తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ స్టిల్ ఫోటోగ్రాఫర్ మోహన్ జీ(86) గురువారం రాత్రి కన్నుమూశారు. కరోనాతో బాధపడుతూ ఆయన తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తోంది. ఆయన మరణవార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి పేరు మాదిరెడ్డి కృష్ణ మోహన్ రావు. 1935లో గుంటూరులో పుట్టిన ఆయన.. చిన్నతనం నుంచే ఫొటోగ్రఫీ మీద ఉన్న ఆసక్తితో స్టిల్ ఫొటోగ్రాఫర్గా ఎదిగారు. తన తమ్ముడు జగన్ మోహన్ రావుతో కలసి మోహన్ జీ- జగన్ జీ పేరుతో సినిమాలకు స్టిల్ ఫోటోగ్రాఫర్గా వర్క్ చేయడం ప్రారంభించారు. దాదాపు 900 పైగా చిత్రాలకు ఈ సోదరులు కలిసి పని చేశారు. దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావుతో వీరిద్దరికీ మంచి అనుబంధం ఉండేది. అప్పట్లో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘కాడెద్దులు ఎకరం నేల’తో స్టిల్ ఫొటోగ్రాఫర్గా మోహన్జీ-జగన్ జీ సినీ ప్రస్థానం మొదలైంది. ఆ తర్వాత 'అత్తగారు కొత్త కోడలు, ముహూర్త బలం, భక్త శబరి, కొత్తకాపురం, జగత్ కిలాడీలు, చెల్లెలి కాపురం, ప్రేమాభిషేకం' లాంటి హిట్ సినిమాలకు స్టిల్ ఫొటోగ్రాఫర్స్గా పనిచేశారు. దాసరి తొలి సినిమా 'తాత మనవడు' నుండి 'ఒరేయ్ రిక్షా' వరకూ వంద సినిమాలకు ఆయనతో కలిసి పని చేశారు. తెలుగులోనే గాక పలు తమిళ, కన్నడ చిత్రాలకు కూడా వీరు స్టిల్ ఫొటోగ్రాఫర్స్గా వర్క్ చేశారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3eUqkIo
No comments:
Post a Comment