Saturday, 1 May 2021

ఫ్యాన్స్ బీ రెడీ.. మరో క్లాసిక్‌ వచ్చేస్తుంది.. మహేశ్-త్రివిక్రమ్ కాంబోపై ప్రకటన ఎప్పుడంటే

సూపర్‌స్టార్ ప్రస్తుతం ‘గీత గోవిందం’ ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సర్కారు వారి పాట’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఆయన దర్శకధీరుడు రాజమౌళితో సినిమా చేయనున్నాడు. అయితే ఈ మధ్యలోనే మహేశ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో మరో సినిమా చేస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ‘అతడు’, ‘ఖలేజా’ సినిమాలు వచ్చాయి. ఇందులో ‘అతడు’ కాస్త ఫర్వాలేదు అనిపించినా.. ‘ఖలేజా’ మాత్రం నిరాశపరిచింది. అప్పటి ఆడియన్స్ మైండ్‌సెట్‌కి సినిమా అంతగా ఎక్కలేదు. కానీ, ఈ రెండు సినిమాలు ఇప్పుడు టీవీలో వస్తే.. జనాలు ఛానల్ మార్చకుండా చేస్తారు అనడంలో అతిశయోక్తి లేదు. అప్పుడు ఈ సినిమాలు ఎందుకు సరిగ్గా ఆడలేదు.. అని ఇప్పుడు మహేశ్ అభిమానులు ఫీల్ అవుతున్నారు. ముఖ్యంగా ఖలేజాలో మహేశ్ కామెడీ టైమింగ్.. సినిమా కాన్సెఫ్ట్‌కి ఇప్పుడు పెద్ద ఎత్తున ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఈ రెండు సినిమాలు మహేశ్, త్రివిక్రమ్ కెరీర్‌లలోనే క్లాసిక్‌లుగా నిలిచిపోయాయి. అయితే మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో మరో సినిమా వస్తుంది అనగానే అభిమానుల్లో అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. మహేశ్ బాబు రీసెంట్‌గా చేసిన సినిమాల్లో దాదాపు క్లాస్ పాత్రల్లోనే కనిపించాడు. దీంతో దాదాపు 10 సంవత్సరాల తర్వాత మహేశ్‌తో చేస్తున్న త్రివిక్రమ్ అతన్ని పూర్తి డిఫెరంట్ రోల్‌లో చూపించేందుకు ప్లాన్ చేస్తున్నాడట. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందనుంది. ఇక ఈ సినిమాపై నేడు(మే 1న) సాయంత్రం 4.05 గంటలకు అధికారిక ప్రకటన వెలువడనుంది. మే 31న సూపర్‌స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా సినిమా టైటిల్‌ను అనౌన్స్ చేసే అవకాశం ఉంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3aTBcou

No comments:

Post a Comment

FM: 'Focus Of Budget Was To Keep Stable Growth Going'

'We kept this Budget on a larger plank, rather than on one incident, however serious.' from rediff Top Interviews https://ift.tt/F...