Sunday, 3 May 2020

రాజమౌళి ‘రామాయణం’.. ట్విట్టర్‌లో మోత.. ఆల్ ఇండియా ట్రెండ్!

‘రామాయణం’ గురించి తెలియనివారు ఎవరుంటారు. రామాయణం అంటే రాముని కథ కాదు.. ఆయన నడిచిన మార్గం. రామాయణం ఉత్తమ సంస్కారాన్ని అలవాటు చేస్తుంది. మంచి దారిలో నడిపిస్తుంది. మనిషికి మంచి నడవడిక నేర్పుతుంది. అందుకే, ప్రతి ఒక్కరూ ‘రామాయణం’ చదవాలని పెద్దలు అంటుంటారు. కానీ, ప్రతి ఒక్కరికీ పుస్తక గ్రంథాలు చదివే అలవాటు ఉండదు. అందుకే, రామాయణ మహాకావ్యం గురించి ప్రతి ఒక్కరికీ తెలియాలనే ఉద్దేశంతో ఆ గొప్ప కథను సినిమాలుగా, సీరియల్స్‌గా తీశారు. నిజం చెప్పాలంటే సినిమాలు, సీరియల్స్ ద్వారానే దేశ వ్యాప్తంగా ఏంతో మంది ప్రజలు రామాయణం గురించి తెలుసుకున్నారు. అయితే, టీవీ ప్రేక్షకుల కోసం 80వ దశకంలో దూరదర్శన్‌లో ప్రసారమైన ‘రామాయణం’ అప్పట్లో బాగా పాపులర్. ప్రపంచంలో అత్యధికంగా వీక్షించిన పౌరాణిక సీరియల్ ఇది. రామానంద్ సాగర్ దర్శకత్వంలో నిర్మితమైన ఆ భారీ సీరియల్‌ను ఈ లాక్‌డౌన్ సమయంలో దూరదర్శన్ రీ-టెలీకాస్ట్ చేసిన విషయం తెలిసిందే. మూడు దశాబ్దాల తరవాత కూడా ఈ సీరియల్‌ను భారత ప్రేక్షకులు విపరీతంగా ఆదరించారు. ఈ సీరియల్ కారణంగా దూరదర్శన్ ఎప్పుడూ లేని విధంగా టీఆర్పీలో అగ్రస్థానంలో నిలిచింది. ఏప్రిల్ 16న 7.7 కోట్ల మంది ‘రామాయణం’ను వీక్షించారు. Also Read: కాగా, దూరదర్శన్‌లో ‘రామాయణం’, ‘ఉత్తర్ రామాయణం’ సీరియల్స్ టెలీకాస్ట్ పూర్తయింది. దీంతో ఇప్పుడు ‘రామాయణం’ ఫ్యాన్స్ కొత్త డిమాండ్‌ను తెరపైకి తీసుకొచ్చారు. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ‘రామాయణం’ను రీమేక్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఆదివారం ఉదయం నుంచి ట్విట్టర్‌లో రాజమౌళి మోత మొదలైంది. #RajamouliMakeRamayan హ్యాష్ ట్యాగ్‌తో ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఇండియాలో ఇది టాప్ ట్రెండ్. ప్రస్తుతం ‘రామాయణం’ మహాకావ్యాన్ని తెరపై ఆవిష్కరించగల ఏకైక దర్శకుడు రాజమౌళి అని కీర్తిస్తున్నారు. ఆయన తప్ప ఇండియాలో మరో దర్శకుడు రామాయాణాన్ని అంత గొప్పగా తెరకెక్కించలేరని కితాబిస్తున్నారు. రామానంద్ సాగర్ అద్భుతమైన ‘రామాయణం’ను ప్రేక్షకులకు అందించారని.. ఒకవేళ రాజమౌళి తన స్టైల్లో ‘రామాయణం’ను రూపొందిస్తే అదొక మహాద్భుతం అవుతుందని ప్రశంసిస్తున్నారు. మొత్తం మీద దేశ వ్యాప్తంగా ప్రేక్షకులంతా రాజమౌళి ‘రామాయణం’ను కోరుకుంటున్నారు. Also Read: రాజమౌళి మీద దేశ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులకు ఇంత నమ్మకం కలగడానికి కారణం ‘బాహుబలి’. ఈ సినిమాతో భారతీయ సినిమా స్థాయిని ఆయన పెంచారు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. అందుకే, ‘రామాయణం’, ‘మహాభారతం’ లాంటి పౌరాణిక గాథలను తెరకెక్కించాలంటే అది ఒక్క రాజమౌళి వల్లే సాధ్యం అంటున్నారు నెటిజన్లు. అయితే, ఈ ట్వీట్ల మధ్యలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్ దూరుతున్నారు. రాముడిగా ఎన్టీఆర్ బాగుంటారని నందమూరి అభిమానులు అంటుంటే.. రామ్ చరణ్ బాగుంటారని మెగా ఫ్యాన్స్ అంటున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3bZiESh

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....