మెగాస్టార్ పుట్టినరోజు సందడి మొదలవుతోంది. ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు జరుపుకోనున్న సంగతి తెలిసిందే. తమ అభిమాన హీరో పుట్టినరోజు నాడు సోషల్ మీడియాలో రికార్డుల మోత మోగించాలని మెగా ఫ్యాన్స్ ప్లాన్ చేసుకున్నారు. మరోవైపు చిరంజీవికి పాటతో ట్రిబ్యూట్ ఇవ్వాలని కొంత మంది ఫ్యాన్స్ ప్లాన్ చేశారు. ‘మెగాస్టార్స్ మెగా ర్యాప్’ పేరిట దీన్ని రూపొందిస్తున్నారు. ఆగస్టు 21న ఈ పాటను విడుదల చేస్తున్నారు. ఈ పాట గ్లింప్స్ను ఆదివారం లాంచ్ చేశారు. Also Read: ఈ గ్లింప్స్ చూస్తుంటే పాట అదిరిపోవడం ఖాయమని అర్థమవుతోంది. విజువల్స్, బీట్ చాలా బాగున్నాయి. ఇది మెగాస్టార్కు పర్ఫెక్ట్ బర్త్డే గిఫ్ట్ అనిపిస్తోంది. ఈ పాటను నిఖిల్ కాన్సెప్ట్స్ సంస్థ రూపొందించింది. ఫ్రీక్ మాసన్ సంగీతం సమకూర్చారు. స్కార్పియన్ ఆలపించారు. శివ చారి నిర్మించారు. ఈ గ్లింప్స్లో కొంత మంది పిల్లలు చిరంజీవి మాస్క్లు వేసుకుని, ‘జై చిరంజీవ’ అని రాసున్న జెండాలతో పరుగులు పెడుతున్నారు. గ్లింప్స్ ఆఖరిలో చిరంజీవి మాస్క్ ధరించిన ఒక పిల్లాడు ‘నమస్తే మాస్టారు’ అని చిరంజీవి స్టైల్లో చెప్పడం చాలా బాగుంది. ఇదిలా ఉంటే, లాక్డౌన్ కారణంగా చిరంజీవి ఇంట్లోనే ఉంటున్నారు. ఆయన ‘ఆచార్య’ సినిమా షూటింగ్ తాత్కాలికంగా ఆగింది. కరోనా పరిస్థితులు సద్దుమనిగాక మళ్లీ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి నిర్మాతలు. మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా ఒక కీలక పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3g2iBXp
No comments:
Post a Comment