Tuesday, 4 May 2021

బుల్లితెరపై పవన్ కళ్యాణ్ కూతురి ఎంట్రీ.. సింగర్ సునీత ముందే అలా!! రేణు దేశాయ్ ఎమోషనల్

ఈ రోజుల్లో వెండితెరపై సినిమాలను ఎంత క్రేజ్ ఉందో బుల్లితెరపై వస్తున్న ప్రోగ్రామ్స్‌కి కూడా అంతే క్రేజ్ ఉంది. రకరకాల పోగ్రామ్స్ ప్లాన్ చేస్తూ ప్రేక్షకులను ఇంట్లోనే కూర్చోబెట్టి వినోదం పంచుతూ ఎంటర్‌టైన్ చేస్తున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే రోజురోజుకూ బుల్లితెర ప్రోగ్రామ్స్ హవా మరింత పెరిగిపోతోంది. అయితే తొలిసారి పవన్ కళ్యాణ్ కూతురు బుల్లితెరపై ఎంట్రీ ఇవ్వడంతో ఎమోషనల్ అయింది. రేణు దేశాయ్‌తో పవన్ కళ్యాణ్ విడాకులు తీసుకున్నాక పిల్లలు అకీరా, ఆద్య ఇద్దరూ రేణూ దగ్గరే ఉంటున్నారు. ఈ ఇద్దరూ ఇప్పుడు పెరిగి పెద్దయ్యారు. దీంతో అకీరా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ గురించి నిత్యం ఎక్కడో చోట చర్చ నడుస్తూనే ఉంది. ఈ పరిస్థితుల్లో సడెన్‌గా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చేసింది పవన్ కూతురు ఆద్య. బుల్లితెరపై ప్రసారమవుతున్న డ్రామా జూనియర్స్ కార్యక్రమానికి గెస్ట్‌గా హాజరైంది. తాజాగా ఇందుకు సంబంధించిన ప్రోమో వీడియో రిలీజ్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రేణు దేశాయ్ జడ్జిగా వ్యవహరిస్తున్న డ్రామా జూనియర్స్ ప్రోగ్రాంలో ఆద్య సందడి కనిపించబోతోంది. మదర్స్ డే స్పెషల్‌గా ఈ ఎపిసోడ్ ప్రసారం కాబోతోంది. ఆద్యకు యాంకర్ రవి గ్రాండ్ వెల్‌కమ్ చెప్పగా.. కూతురు అలా ఎంట్రీ ఇవ్వడం చూసి జడ్జి సీటు నుంచి లేచి వచ్చి ఆద్యకు స్వీట్ హగ్ ఇచ్చింది రేణూ దేశాయ్. నా బెస్ట్ డాటర్ అని ఆద్యను పొగిడేసింది. ఆద్య కూడా బెస్ట్ మదర్ అంటూ రేణుపై ప్రేమ కురిపించింది. రేణు దేశాయ్‌తో పాటు సింగర్ సునీత, దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి ఈ షోకి జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. ఫుల్ ఎపిసోడ్ మే 9న ప్రసారం కానుంది. సో.. చూడాలి మరి సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుకుగా ఉంటూ అందరినీ ఆకట్టుకునే ఆద్య, మొదటి సారి బుల్లితెరపై ఎంత అల్లరి చేస్తుందనేది!.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2SsU07W

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....