Sunday, 23 May 2021

సినీ ఇండస్ట్రీలో విషాదం.. ఆయన మరణంతో ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్

కరోనాతో మరో సినీ ప్రముఖుడు మరణించారు. నిర్మాత, దర్శకుడు అయిన పి. సోమ్ శేఖర్ మరణించారు. ఈయన రామ్ గోపాల్ వర్మకు బంధువు అవుతారు. తెరకెక్కించిన రంగీలా, దావుడ్, సత్య, జంగిల్ వంటి సినిమాలకు ప్రొడక్షన్ పనులను చూసుకున్నారు. సోమ్ శేఖర్ తన తల్లికి కరోనా సోకడంతో ఆమెను జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చారు. దాని వల్ల ఆయన కూడా కరోనా బారిన పడ్డారు. ఆయన చికిత్స తీసుకుంటూనే హైద్రాబాద్‌లో కన్నుమూశారు. అతను వేరే వ్యాపారంలోకి వెళ్లడంతో చాలా ఏళ్ల నుంచి కాంటాక్ట్‌లో లేకుండా పోయారు. ఆయన నా జీవితంలో ఎంతో ముఖ్యమైన వారు, ఆయన లేరంటే ఎంతో బాధేస్తోందంటూ ఆర్జీవీ ఎమోషనల్ అయ్యారు. ఇక బోనీ కపూర్ స్పందిస్తూ.. చనిపోయారనే వార్త విని ఎంతో షాక్ అయ్యాను. తన తల్లికి కరోనా సోకడంతో ఆయన సేవ చేస్తూ వచ్చారు. తద్వారా ఆయనకు కరోనా సోకినా కూడా ఇంకా తన తల్లిని జాగ్రత్తగా చూసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలి అని ప్రార్థించారు. కోన వెంకట్ స్పందిస్తూ.. ఆయన ఎంతో మంచి మనిషి. ఆయనతో నాకెన్నో తీపి గుర్తులున్నాయి. శేఖర్ లేరనే వార్తను నేను ఇంకా జీర్ణించుకోలేకపోతోన్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అన్నారు. ఆయన కరోనా బారిన పడ్డా కూడా తల్లికి సేవ చేస్తూనే ఉన్నారు. ఇక కరోనా విషమించడంతో నేటి మధ్యాహ్నం ఆయన మరణించారు. సోమ్ శేఖర్ మృతిపై సినీ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆర్జీవీ స్పందిస్తూ.. ఆయన మరణం నాకెంతో బాధను కలిగిస్తోందని అన్నారు. ఇక జేడీ చక్రవర్తి కూడా స్పందిస్తూ.. సత్య సినిమా రోజులను గుర్తు చేసుకున్నారు. ఆయన మరణం అందరికంటే ఎక్కువగా ఆర్జీవీకే బాధను కలిగిస్తుందని అన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3ugNApw

No comments:

Post a Comment

'Pakistan Can Only Disintegrate If...'

'If this region destabilises, then we are not far away. This region should not destabilise.' from rediff Top Interviews https://if...