Friday, 7 May 2021

సినిమా రౌండప్: సినీ కార్మికులకు అండగా సల్మాన్.. పవన్‌ని ఫాలో అవుతున్న సూర్య.. ఛార్మి షాకింగ్ డిసిషన్

పవన్‌ని ఫాలో అవుతున్న ఇటీవల పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ నటించిన ‘వకీల్‌సాబ్’ చిత్రం భారీ సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తమిళ స్టార్ హీరో సూర్య కూడా పవన్‌కళ్యాణ్‌ని ఫాలో అవుతున్నాడట. టి.జె.జ్ఞానవేల్‌ దర్శకత్వంలో సూర్య 39వ చిత్రం రూపొందుతోంది. అందులో సూర్య... న్యాయవాదిగా కనిపించనున్నారని తెలుస్తోంది. అదే నిజమైతే ఆయన తొలిసారి ఈ పాత్రలో కనిపించినట్టు అవుతుంది. సినీ కార్మికులకు అండగా సల్మాన్.. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్ మరోసారి పెద్ద మనస్సు చాటుకున్నాడు. కరోనా కారణంగా మరోసారి సినీ పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 25 వేల మంది సినీ కార్మికులకు ఆర్థిక సహాయం అందిస్తానని సల్మాన్ ప్రకటించాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలమ్స్ కూడా మరో 35 వేల మందిని ఆదుకుంటామని ప్రకటించింది. ఇక సల్మాన్ నటించిన ‘రాధే’ చిత్రం ఈ నెల 13న విడుదల కానుంది. హీరోయిన్ షాకింగ్ డిసిషన్.. హీరోయిన్‌గా సినిమాలకు దూరంగా ఉంటున్న ఛార్మి.. డాషింగ్ దర్శకుడు పూరి జగన్నాథ్‌తో కలిసి నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. ఆ మధ్య వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ 'ఇస్మార్ట్ శంకర్’ సినిమా వీళ్లిద్దరూ నిర్మించిందే. అయితే ఎప్పుడు పెళ్లి గురించి అడిగిన ఛార్మి తనకు ఇంట్రెస్ట్ లేదనే చెబుతుండేది. అలాంటి తాను త్వరలో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాలనే షాకింగ్ డిసిషన్ తీసుకున్నట్లు టాక్ బలంగా వినిపిస్తోంది. ఓటీటీలోకి ధనుష్ ‘కర్ణన్’ తమిళ హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ చిత్రం ‘కర్ణన్’. వెనకబడిన ఓ వర్గప్రజలకు నాయకుడిగా ధనుష్ ఈ సినిమాలో మనకి కనిపించాడు. అయితే ఈ సినిమా కరోనా టైంలో విడుదల కావడంతో ఎవరూ థియేటర్లలో చూడలేదు. దీంతో సినిమా ఓటీటీలో ఎప్పుడు విడుదల అవుతుందా అని ఎదురుచూస్తున్నారు. అలాంటి వారందరికీ ఇది గుడ్‌న్యూస్. మే 14వ తేదీన కర్ణన్ అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది. ఈ సాలిడ్ ఎమోషనల్ మూవీలో రజిషా విజయన్ - లాల్ కీలక పాత్రలు పోషించారు. ‘పార్థు’ని ఇష్టపడుతున్న మహేశ్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో త్వరలో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ‘ఎస్ఎస్ఎమ్‌బీ28’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమాను హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. అయితే ఈ సినిమాకి ‘పార్థు’ అనే టైటిల్‌ని అనుకుంటున్నారట త్రివిక్రమ్. అందుకు కారణం యద్దనపూడి సులోచనారాణి నవలలు అంటే త్రివిక్రమ్‌కి చాలా ఇష్టం .. ఆ నవలల్లో ‘పార్థు’ అనే నవల అంటే ఆయనకి మరింత ఇష్టమట. అందుకే అతను సినిమాలో మహేశ్ పాత్రకి ఆ పేరు పెట్టిన ఆయన.. ఇప్పుడు ఏకంగా సినిమా టైటిల్‌గా పెట్టేందుకు ఇష్టపడుతున్నారట.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3tD6eYF

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....