Tuesday, 18 January 2022

ధనుష్- ఐశ్వర్య విడాకులకు కారణం ఇదే? రజినీకాంత్ ఎంత వరకు ఎంటరయ్యారు? జనాల్లో ముదిరిన చర్చలు

సెలబ్రిటీ కపుల్స్ విడాకుల ఇష్యూస్ ఒక్కొక్కటిగా బయటకొస్తుండటం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రీసెంట్‌గా చై-సామ్ డివోర్స్ మ్యాటర్ హాట్ టాపిక్ కాగా.. ఇప్పుడు సూపర్ స్టార్ కూతురు, అల్లుడు ఐశ్వర్య రజినీకాంత్- తమ 18 ఏళ్ల త‌మ వివాహ బంధానికి స్వ‌స్తి పలకడం ఒకింత అందరికీ షాకిచ్చినట్లయింది. తామిద్దరం విడిపోతున్నామని అటు ఐశ్వర్య, ఇటు ధనుష్ అధికారికంగా తమ తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా ప్రకటించారు. ఇలాంటి ప‌రిస్థితుల‌ను ఎదుర్కోవ‌డానికి గోప్య‌త అవ‌స‌రం. దాన్ని మాకు క‌ల్పించండి అని ధనుష్ కోరారు. అయితే ఊహించని విధంగా ఐశ్వర్య రజినీకాంత్- ధనుష్ విడాకుల ప్రకటన రావడం జనాల్లో పలు చర్చలకు తావిచ్చింది. ఈ జోడీ ఇన్నేళ్ల వివాహ బంధానికి ఫుల్‌స్టాప్ పెట్టాల్సినంత బలమైన కారణం ఏముంది అనే దానిపై చర్చలు షురూ అయ్యాయి. సినిమాలతో బిజీగా ఉన్న ధనుష్‌.. కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని, అంతేకాదు ఓ నటితో సన్నిహితంగా ఉంటున్నారని తెలిసి భార్యాభర్తల మధ్య నెలకొన్న వివాదం డివోర్స్ దాకా దారి తీసిందనే టాక్ వినిపిస్తోంది. అయితే ధనుష్- ఐశ్వర్య మధ్య నెలకొన్న మనస్పర్థల గురించి రెండు నెలల క్రితమే తెలుసుకున్న రజినీకాంత్.. ఈ సమస్యను పరిష్కరించేందుకు చాలా ప్రయత్నం చేశారట. కానీ ఎంతకూ ఇద్దరూ వినకపోవడంతో చివరకు ఇష్యూ విడాకుల దాకా వచ్చిందని కోలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ర‌జినీకాంత్ పెద్ద కుమార్తె అయిన ఐశ్వర్య 2004 న‌వంబ‌ర్ 18న పెద్దల సమక్షంలో ధనుష్‌ని పెళ్లాడింది. వీరికి ఇద్దరు కుమారులున్నారు. ఈ దంపతుల మధ్య ఇన్నేళ్ల పాటు రాని మనస్పర్థలు 18 సంవత్సరాల తర్వాత ఇలా రావడం, డివోర్స్ దాకా వెళ్లడాన్ని కోలీవుడ్ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3qHCqfc

No comments:

Post a Comment

RBI Governor: 'Rates may remain low in near to medium term'

"It is quite possible that the rates will remain low in the near to medium term, but that will depend on how conditions evolve," s...