Saturday, 30 May 2020

జగన్ సర్కార్‌పై ఆ వ్యాఖ్యలు చేయలేదు, వారిపై కేసు పెడతా.. నటుడు రావు రమేష్ ప్రకటన

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ప్రముఖ సినీ నటుడు పేరుతో చేసిన ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిజంగా రావు రమేష్ చేసిన ట్వీట్లేనని భావించి నెటిజన్లు వేల సంఖ్యలో రీట్వీట్లు చేస్తున్నారు. ‘‘మొదటి విధ్వంసం! చాలా బాధపడ్డా.. మన ఆంధ్రప్రదేశ్ ఎటు వెళ్తుందో అని. ఇప్పటికైనా మారతారని ఆశిస్తూ - మీ రావు రమేష్’’ అంటూ ప్రజావేదిక కూల్చివేత గురించి రావు రమేష్ పేరు మీదుగా ఓ ట్వీట్ వైరల్ అవుతోంది. అలాగే ‘‘పోలవరం ప్రాజెక్ట్ వైస్సార్‌సీపీ ప్రభుత్వం ఒక సంవత్సరంలో ఎంత పని చేశారో చెప్పండి?’’ అంటూ చేసిన ట్వీట్ సైతం చక్కర్లు కొడుతోంది. అలాగే రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను హైకోర్టు తిరిగి నియమించడంపై కూడా జగన్ సర్కార్‌ను టార్గెట్ చేస్తున్న ట్వీట్ సైతం వైరల్ అయింది. ఈ నేపథ్యంలో సదరు ట్విట్టర్ ఖాతాకు అఫీషియల్ గుర్తింపు లేకపోవడంతో పలువురు రావు రమేష్‌ను సంప్రదించగా ఆ ట్వీట్ తాను చేయలేదని, అసలు తనకు సోషల్ మీడియా ఖాతాలేవీ లేవని రావు రమేష్ స్పష్టం చేశారు. ‘‘మీడియా మిత్రులకు, నన్ను, నా నటనను ప్రేమించే ప్రతి ఒక్కరికీ.. నాకు సోషల్‌ మీడియాలో ఎటువంటి ఖాతాలూ లేవు. ఫేస్‌బుక్ గాని, ట్విటర్ గాని, ఇన్‌స్టాగ్రామ్ ఇలా ఏమీ లేవు. ఈ రోజు నా పేరు మీద ఎవరో ట్విటర్‌లో పోస్టులు పెట్టారు. ఆ పోస్టులకు నాకు ఎటువంటి సంబంధమూ లేదు. దయచేసి వాటిని నమ్మకండి. ఏమైనా ఉంటే పత్రికా ముఖంగా నేనే తెలియజేస్తాను. నా పేరు మీద ఇలా చేస్తున్న వారి మీద త్వరలోనే పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టబోతున్నాను’’ అని రావు రమేష్ తెలిపారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/36Jx7Qv

No comments:

Post a Comment

When Saif Ali Khan Was 'Homeless And Penniless'

'One day, I was working in my office late in the evening when suddenly the peon comes and says Saif Ali Khan has come to meet you.' ...