Sunday, 2 August 2020

100 మిలియన్ల ‘నీ కన్ను నీలి సముద్రం’.. దేవిశ్రీకి పర్ఫెక్ట్ బర్త్‌డే గిఫ్ట్

ఈ ఏడాది సంగీత ప్రియుల‌ను అమితంగా అల‌రించిన పాట‌ల్లో ‘నీ క‌ళ్లు నీలి స‌ముద్రం’ ఒక‌టి. ‘ఉప్పెన’ చిత్రం కోసం రాక్‌స్టార్ దేవిశ్రీ ‌ప్రసాద్ స్వరపరిచిన ఈ పాట ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దీనికి కారణం దేవిశ్రీ అందించిన అద్భుత‌మైన ఖ‌వ్వాలీ బాణీ.. జావేద్ అలీ మధుర గాత్రం. శ్రీ‌మ‌ణి, ర‌ఖీబ్ ఆల‌మ్ అందించిన సాహిత్యం ఈ పాట‌ను మరింత ఆక‌ర్షణీయంగా మార్చేసింది. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. ప్రస్తుతం 100 మిలియన్ వ్యూస్‌కు అత్యంత చేరువలో ఉంది. నేడు సంగీత దర్శకుడు దేవిశ్రీ పుట్టినరోజు. ఈ సందర్భంగా దేవిశ్రీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ 100 మిలియన్ల పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇదిలా ఉంటే, ‘ఉప్పెన’ చిత్రం ద్వారా సాయి ధరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్నారు. అలాగే, హీరోయిన్ కృతి శెట్టికి కూడా ఇదే తొలి సినిమా. ఇద్దరికీ ఇదే తొలి చిత్రమైన‌ప్పటికీ ‘నీ కన్ను నీలి సముద్రం’ పాట‌లో వారు ప్రద‌ర్శించిన హావ‌భావాలు అమితంగా ఆక‌ట్టుకుంటున్నాయి. సంగీతంలో త‌న అభిరుచితో, పాట‌ల‌ను ప్రెజెంట్ చేసిన విధానంతో డైరెక్టర్ బుచ్చిబాబు సానా ఇప్పటికే టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారారు. కాగా, ఈ చిత్రంలో త‌మిళ స్టార్ యాక్టర్ విజ‌య్ సేతుప‌తి ఒక కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ద‌ర్శక‌త్వంతో పాటు క‌థ‌, సంభాష‌ణ‌లు, స్క్రీన్‌ప్లేల‌ను కూడా బుచ్చిబాబు అందించిన ఈ సినిమాను సుకుమార్ రైటింగ్స్ భాగ‌స్వామ్యంతో మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో సాయిచంద్, బ్రహ్మాజీ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. షామ్‌దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఈ సినిమాకు నవీన్ నూలి ఎడిటర్. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మాతలు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3fhacyF

No comments:

Post a Comment

'Investments Of Over Rs 4 Trn To Create 100,000 Jobs'

'The size of the investments is important, but equally crucial is the number of jobs that these proposals create.' from rediff Top...