నందమూరి నటసింహం బాలకృష్ణ. ఆయన కట్టు బొట్టు, మాట విధానానికి ఆన్ లైన్ ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. ఎదురుగా సెలబ్రిటీలను కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తున్న విధానం, ఆయన సంధించే ప్రశ్నల వర్షం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. దీంతో ఆహా వేదికపై ఈ షోకి భారీ రెస్పాన్స్ దక్కుతోంది. ఈ నేపథ్యంలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కన్ను ఈ షోపై పడింది. ఇంకేముంది తన సోషల్ మీడియా అస్త్రం ట్విట్టర్ వేదికగా ఓ ట్వీట్ వేసుకున్నారు. అన్‌స్టాపబుల్‌ విత్ ఎన్‌బీకే ప్రోగ్రామ్‌కు బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇచ్చారు. బాలయ్య బాబు హోస్ట్ చేస్తున్న ఈ షో అంటే తనకెంతో ఇష్టమని చెప్పిన ఆర్జీవీ.. ఇదో స్ట్రాటో ఆవరణ ప్రోగ్రామ్ అంటూ ఆకాశానికెత్తారు. అంతేకాదు తనకు కూడా ఆ షోలో పాల్గొనాలని ఉందంటూ ఓపెన్ అయ్యారు వర్మ. బాలకృష్ణ గారు నాకో అవకాశం ఇస్తారని ఆశిస్తున్నా అంటూ రామ్ గోపాల్ వర్మ పెట్టిన ట్వీట్ క్షణాల్లో వైరల్ అయింది. కాకపోతే కొద్దిసేపటికే ఆ ట్వీట్ డిలీట్ చేశారు వర్మ. బాలయ్య బాబు హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్‌ షోలో ఇప్పటికే చాలా మంది టాలీవుడ్ సెలబ్రిటీలు పాల్గొన్నారు. పూరి జగన్నాథ్, గోపీచంద్ మలినేని లాంటి డైరెక్టర్లు సహా పలువురు నటీనటులను ఇంటర్వ్యూస్ చేశారు. మరి వర్మ కోరుకున్నట్లే బాలయ్య బాబు గానీ, ఆహా టీమ్ గానీ ఆయనతో స్కెచ్చేస్తే ఇక ఆ కిక్కు మామూలుగా ఉండదని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3tFC3Um

No comments:

Post a Comment

'Most Dargahs And Mosques Will Be Threatened'

'The new Waqf bill sows the seed for conflict in every town and village of India.' from rediff Top Interviews https://ift.tt/UcHi9...