Sunday, 9 August 2020

నటుడు పొట్టి వీరయ్యకు జీవిత సాఫల్య పురస్కారం.. ఆర్థిక సాయం

పొట్టి వీరయ్య.. ఈ నటుడి పేరు ప్రస్తుత తరానికి తెలియకపోవచ్చు. కానీ, నిన్నటి తరానికి బాగా తెలిసిన నటుడు. ఎన్టీఆర్ నుంచి చిరంజీవి వరకు ఎంతో మంది హీరోల చిత్రాల్లో ఆయన కనిపించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కలుపుకుని 500కు పైగా చిత్రాల్లో నటించారు. ఆయన కుమార్తె కూడా కొన్ని తెలుగు చిత్రాల్లో నటించారు. పొట్టి వీరయ్య ఆర్థికంగా ఇబ్బంది పడుతోన్న సమయంలో చిరంజీవి ఆయనకు సాయం అందించారు. ప్రస్తుతం పొట్టి వీరయ్య వయసు 70 ఏళ్ల పైనే. ఈ సీనియర్ నటుడిని జీవితకాల సాఫల్య పురస్కారంతో సత్కరించారు సినీ పెద్దలు. వీబీ ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థ 2014 నుండి తెలుగు ఫిల్మ్, టీవీ డైరెక్టరీ ప్రచురిస్తూ బుల్లితెర అవార్డులతో పాటు వెండితెర అవార్డులు అందిస్తోంది. వీబీ ఎంటర్‌టైన్మెంట్స్ అధినేత విష్ణు బొప్పన ప్రతి ఏడాది లాగే ఈ ఏడాదికి సంబంధించిన సినిమా తారల డైరీని రూపొందించారు. ఈ డైరీని లేడీ డైనమిక్ డైరెక్టర్, గిన్నిస్ బుక్ అవార్డు గ్రహీత కీ.శే. శ్రీమతి విజయనిర్మల గారికి అంకితమిచ్చారు. ఈ డైరీ ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం ఫిలిం ఛాంబర్‌లోని ప్రొడ్యూసర్ కౌన్సిల్ హాల్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ప్రెసిడెంట్ నరేష్, సినీ హాస్య నటుడు బాబూ మోహన్, దర్శకుడు వి. ఎన్. ఆదిత్య, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ తుమ్మల ప్రసన్న కుమార్, ఎస్.ఆర్.ఆర్. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ అధినేత శ్రీనివాసరెడ్డి, వి.వి.కె. హౌసింగ్ అధినేత విజయ్ కుమార్, వి.బి. ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత విష్ణు బొప్పన, బీజేపీ అధికార ప్రతినిధి అనుగుల రాజేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా వి.బి. ఎంటర్‌టైన్మెంట్స్ ఫిలిం అండ్ టీవీ డైరీని నటుడు బాబూ మోహన్ ఆవిష్కరించి తొలి కాపీని ‘మా’ అధ్యక్షుడు నరేష్‌కు, రెండో కాపీని దర్శకుడు వి.ఎన్.ఆదిత్యకు అందజేసారు. అనంతరం త్వరలో జరగబోయే వెండితెర అవార్డ్స్ ఫంక్షన్ పోస్టర్‌ను నరేష్ విడుదల చేసారు. అతిథులంతా కలసి నటుడు పొట్టి వీరయ్యను లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డు‌తో సత్కరించారు. అలాగే, ఎస్.ఆర్.ఆర్. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ అధినేత శ్రీనివాసరెడ్డి ఆర్థిక సహాయం అందజేసారు. ఈయనతో పాటు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో పింఛను రాని పది మంది పేద కళాకారులకు ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమం చూసి స్పందించిన వి.వి.కె. హౌసింగ్స్ అధినేత విజయకుమార్ ‘మా’కు ఒక లక్ష రూపాయల విరాళం ప్రకటించి చెక్కును ప్రెసిడెంట్ ‌నరేష్‌కు అందజేసారు. Also Read: ఈ సందర్భంగా ముఖ్య అతిథి బాబూ మోహన్ మాట్లాడుతూ.. ‘‘ఈ సంవత్సరం డైరీని విజయ నిర్మల గారికి అంకితం ఇవ్వడం, పొట్టి వీరయ్య లాంటి కళాకారుడిని సన్మానించుకోవడం, ఈ కరోనా క్రైసిస్ టైంలో పేద కళారులకు సాయం చేయడం పట్ల విష్ణు బొప్పన‌ను అభినందిస్తున్నాను’’ అని అన్నారు. నరేష్ మాట్లాడుతూ.. ‘‘ఓ సంస్థను నడుపుతూ అందులో పేద కళాకారులను విష్ణు ఆడుకోవడం ఆనందదాయకం. ఈ కరోనా సమయంలో కూడా కష్టపడి డైరీని రూపొందించి, మా అమ్మగారికి అంకితం ఇవ్వడం, సూపర్ స్టార్ కృష్ణ గారి ఆశీస్సులు పొందడం విష్ణు పట్టుదలకు నిదర్శనం’’ అని చెప్పారు. ఇక దర్శకుడు వి.ఎప్. ఆదిత్య మాట్లాడుతూ.. ‘‘ఈ కరోనా సమయంలో ఈ కార్యక్రమానికి రావాలా వద్దా అని సంశయిస్తూ వచ్చాను. ఇక్కడికి వచ్చాక అందర్నీ చూసి ఆనందం కలిగింది. ఇంత మంచి కార్యక్రమాలు చేస్తునందుకు విష్ణును అభినందిస్తున్నాను’’ అని అన్నారు. విష్ణు బొప్పన మాట్లాడుతూ.. ‘‘ఈ 2020 డైరీని మార్చి 27న తేదీన ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. కానీ, కొవిడ్-19 కారణంగా లాక్‌డౌన్ రావడంతో వాయిదా వేసుకుని ఈరోజున కరోనా నిబంధనలకు అనుగుణంగా, సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ నిర్వహించాం. నాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’’ అని అన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2DSARVt

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....