Saturday, 1 May 2021

జనాభా ఎంత ఉంది.. ఎంత వ్యాక్సిన్ అవసరమో తెలుసా?.. ప్రభుత్వంపై సిద్దార్థ్ ఫైర్

హీరో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో ఓ వర్గానికి టార్గెట్ అవుతున్నారు. అలా ప్రభుత్వం, ప్రధాని మీద విమర్శలు చేస్తున్నారనే కారణంతోనే ఆయన ఫోన్ నంబర్‌ను లీక్ చేసేశారు. అలా సిద్దార్థ్ నంబర్ బయటకు రావడంతో కొన్ని వందల కాల్స్, మెసెజ్‌లతో ఇబ్బందిపెట్టారు. ఈ విషయాన్ని స్వయంగా సిద్దార్థ్ చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు. బీజేపీ నాయకులే ఈ పని చేశారు.. నా ఫోన్ నంబర్ లీక్ చేశారు.. నాకు ఫోన్ చేసిన ప్రతీ ఒక్కరివి రికార్డ్ చేశాను.. ఏ ఒక్కరినీ వదిలిపెట్టను అంటూ సిద్దార్థ్ అందరికీ వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలో సిద్దార్థ్‌కు తమిళనాడు పోలీసులు రక్షణ కూడా కల్పించారు. అయితే తాజాగా ఓ విషయంపై కేంద్రం మీద విమర్శలు సంధించారు. ఈ క్రమంలో ఆయన వేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ప్రస్తుతం దేశంలో కరోనా ఎంతలా విజృంభిస్తోందో అందరికీ తెలిసిందే. రోజుకు లక్షల్లో కేసులు నమోదు అవుతున్నాయి. వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. వీటిని అడ్డుకునేందుకు దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను కేంద్రం చేపట్టింది. ఈ క్రమంలో కోవిన్ యాప్ ద్వారా 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరూ రిజిష్టర్ చేసుకోవాలి వ్యాక్సిన్ వేసుకోవాలని ఆదేశించారు. అయితే ఈ క్రమంలో ఆ యాప్, వెబ్ సైట్ రెండూ కూడా పని చేయకపోవడంపై అందరూ సెటైర్లు వేశారు. ఇక దేశంలో 18 ఏళ్లు నిండిన వారు ఎంత మంది ఉన్నారు.. వ్యాక్సిన్ ఎంత ఉంది.. ఇలాంటివేమీ లెక్కలు వేసుకోకుండా ఇలాంటి కార్యక్రమంపెట్టడంపై అందరూ సెటైర్లు వేస్తున్నారు. అందులో సిద్దార్థ్ వేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ప్రభుత్వం అవలంభిస్తున్న ఈ పద్దతి కంటే ఎయిర్ ఇండియాలో సీటింగ్ ఆరెంజ్మెంట్ బాగుంటుంది.. మీకు జనాభా ఎంత ఉందో తెలుసా.. ఎన్ని వ్యాక్సిన్ డోసులు అవసరమో తెలుసా? అలాంటివేమీ తెలియనప్పుడు ఇలా 18 ఏళ్లు నిండిన వారందరికీ ఒకే సారి వ్యాక్సిన్ ఇస్తామని ప్రకటించడం ఎందుకు? దీనికి బాధ్యులు ఎవరు? అని సిద్దార్థ్ ప్రశ్నించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3nKLdtG

No comments:

Post a Comment

'I Felt Enough Is Enough And Quit The BJP'

'All senior Muslim leaders of the BJP are left behind.' from rediff Top Interviews https://ift.tt/yCEdUhr