Sunday, 30 May 2021

Rajamouli Father: పైరసీ యాప్‌తో అడ్డంగా బుక్కైన రాజమౌళి తండ్రి.. ఆడేస్తున్న నెటిజన్లు

1988- జానకి రాముడు సినిమా మొదలు.. నిన్నటి బాహుబలి.. నేటి RRR వరకూ ఎన్నో విజయవంతమైన చిత్రాలకు కథలు అందించారు రాజమౌళి తండ్రి . బొబ్బిలి సింహం, సమరసింహారెడ్డి, సింహాద్రి, సై, చత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ, మగధీర, మెర్సల్, మణికర్ణిక లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కథలు ఆయన కలం నుంచి జాలువారినవే. ప్రస్తుతం RRR చిత్రానికి పనిచేస్తున్న విజయేంద్ర ప్రసాద్.. ఆ తరువాత రాజమౌళి, మహేష్ బాబు చిత్రానికి కూడా కథ రాసే పనిలో ఉన్నారు. భాషతో సంబంధం లేకుండా పట్టున్న కథలు రాయడంతో దిట్ట అయిన విజయేంద్రప్రసాద్ ప్యాన్ ఇండియా రైటర్‌గా పాపులర్ అయ్యారు. ఇదిలాఉంటే.. తాజాగా ఆయన ఈటీవీలో ప్రసారమౌతున్న ‘’ కార్యక్రమానికి గెస్ట్‌గా వచ్చేశారు. ఈ ఎపిసోడ్ మే 31న ప్రసారం కానుండగా.. దీనికి సంబందించిన ప్రోమో వైరల్ అవుతోంది. ఇందులో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంటూ.. తనకు దర్శకుడు పూరీ జగన్నాథ్ అంటే అసూయ అంటూ ఆయనపై ఉన్న ఇష్టాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాకు బాగా నచ్చే దర్శకుడు పూరీ జగన్నాథ్.. ఆయనంటే నాకు అసూయ.. నా శత్రువును ప్రతిరోజూ చూడాలని ఆయన ఫొటో నా ఫోన్‌లో వాల్‌పేపర్‌గా పెట్టుకున్నాను’ అంటూ తన ఫోన్‌లో వాల్ పేపర్‌గా ఉన్న పూరీ ఫొటోను అలీకి చూపించారు విజయేంద్రప్రసాద్. దీంతో ఈ న్యూస్ హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఇక్కడే విజయేంద్రప్రసాద్‌కి ఓ చిక్కొచ్చి పడింది. నా ఫోన్‌లో ఉన్న వాల్ పేపర్ చూడండి అని విజయేంద్రప్రసాద్ ఫోన్ చూపిస్తే.. దాంతో పాటు ఆయన ఫోన్‌లో ఏయే యాప్‌లు ఉన్నాయా అని భూతద్దం పెట్టి మరీ వెతకడం మొదలుపెట్టారు నెటిజన్లు. అయితే ఆయన ఫోన్‌లో ప్లే ఇట్ యాప్ దర్శనం ఇవ్వడంతో... ‘రాజమౌళి గారి ఫాదర్ ఫాదర్ పైరసీ యూజ్ చేస్తున్నార్రోయ్’ అంటూ మీమ్స్ క్రియేట్స్ చేసి ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3vzcdze

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....