Thursday, 21 May 2020

మహేష్ బాబుతో నమ్రత రొమాంటిక్ గేమ్.. ఓడిపోయిందిగా

కరోనా లాక్ డౌన్‌తో షూటింగులకు దూరమైన టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు.. తనఖాళీ సమయాన్ని ఫ్యామిలీతో సరదా సరదాగా గడుపుతున్నాు. అయితే తన ఇంట్లో జరుగుతున్న చిన్న చిన్న ఫన్నీ విషయాల్ని మహేష్ సతీమణి నర్మతా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తున్నారు. తాజాగా మహేష్‌తో ఓ గేమ్ ఆడిన నమ్రత... ఈ గేమ్‌లో తనను గెలవలేకపోతున్నానని పోస్టు చేశారు. వాస్తవానికి ఆ గేమ్‌లో తాను ఎక్స్ ఫర్ట్ అని కానీ.. ఈ అబ్బాయిని మాత్రం ఓడించలేకపోతున్నానని నమ్రత ఇనస్టాలో పోస్టు చేశారు. ఇంతకీ వీరిద్దరూ ఆడిన ఆట ఏమనుకుంటున్నారా ? అదే బ్లింక్ అండ్ యు లూజ్ కాంపిటేషన్ గేమ్. కనురెప్ప వేయకుండా ఎదుట వ్యక్తిని చూస్తూ ఉండలి. కనురెప్పలు వేయకూడదు. ఎవరు ముందుగా కళ్లార్పితే వాళ్లు ఓడినట్లే. అయితే ఈ బ్లింక్ అండ్ యు లూజ్ గేమ్ ఆడిన నమ్రత.. మహేష్ వైపు కొన్ని సెకన్ల పాటు చుస్తూ.. ఒక్కసారిగా నవ్వేసింది. దీంతో మహేష్ కూడా నవ్వుతూ.. ఉన్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అంతకు ముందు మహేష్ కుమారుడు గౌతమ్ కు సంబంధించిన మరో వీడియోను నమ్రత తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇందులో మహేశ్ బాబు తన కుమారుడు గౌతమ్‌తో కూడా ఇదే గేమ్ ఆడుతూ కనిపిస్తారు. అయితే ఘట్టమనేని గౌతం ఈ గేమ్ ఆడేటప్పుడు నవ్వు ఆపుకోలేకపోయాడు. కళ్ల రెప్పలు కొట్టకుండా ఉండలేకపోయాడు అని నమ్రత పేర్కొన్నారు. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో షూటింగులు లేకపోవడంతో ఇంట్లోనే గడుపుతున్న సినీనటుడు మహేశ్‌ బాబు ఈ ఖాళీ సమయాన్ని తమ కుటుంబ సభ్యులతో హాయిగా గడుపుతున్నాడు. ఇంట్లో తన కుమారుడు, కూతురితో ఆడుకుంటూ వీడియోలు తీసుకుంటున్నాడు. నమ్రత కూడా మహేష్ అభిమానుల కోసం సరదా సరదా వీడియోలు తీస్తూ... సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2LT13ju

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....