Saturday, 15 August 2020

IndependenceDay 2020: చిరంజీవి అలా.. బాలకృష్ణ ఇలా! మెగా, నందమూరి అభిమానులు ఉప్పొంగిపోయే సందేశాలు

ఆగస్టు 15 అంటే దేశానికే ఓ పండగ రోజు. కులమతాలకు అతీతంగా భారతీయులంతా ఒక్కటై నీలాకాశంలో త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించే రోజు. దేశం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా తెల్ల దొరలతో పోరాడిన త్యాగ శీలులను, గొప్ప మహానుభావులను స్మరించుకునే పర్వదినం. అలాంటి ఈ రోజున మనం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించుకుంటాం. ఈ నేపథ్యంలో ఈ ఏడాది సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా దేశభక్తి రగిలించే సందేశాలు పోస్ట్ చేశారు. దేశంలో కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలకు లోబడి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన నందమూరి .. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ''ఎన్నో ఏళ్ల పాటు ఆంగ్లేయుల బానిస సంకెళ్లలో నలిగిపోయిన భారతావనిని వారి కబంధ హస్తాల నుండి విడిపించి.. మన స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం అశువులు బాసిన ఎందరో సమరయోధుల త్యాగ దీక్షా దక్షతలను స్మరించుకుంటూ... స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు'' అని ఆయన తెలిపారు. Also Read: మరోవైపు ట్విట్టర్ వేదికగా స్పందించిన మెగాస్టార్ .. ''దేశ ప్రజలందరికీ 74వ స్వాతంత్ర్య దినోత్స‌వ శుభాకాంక్ష‌లు. మన పూర్వీకుల త్యాగాలను గుర్తు చేసుకోవాల్సిన తరుణమిది. వారి ఆలోచన, త్యాగాల కారణంగా మనకు ఈ విలువైన స్వాతంత్య్రం లభించింది'' అంటూ సందేశమిచ్చారు. ఇక మరికొందరు హీరోలు మోహన్ బాబు, వెంకటేష్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, , , అఖిల్ అక్కినేని దేశభక్తి రగిలిస్తూ, జాతీయ స్ఫూర్తి నింపేలా తమ తమ సందేశాలు పోస్ట్ చేశారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3kMDWrj

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....