Saturday, 23 May 2020

సినీ ప్రముఖులతో కిషన్ రెడ్డి కాన్ఫరెన్స్.. దేశవ్యాప్తంగా షూటింగ్స్‌కు అనుమతి ?

శనివారం కేంద్ర హోంశాఖ సహాయమంత్రి సినీ పెద్దలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్పరెన్స్‌లో సమస్యల గురించి పలువురు సినీ ప్రముఖులు చర్చించారు. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు సహా దర్శకుడు తేజ, జెమిని కిరణ్, త్రిపురనేని వరప్రసాద్, దాము, వివేక్ కూచిభొట్ల, అనిల్ శుక్ల, అభిషేక్ అగర్వాల్, శరత్, ప్రశాంత్, రవి, అనిల్ తదితరులు కిషన్ రెడ్డితో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. షూటింగ్స్ కోసం అనుమతి ఇవ్వాలని కూడా కోరగా.. తెలుగు సినిమా కాకుండా దేశవ్యాప్తంగా అనుమతి ఇవ్వడంపై నిర్ణయం తీసుకుంటామమని తెలిపారు. కశ్మీర్‌లో షూటింగ్ చేసుకునేందుకు అనుమతిస్తామని తెలిపారు. దేశవ్యాప్తంగా ఓకేసారి థియేటర్లు తెరిచేలా నిర్ణయం తీసుకుంటామని వివరించారు. ఓటీటీలో విడుదల చేసే సినిమాలకు కూడా సెన్సార్ ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. లాక్ డౌన్ ఎఫెక్ట్ సినిమా రంగంపై కూడా పడిందన్నారు కిషన్ రెడ్డి. సినిమా పైరసీపై త్వరలో అంతర్జాతీయ మీటింగ్ నిర్వహించి.. కొత్త చట్టం తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. సినీ ప్రముఖుల ప్రస్తావించిన సమస్యలపై కిషన్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. లాక్ డౌన్ 4.0లో కొన్ని కంపెనీలకు, కొన్ని కార్యాకలాపాలకు మినహాయింపులు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో సినిమా షూటింగులకు అనుమతి ఇవ్వాలని పలువురు సీనీ ప్రముఖులు శుక్రవారం తెలంగాణ కలిసి విన్నవించారు. నిన్న టాలీవుడ్ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున, అల్లు అరువింద్‌తో సహా పలువురు పెద్దలు సీఎం కేసీఆర్‌తో సమావేశమై... సినిమా నిర్మాణాలను అనుమతివ్వాలని కోరిన సంగతి తెలిసిందే. చిత్ర నిర్మాణం కోసం మూడంచెల అనుమతిని ఇచ్చేందుకు కేసీఆర్ అంగీకరించారు. జూన్ మొదటి వారం నుంచి కరోనా వైరస్ నియంత్రిత చర్యలు పాటిస్తూ సినిమాలు నిర్మించుకునేందుకు పర్మిషన్ ఇచ్చారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2A5xmcl

No comments:

Post a Comment

'Kejriwal Needs To Learn From Modi'

'The entire party is centred around one man and that is Arvind Kejriwal.' from rediff Top Interviews https://ift.tt/1G9NLJS