ఇవాళ 74వ స్వాంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. దేశ వ్యాప్తంగా కరోనా భయంతో చాలామంది వేడుకలకు దూరమయ్యారు. కరోనా నిబంధనలు పాటించి ప్రభుత్వ కార్యాలయాల్లో వేడుకలు నిరాడంబరంగా జరుపుకున్నాయి. అందరు తమ తమ కార్యాలయాలలో జాతీయ జెండాని ఎగుర వేసి దేశభక్తిని చాటుకుంటున్నారు. తాజాగా మెగా పవర్ స్టార్ ఇండిపెండెన్స్ సెలబ్రేషన్స్లో పాల్గొన్నారు. చారిటబుల్ ట్రస్ట్లో అల్లు అరవింద్తో కలిసి ఇండిపెండెన్స్ సెలబ్రేషన్స్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహాత్ముడి ఫోటోకు పూలమాలలు వేసి రామ్ చరణ్ నివాళులర్పించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలు వైరల్ అవుతున్నాయి. ఇక ఐకమత్యం చాటుకోవడానికి 65 మంది సింగర్స్ 5 భాషలలో దేశ భక్తి పాట పాడారు. వినరా వినరా రేపిక మనదేరా అంటూ పాడిన సాంగ్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఈ పాటని రామ్ చరణ్ తన సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ఈ క్లిష్ట సమయంలో అందరం ఒక్కటే అంటూ ఐకమత్యం చాటడానికి ఇంత మంది సింగర్స్ కలిసి పని చేయడం ఆనందంగా ఉందని చరణ్ పేర్కొన్నారు. మరోవైపు స్వాంతత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా రామ్ చరణ్, చిరంజీవి ట్వీట్ చేశారు. ప్రజలందరికీ 74వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశం కోసం పోరాడి ప్రాణాలు అర్పించిన మహనీయులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు సినిమా సెలబ్రిటీలు సైతం ట్వీట్లు చేశారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3hbcOQk
No comments:
Post a Comment