Saturday, 22 August 2020

చిరు, మహేష్ ఇంట కొలువుదీరిన గణనాథుడు.. భార్యతో కలిసి నితిన్ గణపతి పూజ

వినాయక చవితి వచ్చిందంటే చాలు తెలుగు రాష్ట్రాల్లో ఏ వీధిలో చూసినా, ఏ గల్లీలో చూసినా కొలువుదీరిన గణనాథులు కనిపిస్తారు. భారీ విగ్రహాలు, మండపాలు ఏర్పాటుచేసి ఎంతో ఘనంగా వినాయక చవితిని జరుపుకుంటారు. కానీ, ఈసారి ఆ పరిస్థితి లేదు. కరోనా వైరస్ కారణంగా వీధుల్లో గణనాథులను ప్రతిష్టించడానికి ప్రభుత్వాలు అనుమతులు ఇవ్వలేదు. దీంతో ఎవరి ఇళ్లలో వారే వినాయక చవితిని జరుపుకుంటున్నారు. ఈ కరోనా వల్ల అందరి ఇళ్లలో మట్టి వినాయకులు కొలుదీరడం విశేషం. ఇదిలా ఉంటే, టాలీవుడ్ సెలబ్రిటీలు సైతం వినాయక చవితిని తమ ఇళ్లలో ఆనందంగా జరుపుకుంటున్నారు. తాము వినాయక చవితి జరుపుకుంటున్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొంత మంది సెలబ్రిటీలు తెలుగు ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. మెగాస్టార్ చిరంజీవి తన ఫ్యామిలీతో కలిసి వినాయక పూజ నిర్వహించారు. ఇంట్లో మట్టి వినాయకుడిని కొలువుదీర్చారు. ఈ ఫొటోలను రామ్ చరణ్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. తన తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. మరోవైపు, సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్, పిల్లలు గౌతమ్, సితార కూడా వినాయకుడికి పూజ చేశారు. చిన్న మట్టి వినాయకుడిని ఇంట్లో కొలువుదీర్చారు. అలాగే, కొత్తగా పెళ్లయిన నితిన్.. తన భార్యతో కలిసి గణనాథుడికి పూజ చేశారు. ఆ ఫొటోను ట్వీట్ చేస్తూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఇక అల్లు అర్జున్ పూజ తరవాత ఫ్యామిలీతో తీసుకున్న ఫొటోను ట్వీట్ చేసి తెలుగు ప్రేక్షకులకు వినాయ చవితి శుభాకాంక్షలు చెప్పారు. వీరితో పాటు టాలీవుడ్‌లో చాలా మంది ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. కరోనా అనే అతి పెద్ద విఘ్నం నుండి త్వరగా విముక్తి కలిగించాలని అందరి తరఫున ఆ విఘ్నేశ్వరుడిని మనసారా ప్రార్థిస్తున్నాను అని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/34mI23r

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....