Sunday 2 August 2020

‘చంద్రముఖి 2’పై క్రేజీ రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన లారెన్స్

సూపర్ స్టార్ రజినీకాంత్ సూపర్ హిట్ మూవీ ‘చంద్రముఖి’కి సీక్వెల్ వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సీక్వెల్‌ వార్తను నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ గతంలో ఖరారు చేశారు. అంతేకాదు, ‘చంద్రముఖి 2’లో తాను నటిస్తున్నట్టు ఈ ఏడాది ఏప్రిల్‌లో లారెన్స్ వెల్లడించారు. ‘చంద్రముఖి’కి దర్శకత్వం వహించిన పి.వాసు ఈ సీక్వెల్‌కు కూడా దర్శకత్వం వహిస్తున్నట్టు చెప్పారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోందని తెలిపారు. ఈ సినిమా కోసం తీసుకున్న అడ్వాన్స్‌ 3 కోట్ల రూపాయలను కరోనాపై పోరాటానికి విరాళంగా ఇచ్చేశారు లారెన్స్. లారెన్స్ ఈ సినిమా గురించి ప్రకటన చేసినప్పటి నుంచి రకరకాల రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. అయితే, తాజాగా ఈ సినిమాలో ప్రధాన కథానాయిక గురించి రూమర్లు వచ్చాయి. హీరోయిన్‌గా జ్యోతిక అని ఒకసారి, సిమ్రన్ అని మరోసారి, కియారా అద్వానీ అని ఇంకోసారి వార్తలు పుట్టుకొచ్చాయి. ఈ రూమర్లపై తాజాగా రాఘవ లారెన్స్ స్పందించారు. తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా వివరణ ఇచ్చారు. Also Read: ‘‘మీడియా మిత్రులందరికీ నమస్కారం. ‘చంద్రముఖి 2’ కథానాయిక గురించి చాలా రూమర్లు వస్తున్నాయి. జ్యోతిక మేడమ్, సిమ్రన్ మేడమ్ లేదంటే కియారా అద్వానీ లీడ్ రోల్ చేస్తారని అంటున్నారు. కానీ, ఈ వార్తలన్నీ అసత్యాలు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. కొవిడ్ పరిస్థితి సద్దుమణిగాక కథానాయిక గురించి నిర్మాణ సంస్థ ప్రకటన చేస్తుంది. మేం అధికారికంగా ప్రకటిస్తాం’’ అని రాఘవ లారెన్స్ తన ఫేస్‌బుక్ పోస్ట్‌లో స్పష్టం చేశారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3hYQ3PH

No comments:

Post a Comment

THE MUST READ REKHA INTERVIEW!

'At one time, I felt being a mother was the ultimate experience, a woman was not complete without it.' from rediff Top Interviews ...