Monday, 31 May 2021

ఆయనతో రొమాన్స్ చేసే ఛాన్స్ మూడుసార్లు మిస్.. ఇప్పుడా కోరిక నెరవేరుతోంది.. ప్రియమణి ఓపెన్ కామెంట్స్

ఒకానొక సమయంలో స్టార్ హీరోలతో నటించి తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందింది . కెమెరా ముందు నటనా ప్రతిభ కనబర్చుతూనే తన అందచందాలతో అట్రాక్ట్ చేసి ప్రేక్షక లోకానికి కొత్త టేస్ట్ పరిచయం చేసింది. ఆ తర్వాత పెళ్లి చేసుకొని కొద్ది కాలం పాటు సినిమాలకు దూరంగా ఉంటూ వైవాహిక జీవితం గడిపిన ఆమె.. రీసెంట్‌గా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి స్టార్ హీరోలకు బెటర్ ఛాయిస్ అవుతోంది. ఈ నేపథ్యంలోనే రెండు పెద్ద చిత్రాల్లో నటించే అవకాశం పట్టేసిన ప్రియమణి.. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన మనసులోని మాటను బయటపెట్టింది. దగ్గుబాటి రానా- సాయిపల్లవి హీరో హీరోయిన్లుగా నటించిన 'విరాటపర్వం' సినిమాతో పాటు విక్టరీ సరసన '' సినిమాలోనూ నటించింది ప్రియమణి. తమిళంలో ‘అసుర‌న్‌’ పేరుతో విడుదలై సక్సెస్ సాధించిన సినిమాను తెలుగులో 'నారప్ప'గా ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. ఇందులో వెంకటేష్ భార్యగా ప్రియమణి కనిపించనుంది. అయితే తాజాగా ఈ రెండు సినిమాల విషయమై మాట్లాడుతూ ఈ రెండు ప్రాజెక్ట్స్ తన కెరీర్‌‌లో మైల్ స్టోన్స్ అవుతాయని ఆమె చెప్పింది. ఇక సీనియర్ హీరో వెంకటేష్‌తో నటించే అవకాశం తనకు గతంలోనే మూడుసార్లు వచ్చినా.. కొన్ని కారణాల వల్ల ఆయనతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయలేకపోయానని, ఇన్నాళ్లకు మళ్ళీ వెంకటేష్‌తో నటించే ఛాన్స్ రావడం సంతోషంగా ఉందని పేర్కొంది. ఎప్పటినుంచో వెంకీతో నటించాలనే తన కోరిక నెరవేరిందని ఆమె తెలిపింది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకొని విడుదలకు రెడీ అయినా ఈ సినిమాను కరోనా కారణంగా వాయిదా వేశారు మేకర్స్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3vGUCW2

No comments:

Post a Comment

RBI Governor: 'Rates may remain low in near to medium term'

"It is quite possible that the rates will remain low in the near to medium term, but that will depend on how conditions evolve," s...