Sunday, 3 May 2020

ఫారెన్‌లో పూరితో కాజల్.. బన్నీ, అమలాపాల్ కూడా అక్కడే!! హీరోయిన్ పోస్ట్ వైరల్

కరోనా కారణంగా విధించిన ఈ లాక్‌డౌన్ పీరియడ్‌లో సెలబ్రిటీలంతా ఇంటికే పరిమితమై వారి వారి గత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు. తమ సినిమా సంగతులు, రియల్ లైఫ్ విశేషాలు ప్రేక్షకులతో పంచుకుంటూ అలరిస్తున్నారు. ఖాళీ సమయం దొరికింది కాబట్టి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ పాత ఫోటోలను షేర్ చేసి ఆసక్తి రేకెత్తిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా స్టార్ హీరోయిన్ అగర్వాల్ షేర్ చేసిన ఓ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చూడండి నేను ఎలాంటి పిక్ షేర్ చేశానో.. అప్పట్లో బార్సిలోనాలో అలా అందరం కలిసాం అంటూ ఓ ఇంట్రెస్టింగ్ ఫోటో పోస్ట్ చేసింది కాజల్. ఈ ఫొటోలో ఆమెతో పాటు అల్లు అర్జున్, ఎన్టీఆర్, అమలాపాల్, పూరి జగన్నాథ్, శ్రీను వైట్ల ఉన్నారు. అంతా కలిసి ఫారెన్ లొకేషన్‌లో ఖుషీ ఖుషీగా కనిపిస్తున్నారు. అయితే ఈ ఫోటో అప్పట్లో ''ఇద్దరమ్మాయిలతో, బాద్షా'' సినిమాలు షూటింగ్ చేస్తున్న సమయంలోనిది అని పేర్కొంటూ.. మళ్ళీ మీ అందరినీ కలవాలని ఆతృతగా ఉందని తెలిపింది కాజల్. ఎన్టీఆర్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో 2013 సంవత్సరంలో విడుదలైన 'బాద్షా' సినిమాలో కాజల్ హీరోయిన్‌గా నటించింది. అదే ఏడాది అల్లు అర్జున్, అమలాపాల్ హీరోహీరోయిన్లుగా 'ఇద్దరమ్మాయిలతో' సినిమా రూపొందించారు పూరి జగన్నాథ్. ఆ రెండు సినిమాల షూటింగ్ సమయంలో ఫారెన్ లొకేషన్ బార్సిలోనాలో దిగిన ఫోటో ఇది. పాత పిక్ కావడంతో తమ అభిమాన హీరోహీరోయిన్లను అలా చూసి సంబర పడుతున్నారు వారి వారి ఫ్యాన్స్. ప్రస్తుతం భారతీయుడు- 2 సినిమాలో కాజల్, పుష్ప సినిమాలో అల్లు అర్జున్, RRR మూవీలో ఎన్టీఆర్ నటిస్తున్నారు. పూరిజగన్నాథ్ ఫైటర్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాల షూటింగ్స్ కరోనా విజృంభణ, లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడ్డాయి. సాధారణ పరిస్థితులు రాగానే అంతా తిరిగి సెట్స్ మీదకు రానున్నారు. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2z6jkGY

No comments:

Post a Comment

'God Does Not Make People Like Mohsina Kidwai Now'

'She was not a yes person. She would tell the truth and her feelings to Indira Gandhi, and Indira Gandhi would value her opinion. The sa...