Sunday, 2 May 2021

ఆగని కరోనా మరణాలు.. కోవిడ్‌తో మరో నిర్మాత మృతి.. విషాదంలో ఇండస్ట్రీ

రెండో దశలో వైరస్ భయంకర రీతిలో విరుచుకుపడుతోంది. ఇతర దేశాలతో పోలిస్తే.. ఈ ఏడాది భారత్‌లో ప్రతీ రోజు రికార్డు సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. అయితే ఈ సారి కరోనా వైరస్ ప్రభావం సినీ తారలపై గట్టిగానే ఉంది. ఇప్పటికే చాలా మంది కరోనా సోకి ఐసోలేషన్‌లోకి వెళ్లారు. కొందరు ప్రాణాలు కోల్పోయారు. కూడా బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ ప్రతీ ఇండస్ట్రీలో కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. టాలీవుడ్‌లో దర్శకుడు సాయి బాలాజీ, మరో యువ దర్శకుడు కుమార్ వట్టి కరోనాతో కన్నుమూశారు. ఇక ప్రభాస్‌తో సాహో సినిమాలో నటించిన బిక్రమ్ జీత్ కన్వర్ కరోనా సోకి మరణించారు. ఇక కన్నడ ఇండస్ట్రీపై కోవిడ్ ప్రభావం గట్టిగానే ఉంది. కరోనా సోకి నిర్మాత రాము మృతిచెందగా తాజాగా మరో నిర్మాత వైరస్ బారినపడి కన్నుమూశారు. నీనాస్ సతీశ్ నటిస్తున్న ‘పెట్రో మ్యాక్స్’ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఆయన కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడ్డారు. అరోగ్యం విషమించడంతో శుక్రవారం ఆయన తుది శ్వాస విడిచారు. రాజశేఖర్ మృతితో కన్నడ సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఆయన మరణంపై పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ఇక దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఇప్పటికే పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ విధించారు. పలు రాష్ట్రాల్లో రాత్రి పూట కర్ఫ్యూ, వారాంతపు లాక్‌డౌన్‌లు విధించారు. మరోవైపు కరోనా వ్యాప్తి నేపథ్యంలో సినిమా పరిశ్రమ మరోసారి కుదేలైంది. షూటింగ్‌లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలు విడుదలను వాయిదా వేసుకున్నాయి. థియేటర్లు మూతపడటంతో కొన్ని సినిమాలు నేరు ఓటీటీల్లో విడుదల అవుతున్నాయి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/33829AK

No comments:

Post a Comment

'Indian Bank Aims For Rs 25 Trl Business By Dec 2030'

'In the last one year, we have added more than Rs 1.7 trillion, and we are on track.' from rediff Top Interviews https://ift.tt/tN...