Saturday, 2 May 2020

‘అన్నయ్య’ పిలుపుతో రక్తదానం చేసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ నటుడు శ్రీతేజ్

మెగాస్టార్ చిరంజీవి పిలుపు మేరకు రక్తదానం చేశారు లక్ష్మీస్ ఎన్టీఆర్ నటుడు . కరోనా మహమ్మారి విస్తరిస్తున్న వేళ దేశవ్యాప్తంగా రక్త నిల్వలు తగ్గిపోవడంతో మెగాస్టార్ చిరంజీవి స్పందించి.. ఆయన స్వయంగా రక్తదానం చేయడంతో పాటు.. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాల్సిందిగా పిలుపునిచ్చారు. ఆయన పిలుపు మేరకు ఇప్పటికే ఇండస్ట్రీకి చెందిన హీరో శ్రీకాంత్, ఆయన కుమారుడు రాకేష్, విశ్వక్ సేన్, తేజ్ గోవింద్, బెనర్జీ, నటుడు భూపాల్, గోవిందరావు, విజయ్, సురేష్ కొండేటి ఇలా ప్రముఖులు చాలా మంది రక్త దానం చేశారు. ఈ రక్త దాన కార్యక్రమంలో తానూ భాగస్వామ్యం అవుతూ.. శనివారం నాడు స్వచ్ఛదంగా ముందుకు వచ్చి చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో రక్తదానం చేశారు నటుడు శ్రీతేజ్. ఈ సందర్భంగా చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో బ్లడ్ డొనేట్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉందన్నారు హీరో శ్రీతేజ్. మెగాస్టార్ చిరంజీవి తలసేమియా పేషెంట్స్ కోసం రక్త దానం చేయవలసిందిగా పిలుపునివ్వటంతో తాను ముందుకు రావడం జరిగిందని అన్నారు శ్రీతేజ్. 13 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న శ్రీతేజ్ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంతో నటుడిగా మంచి పేరు సంపాదించారు. ఈ చిత్రంలో చంద్రబాబు పాత్రలో అద్భుత నటనను ప్రదర్శించారు. ఆర్జీవీ కంపెనీ నుంచి వచ్చిన ఈ నటుడు ఇప్పటికే పలు వైవిధ్యమైన పాత్రలు పోషించారు. ‘వంగవీటి’లో దేవినేని నెహ్రూ, ‘యన్.టి.ఆర్’లో వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి పాత్రల్లో శ్రీతేజ్ కనిపించారు. ‘యన్.టి.ఆర్’లో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి పాత్రను పోషించిన శ్రీతేజ్.. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’లో నారా చంద్రబాబు నాయుడు పాత్ర పోషించడం విశేషం. ప్రస్తుతం ఈయన ‘అక్షర’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2KPhddk

No comments:

Post a Comment

'Mark Mobius Saw India's Rise Before Other Investors'

'Mark Mobius's life was dedicated to investing.' from rediff Top Interviews https://ift.tt/V6zhcgU