Sunday, 16 August 2020

నాన్న ఇంకా లైఫ్ సపోర్ట్‌పైనే.. అందరినీ గుర్తుపడుతున్నారు: ఎస్పీ చరణ్

గానగంధర్వుడు, దిగ్గజ గాయకుడు కరోనాతో పోరాడుతోన్న విషయం తెలిసిందే. చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్‌లో ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని తెలియడంతో తెలుగు, తమిళ సంగీత ప్రియులు, సినీ ప్రముఖులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. బాలు త్వరగా కోలుకొని ఇంటికి తిరిగి రావాలని మాస్ట్రో ఇళయరాజా, ఎ.ఆర్.రెహమాన్, కమల్ హాసన్, దేవిశ్రీ ప్రసాద్, తమన్.. ఇలా ఎంతో మంది సినీ ప్రముఖులు ఆ దేవుడిని ప్రార్థించారు. అయితే, బాలసుబ్రహ్మణ్యం పరిస్థితి కాస్త కుదుటపడిందని.. ఆయన వైద్యానికి స్పందిస్తున్నారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. వాటిని ఖరారు చేస్తూ బాలు కుమారుడు ఎస్పీ చరణ్ ఒక వీడియో మెసేజ్‌ను విడుదల చేశారు. తన తండ్రిని ఆదివారం మూడో అంతస్తులోని ఐసీయూ నుంచి ఆరో అంతస్తులోని ప్రత్యేక ఐసీయూలోకి మార్చారని చరణ్ చెప్పారు. ప్రస్తుతం నాన్న డాక్టర్లకు థంబ్స్ అప్ చూపిస్తున్నారని, డాక్టర్లను గుర్తుపడుతున్నారని చరణ్ తెలిపారు. బాలు ఇంకా లైఫ్ సపోర్ట్‌పైనే ఉన్నారని, కాస్త మెరుగ్గా ఊపిరి పీల్చుకుంటున్నారని చరణ్ వెల్లడించారు. Also Read: తన తండ్రి ఆరోగ్యంలో ఈ మార్పుపై డాక్టర్లు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. డాక్టర్లు ఎంతో కష్టపడుతున్నారని.. నాన్న కోలుకోవడానికి కాస్త సమయం పడుతుందని తెలిపారు. ఒకటి రెండు రోజుల్లో నయంకాదని.. ఒక వారం రోజులు అంతకంటే ఎక్కువ సమయం పట్టొచ్చని వెల్లడించారు. అయితే, కచ్చితంగా తన తండ్రి కోలుకుని వీలైనంత త్వరగా ఇంటికి తిరిగి వస్తారన్నారు. ప్రస్తుతానికి అందరినీ గుర్తుపడుతున్నారని, త్వరలోనే మాట్లాడాతారని ఆశిస్తున్నామని చరణ్ చెప్పారు. తన తల్లి కూడా కోలుకుంటున్నారని.. మంగళ లేదా బుధవారం ఆమె డిశ్చార్జ్ అవుతారని చెప్పారు. తమపై ఇంత ప్రేమ చూపిస్తూ, తమ కోసం ప్రార్థనలు చేస్తున్నవారందరికీ ధన్యవాదాలు చెప్పారు చరణ్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2E2RcXT

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....