Monday, 24 August 2020

Sekhar master: యాంకర్ ప్రదీప్ ఛాలెంజ్‌పై శేఖర్ మాస్టర్ రియాక్షన్.. ఫోటోలు పోస్ట్ చేస్తూ ఇలా!!

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ బృహత్తర కార్యక్రమంలో భాగమవుతున్నారు. పలువురు నటీనటులు, దర్శకనిర్మాతలు ఎవరికి వారు పెద్దఎత్తున మొక్కలు నాటి తమ అభిప్రాయాలను సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేస్తున్నారు. పర్యావరణ సమతుల్యాన్ని కాపాడుతూ భావితరాలకు మెరుగైన వాతావరణం ప్రసాదించడంలో అంతా భాగం కావాలని పిలుపునిస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా ప్రముఖ కొరియోగ్రాఫర్ జూబ్లీహిల్స్‌లో మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ''ఒక్కడితో మొదలుపెట్టి దేశ వ్యాప్తంగా విస్తరించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. యాంకర్ ప్రదీప్ విసిరిన ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరిస్తూ జూబ్లీహిల్స్ లోని పార్క్‌‌లో మొక్కలు నాటాను. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుతున్నా'' అని తెలిపారు. ప్రతి ఒక్క డాన్సర్ ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ భాగంగా మొక్కలు నాటాలని పిలుపునిస్తూ మరో ముగ్గురు కొరియోగ్రాఫర్‌లు (సత్యం, బాబా భాస్కర్, రఘు)లకు ఈ ఛాలెంజ్ విసిరారు శేఖర్ మాస్టర్. ఈ మేరకు తమ వంతుగా మొక్కలు నాటాలని వారిని కోరారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3gt9i2B

No comments:

Post a Comment

'Don't Get Carried Away Signing A Trade Agreement'

'There is a lot of euphoria in the country after a trade agreement is signed. But it is an illusion for us. What is more important is ma...