టాలీవుడ్ సెలబ్రిటీల్లో ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైల్. సోషల్ మీడియా పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాక సెలబ్రిటీలు చేస్తున్న కొన్ని పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆయా పోస్టుల్లో రాసిన పదాలు జనాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఓ భయంకరమైన విషయాన్ని ప్రస్తావించిన 'మూసుకొని ఇంట్లో కూర్చుందాం' అనే హ్యాష్ ట్యాగ్ జత చేయడం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. దీంతో దీనిపై చర్చలు మొదలయ్యాయి. దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. సెకండ్ వేవ్ దాటికి జనం పిట్టల్లా రాలిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఏ రాష్ట్రంలో చూసినా అదే పరిస్థితి కనిపిస్తుండటంతో సెలబ్రిటీలంతా 'స్టే హోమ్.. స్టే సేఫ్' (ఇంట్లోనే ఉండండి.. ప్రాణాలు కాపాడుకోండి) అనే నినాదాలు ఇస్తున్నారు. కరోనా జాగ్రత్తల పట్ల జనానికి అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగానే మంచు లక్ష్మి తన ట్విట్టర్ ఖాతాలో పెట్టిన ఓ పోస్ట్ నెట్టింట సంచలనంగా మారింది. అది కాంట్రవర్సీ అయినా, సమాజానికి ఉపయోగపడే విషయమే అయినా కాస్త డిఫరెంట్గా చెప్పడం మంచు లక్ష్మికి అలవాటు. మొన్నామధ్య కేటీఆర్కి కరోనా వస్తే ఈ విరామ సమయంలో తన సినిమాలు చూడమంటూ కామెంట్ వదిలి తనలోని విలక్షణతను చాటుకున్న ఈ మంచు వారమ్మాయి.. ఇప్పుడు ఓ భయంకరమైన విషయాన్ని మోసుకొచ్చింది. లో కొత్తగా వచ్చిన N440k అనేది ప్రస్తుతం ఉన్న కోవిడ్ కంటే 10రేట్లు ఎక్కువ వేగంగా సంక్రమిస్తుందని తెలిపిన మంచు లక్ష్మి.. ఈ కొత్త తరహా వైరస్ మొదట ఆంద్రప్రదేశ్ లోని కర్నూల్ సిటీలోనే కనుగొనబడిందని, రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త వైరస్ సంక్రమించే అవకాశం ఎక్కువగా ఉందని వివరణ ఇస్తూ 'మూసుకొని ఇంట్లో కూర్చుందాం' అని ట్యాగ్ చేసింది. దీంతో ఆమె పోస్ట్ చూసిన నెటిజన్స్ మిశ్రమంగా స్పందిస్తూ కామెంట్స్ వదులుతున్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3xQ9XoV
No comments:
Post a Comment