Sunday, 2 May 2021

పొద్దున్నే మూడు షాట్స్!.. ఇలాంటి సమయంలో నీ గోల ఏంది?.. మంచు లక్ష్మీపై మళ్లీ ట్రోలింగ్

సోషల్ మీడియాలో చేసే రచ్చ అందరికీ తెలిసిందే. ఈ మధ్య వరుసగా మంచు లక్ష్మీపై ట్రోలింగ్ జరుగుతూ వస్తోంది. ఏదో ఒక విషయం మీద మంచు లక్ష్మీ వెరైటీగా స్పందించడం, అది చిలికి చిలికి గాలి వానలా మారిపోవడడం జరుగుతోంది. ఇక నెటిజన్లు మంచు లక్ష్మీని దారుణంగా ఏకిపారేయడం ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. తాజాగా మంచు లక్ష్మీని మరోసారి నెటిజన్లు ట్రోల్ చేయడం మొదలుపెట్టేశారు. మొన్నటికి మొన్న కేటీఆర్ మీద మంచు లక్ష్మీ వేసిన ట్వీట్‌ను రెండు రకాలుగా నెటిజన్లు ట్రోల్ చేశారు. మంత్రి స్థానంలో ఉన్న కేటీఆర్‌ను బడ్డీ అంటూ పిలవడంపై ఆయన ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. దీంతో మంచు లక్ష్మీని ఏకిపారేశారు. ఇక కరోనాతో బాధపడుతున్న కేటీఆర్‌కు తన సినిమాలు చూడమని సలహా ఇవ్వడంపై అందరూ పగలబడి నవ్వేశారు. నీ సినిమాలు చూస్తే ముందే పోతాడు.. దానికంటే కరోనాయే బెటర్ అంటూ ఆమెను ట్రోల్ చేశారు. ఇక తన మీద వచ్చిన ట్రోలింగ్‌కు మంచు లక్ష్మీ హర్ట్ అయ్యారు. ఈ మేరకు ట్రోలర్స్ మీద విరుచుకుపడ్డారు. షిట్ అంటూ వారిని దారుణంగా తిట్టిపోశారు. అయితే మంచు లక్ష్మీ వేసే ట్వీట్లు ఎప్పుడూ కూడా ఏదో రకంగా కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్‌గా మారుతుంటాయి. అలా తాజాగా మంచు లక్ష్మీ వేసిన ట్వీట్ మీద నెటిజన్లు భగ్గుమంటున్నారు. ఉదయాన్నే టెక్విలా (మందు) మూడు షాట్స్ వేసుకున్నాక ఎవరైనా బ్లాక్ కాఫీ తాగుతారా? అని ట్వీట్ వేశారు. అలా మంచు లక్ష్మీ తాగడం గురించి ట్వీట్ వేయడం, ఇలాంటి సమయంలో వేయడంపై అందరూ ఫైర్ అవుతున్నారు. ఆక్సిజన్ దొరక్కా ఎంతో మందిప్రాణాలు కోల్పోతోన్నారు. దేశంలో పరిస్థితి దారుణంగా ఉంటే నువ్ ఇలాంటి ట్వీట్లు వేస్తున్నావా? ఏదైనా పనికొచ్చేవి చేయమంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3eQGq5G

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....