Thursday, 20 August 2020

కరోనా వస్తే హాస్పటల్‌కి వెళ్లి చావన్నారు.. అందుకే అవన్నీ విరమించుకుంటున్నా: సింగర్ సునీత షాకింగ్ నిర్ణయం

సింగర్ తనకు కరోనా సోకిందంటూ క్షేమ సమాచారాన్ని తెలియజేస్తూ ఫేస్ బుక్‌లో వీడియో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే అయ్యో పాపం అనాల్సింది పోయి.. ఇప్పుడు నీకు కరోనా వస్తే ఏం చేయమంటావ్.. దీన్ని కూడా పబ్లిసిటీ కోసం వాడేస్తున్నావా?? నీకు ఇది అవసరమా?? అయినా తెలుగులో పాటలు పాడతావ్.. కాని తెలుగులో మాట్లాడటం రాదా అంటూ నెటిజన్లు ఆమెపై నెగిటివ్ కామెంట్స్ చేయడం సునీతను బాధించాయి. ఈ సందర్భంగా వీటిపై ఆమె స్పందిస్తూ.. తన ఫేస్ బుక్‌లో ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. ఇంకా ఏమేమి వినాల్సి వస్తుందో.. నాకు ఉన్నవి చాలవా? అంటూ తన బాధను వ్యక్తపరిచారు సునీత. ‘అందరికీ నమస్కారం. మొన్న నేను పెట్టిన వీడియోకి స్పందించి నా బాగోగులు కోరుకున్న నా అభిమానులందరికి కృతజ్ఞతలు. ఈ వీడియో యూట్యూబ్‌లో చెక్కర్లు కొడుతోంది. మంచిదే.. నేను తెలుగుతో పాటు తమిళ కన్నడ భాషల్లో కూడా పాటలు పాడటం వలన అక్కడకూడా అభిమానులు నాతో మాట్లాడుతూ వుంటారు. అందరికీ ఒకేసారి విషయం తెలుస్తుందని ఎక్కువ ఆంగ్లంలో మాట్లాడటం జరిగింది. కానీ విషయం వదిలేసి సమాజం లో ఉన్న చాలా మంది న్యాయనిర్ణేతలు (కోర్టులో ఉండేవారు కాదు) "ఏ తెలుగు రాదా, ఫ్యాషన్ ఆ, కారోనా వస్తే ముందు హాస్పిటల్‌కి వెళ్లి చావు.. మీడియాలో పబ్లిసిటీ కోసం అవసరమా’ లాంటి తీర్మానాలు చేస్తుంటే ఈరోజు నుండి కారోనా గురించి నా అనుభవం మరియు నేను కల్పించాలనుకున్న అవగాహన కార్యక్రమాలు విరమించుకుంటున్నాను. ఇంకా ఏం వినాల్సొస్తుందో .. వున్నవి చాలవా... గాడ్ బ్లెస్ యూ.. మీకో నమాస్కారం అంటూ ఎమోజీలను తన పోస్ట్‌లో షేర్ చేసింది సింగర్ సునీత.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3aGyeT1

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....