Sunday, 16 August 2020

మెగా బ్యాచిలర్స్ పెళ్లిళ్లపై రామ్ చరణ్ రియాక్షన్.. వరుణ్, సాయి తేజ్‌ మ్యారేజెస్‌పై ఓపెన్ కామెంట్స్

లాక్‌డౌన్ వేళ టాలీవుడ్‌లో వరుసగా పెళ్లి బాజాలు మోగుతున్నాయి. యంగ్ హీరోలంతా ఒకరి తర్వాత ఒకరుగా పెళ్లి పీటలెక్కుతున్నారు. ముందుగా నిఖిల్ తన ప్రేయసి మెడలో మూడు ముళ్ళేయగా, తర్వాత నితిన్ తన లవర్‌తో ఒక్కటయ్యాడు. ఆ వెంటనే మరో యంగ్ స్టార్ దగ్గుబాటి రానా తన ఇష్టసఖిని పెళ్లాడాడు. దీంతో ఇక టాలీవుడ్‌లో ఇంకా మిగిలి ఉన్న బ్యాచిలర్స్ పెళ్లిళ్ల గురించిన చర్చలు మొదలయ్యాయి. ఈ క్రమంలో తాజాగా ఓ మీడియాతో ఇంటరాక్ట్ అయిన మెగా పవర్ స్టార్ .. మెగా బ్యాచిలర్స్ పెళ్లిళ్లపై స్పందించారు. Also Read: ఈ ఖాళీ సమయంలో నితిన్, రానా వంటి హీరోలు పెళ్లిళ్లు చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్న రామ్ చరణ్.. ముఖ్యంగా రానా దగ్గుబాటి మంచి పని చేసి తన కుటుంబంలో అమితమైన ఆనందం నింపారని అన్నారు. ఇక తన చెల్లెలు నిహారిక- చైతన్య జోడీ చాలా బాగుందని చెప్పిన ఆయన, మెగా బ్యాచిలర్స్ పెళ్లిళ్లపై ఓపెన్ అయ్యారు. తమ ఫ్యామిలీలో ఇంకొందరు పెళ్లిళ్లకు సిద్ధంగా ఉన్నారని.. వారి మ్యారేజెస్ కోసం అందరం ఎదురు చూస్తున్నామని చెప్పారు. ముఖ్యంగా వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ పెళ్లిళ్లు ఎప్పుడెప్పుడా అనే ఆసక్తి తనలో ఉందని రామ్ చరణ్ తెలిపారు. రామ్ చరణ్ చేసిన ఈ కామెంట్స్‌తో ఇన్ని రోజులు నిహారిక పెళ్లిపై పడిన మెగా ఫ్యాన్స్ దృష్టి ఇప్పుడు వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్‌ల పెళ్లిళ్లపై పడింది. అయితే ఎలాగూ నిహారిక పెళ్లి తర్వాత కొద్దిరోజుల్లోనే పెళ్లి ఉంటుందని నాగబాబు క్లారిటీ ఇచ్చారు కాబట్టి.. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ పెళ్లి వార్త గురించే అంతా ఇంట్రెస్టింగ్‌గా ఎదురు చూస్తున్నారు. సో.. చూడాలి మరి చెర్రీ కోరిక మేరకైనా సాయి తేజ్ తన పెళ్లి వార్త చెబుతాడో.. లేదో!.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Cvu6J0

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....