Friday, 14 August 2020

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం భార్యకు కరోనా పాజిటివ్

సినీ ఇండస్ట్రీలో కరోనా కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులంతా వైరస్ బారిన పడుతున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా బారిన పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం మనందరికీ తెలుసు. అయితే తాజాగా ఆయన సతీమణి సావిత్రి బాల సుబ్రహ్మణ్యం కూడా కరోనా వైరస్ బారిన పడ్డారు. కొన్నిరోజుల కిందటే బాల సుబ్రహ్మణ్యంకు వైరస్ సోకింది. ఇప్పుడు ఆయన భార్య కూడా కోవిడ్ బారిన పడ్డారు. బాలుకు పాజిటివ్ రావడతో కుటుంబ సభ్యులకు టెస్టులు నిర్వహించారు. దీంతో బాలు సతీమణి సావిత్రికి పాజిటివ్ అని తేలింది. దీంతో ఆమెను చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్పించారు. బాలు భార్య కూడా ఇప్పుడు వైరస్ బారిన పడటం అభిమానులకు మరింత ఆందోళనకు గురిచేస్తోంది. తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని వీడియో ద్వారా తెలిపారు. ఆ వీడియోలో ఆయన మాట్లాడుతూ.. కొన్ని రోజులుగా తనకు జ్వరం వచ్చి పోతోందని.. జ్వరంతో పాటు దగ్గుతో కూడా బాధపడుతున్నానని.. దీంతో వైద్య పరీక్షలు చేయించుకోగా తనకు కరోనా సోకినట్టు నిర్ధారణ అయిందని తెలిపాడు. ఈ సందర్భంగా ఆయన తన అభిమానులు, శ్రేయోభిలాషులకు విన్నవిస్తూ.. ఎలాంటీ ఆందోళన చెందవద్దని.. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని తెలిపాడు. Read More: అయితే రెండు రోజుల నుంచి బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్యం క్షీణించిందని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ వార్తలపై ఆయన కుమారుడు చరణ్ స్పందించారు. తన తండ్రి ఆరోగ్యం గురించి ఆందోళన వద్దన్నారు. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామన్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందన్నారు. మరోవైపు బాలు త్వరగా కోలుకోవాలని సినీ ప్రముఖులంతా కోరుకుంటున్నారు. ఇళయరాజా, చిరంజీవి సోషల్ మీడియాలో మెసేజ్ పెడుతున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2CurVW5

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....